Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

డీజీపీల సమావేశంలో పోలీసు సంస్కరణలకు హామీ…కానీ అమలవుతాయా?!

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గతవారం 60వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సమావేశం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ సమావేశంలో పోలీస్ డైరెక్టర్ జనరల్స్, భారతదేశ అత్యున్నత రాజకీయ నాయకత్వం, పోలీసు, నిఘా,భద్రతా సంస్థల ఉన్నతాధికారులను ఒకచోటకు చేర్చింది. ఇందులో దేశ అంతర్గత భద్రత, తీవ్రవాద వ్యతిరేకత, పోలీసు ఆధునీకరణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్‌ సెక్యూరిటీ, మహిళా భద్రత వంటి అంశాలపై చర్చించారు, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ […]
Read more

భారత్‌-రష్యా మధ్య వాణిజ్య బంధం బలోపేతం!

న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య ఉన్న నమ్మకమైన స్నేహానికి గుర్తుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం బలోపేతానికి కృషిచేయనున్నారు. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లపాటు అంటే 2030 వరకు ఆర్థిక సహకార ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వంద బిలియన్‌ డాలర్లకు చేర్చడమే ఈ ప్రణాళిక లక్ష్యమని తెలిపారు. గత సంవత్సరం ద్వైపాక్షిక వాణిజ్యం 12% వృద్ధి చెంది, కొత్త రికార్డు స్థాపించింది. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఉంటుందని పుతిన్ ఆశాభావం […]
Read more

ఇండిగో విమాన సర్వీసుల్లో గందరగోళం…నేడు ఏకంగా 400 విమానాల రద్దు!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో గందరగోళం కొనసాగుతోంది. నేడు వివిధ విమానాశ్రయాలలో ఏకంగా 400 పైగా విమానాలను రద్దు చేసారు.పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచాయని వర్గాలు తెలిపాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. ఈ పరిణామంతో ఇండిగో 550పైగా విమానాలను రద్దు చేసినట్లయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి విమాన సర్వీసులను పూర్తిగా […]
Read more

భారతదేశ విద్యా వ్యవస్థలో సామాజిక శాస్త్రాల పతనమవుతున్నాయి!

న్యూఢిల్లీ: భారతదేశ విద్యా వ్యవస్థలో సామాజిక శాస్త్రాల పతనం అనేది ఒక క్లిష్టమైన సమస్య. వివక్షాపూరిత పాఠశాల విధానాలు (కుల, వర్గ, ప్రాంతీయ భేదాలు), వృత్తి నైపుణ్యాలపై అతిగా దృష్టి పెట్టడం, ప్రభుత్వ నిధుల కొరత, సామాజిక శాస్త్ర అధ్యయనాలను కేవలం సైద్ధాంతికంగా చూడటం దీనికి ప్రధానకారణాలుగా భావించవచ్చు. తద్వార విద్యార్థులకు సామాజిక వాస్తవాలపై అవగాహన తగ్గి, సామాజిక మార్పును ప్రోత్సహించే శక్తి తగ్గిపోతుంది, ఫలితంగా నిరుద్యోగం, సామాజిక అసమానతలు పెరుగుతాయి. ఇక్కడ సమస్య ప్రతిభ లేకపోవడం […]
Read more

‘మోడీ ప్రభుత్వం’ నిధులను నిలిపివేసినా…మమత పనితీరు అద్భుతం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు ఎన్నికల సీజన్‌. త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. టీఎంసీ పాలనలో అభివృద్ధి దిశగా పయనిస్తోంది. మరోవంక ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రభుత్వ పనితీరు నివేదిక ‘ఉన్నయనేర్ పాంచాలి’ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మమత కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం బెంగాల్‌కు కీలకమైన నిధుల కోత విధించిందని ఆరోపించారు. “దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ. 1,87,000 […]
Read more

అమెరికా సుంకాల ఒత్తిడి మధ్య పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: భారత్‌, రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని హైలైట్ చేస్తూ నిన్న సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికారు. పుతిన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మన దేశానికి రావడం ఇదే తొలిసారి. రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధినేత ఢిల్లీకి వచ్చారు. నేడు ఇరుపక్షాలు అధికారిక చర్చలు జరుపుతాయి, ఒప్పందాల మార్పిడి చేసుకుంటాయి. […]
Read more

ఆర్‌ఎస్‌ఎఫ్‌ ‘ప్రెస్ ఫ్రీడమ్ ప్రిడేటర్స్’ జాబితాలో అదానీ గ్రూప్!

న్యూఢిల్లీ: భారతదేశం సహా 180 దేశాలలో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ను ప్రచురించే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF)సంస్థ ప్రెస్ ఫ్రీడమ్ ప్రిడేటర్స్ జాబితాను ప్రచురించింది. ఇందులో రెండు భారతీయ సంస్థలైన అదానీ గ్రూప్, హిందూత్వ వెబ్‌సైట్ ఓపీఇండియా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎఫ్ ఏటా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. ఇందులో భారతదేశం 180 దేశాలలో 151వ స్థానంలో ఉంది. ‘ప్రెడేటర్స్’ జాబితాలో… “జర్నలిస్టులను చంపడం, సెన్సార్ చేయడం, జైలులో పెట్టడం, దాడి చేయడం, […]
Read more

బీజేపీకి 757 కోట్లు విరాళం ఇచ్చిన టాటా గ్రూప్!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ 2024-25లో వివిధ ఎలక్టోరల్ ట్రస్టుల నుండి రూ. 959 కోట్లు రాజకీయ విరాళాలుగా అందుకుంది. వీటిలో దాదాపు రూ. 757 కోట్లు ఒక్క టాటా గ్రూప్‌నుంచే రావడం విశేషం. ఇది కాషాయ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలలో 83% కావడం గమనార్హం. టాటా గ్రూప్ నియంత్రణలో ఉన్న ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పిఇటి) నుండి ఈ నిధులు బీజేపీకి వచ్చాయి. మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే… స్క్రోల్ ఇటీవల జరిపిన దర్యాప్తులో […]
Read more

నేటినుంచే పుతిన్‌ భారత పర్యటన!

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు, ఈ సందర్భంగా రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకం చేయనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత పుతిన్‌ మొదటి పర్యటన ఇదే. 2021 తర్వాత పుతిన్ భారతదేశానికి తొలిసారిగా చేస్తున్న ఈ పర్యటన చారిత్రాత్మకమైనది, ఇది భారతదేశం-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవం, రెండు దేశాల […]
Read more

బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ద్వారా 46 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే అవకాశం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌లో భాగంగా భారీ సంఖ్యలో పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్ 4 నుండి ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో గణన ఫారమ్‌ల డిజిటలైజేషన్ సమయంలో అందుబాటులో ఉన్న తాజా ట్రెండ్ ప్రకారం…పశ్చిమ బెంగాల్‌లో 46 లక్షలకు పైగా పేర్లు ఓటర్ల జాబితాలో తొలగించాలని ఇప్పటికే గుర్తించారు. నిన్న సాయంత్రం వరకు పూర్తయిన గణన ఫారమ్‌ల డిజిటలైజేషన్ ప్రకారం… ప్రస్తుతం ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి అర్హత ఉన్న మొత్తం […]
Read more
1 10 11 12 13 14 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.