Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

జమ్మూ కశ్మీర్‌లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్ వివాదం…బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్‌!

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో మాతా వైష్ణో దేవీ మెడికల్ కాలేజీ అడ్మిషన్‌ రగడ కొనసాగుతోంది. ఈ వివాదంలో బిజెపి మతతత్వ కోణాన్ని చూపుతోందని కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ యూనిట్ ఆరోపించింది. కేంద్రం, శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు వైఫల్యాల నుండి దృష్టిని మరల్చడానికి కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఆగ్రహంజమ్మూకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణో దేవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్‌లో ఈ సంవత్సరం 50 ఎంబీబీఎస్‌ మంజూరు అయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి 42 […]
Read more

రాజ్యాంగ బలోపేతానికి ప్రధాని మోడీ విజ్ఞప్తి… దానిని కాపాడుతామని రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ!

న్యూఢిల్లీ: దేశం యావత్తు నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈమేరకు పార్టీలకు అతీతంగా నాయకులు రాజ్యాంగం, దాని విలువలపై తమ ఆలోచనలను పంచుకున్నారు. 1949లో రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ఏటా నవంబర్ 26న ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌరులకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. “రాజ్యాంగ దినోత్సవం నాడు, మన రాజ్యాంగ నిర్మాతలకు మనం నివాళులు అర్పిస్తున్నాము. […]
Read more

పశ్చిమ బెంగాల్‌లో 14 లక్షల ఎస్‌ఐఆర్‌ ఫారమ్‌లు మిగిలిపోయాయి!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు దాదాపు 14 లక్షల SIR గణన ఫారమ్‌లు మిగిలిపోయినట్లు గుర్తించామని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు గైర్హాజరు, నకిలీ, చనిపోయిన లేదా శాశ్వతంగా బదిలీ అయినందున ఈ ఫారమ్‌లు మిగిలాయని ఒక అధికారి తెలిపారు. “మంగళవారం మధ్యాహ్నం నాటికి, ఈ సంఖ్య 13.92 లక్షలుగా ఉంది… మరిన్ని నవీకరణలు వచ్చే కొద్దీ ఈ సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంటుందని మేము ఆశిస్తున్నాము” అని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నుండి డేటాను […]
Read more

తెలంగాణలో స్థానిక పోరుకు పచ్చజెండా!

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెలలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో 1.66 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్, డిసెంబర్ 14న రెండవ దశ, డిసెంబర్ 17న మూడవ దశ పోలింగ్ జరుగుతుందని ఆమె చెప్పారు. “మొదటి […]
Read more

ఢిల్లీ కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనపై పోలీసుల జులుం!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్తా హింసాత్మకంగా మారింది. వాయు కాలుష్యం నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఇండియా గేట్‌కు సమీపంలో ఆదివారం నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దీనిలో పొలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అనేకమంది విద్యార్థులు గాయపడ్డారు. కాగా, ఈ ప్రదర్శనలో మేము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాము”, “మాకు విషం ఇవ్వడం ఆపండి” అని రాసిఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు […]
Read more

మోదీ vs మమత…బెంగాల్ యుద్ధభూమిలో బీజేపీ విభిన్న వ్యూహాలు!

కోల్‌కతా: బిహార్ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఎ) ఘన విజయం సాధించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌పై దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోటను బద్దలు కొట్టడానికి ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ తదుపరి ప్రధాన యుద్ధభూమి అని పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన సందేశం పంపారు. ప్రధాని తన అభినందన ప్రసంగంలో […]
Read more

తమిళనాడు ఘోర బస్సు ప్రమాదం…ఆరుగురు మృతి, 28 మందికి గాయాలు!

చెన్నై: తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో ఈరోజు పెను విషాదం సంభవించింది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధురై నుండి సెంకోట్టైకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు, తెన్‌కాశీ నుండి కోవిల్పట్టి వైపు వెళ్తున్న మరొక బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి, స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. మధురై నుండి సెంకోట్టైకు […]
Read more

రూపాయి విలువ ‘పతనం’… ప్రధానిపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ‘ పతనం’పై కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని ఘాటుగా విమర్శించింది. ఈ సందర్భంగా 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంది. దీనిలో ఆయన యుపిఎ పాలనను ఎగతాళి చేశారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.46 వద్ద ప్రారంభమైంది. తరువాత 89.17కి పెరిగింది, ఇది మునుపటి ముగింపు కంటే 49 పైసలు పెరిగింది. స్థానిక, ప్రపంచ ఈక్విటీలలో విస్తృతమైన అమ్మకాల ఒత్తిడి, వాణిజ్య సంబంధిత […]
Read more

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం!

న్యూఢిల్లీ: వివిధ మైలురాయి తీర్పులలో భాగమైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జస్టిస్ సూర్యకాంత్‌తో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అంతేకాదు తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల అంతర్జాతీయ బృందం హాజరవడం గమనార్హం. కాగా, జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానంలో నియమితులైన జస్టిస్ కాంత్ […]
Read more

కొత్త లేబర్‌కోడ్‌ను అమల్లోకి తెచ్చిన కేంద్రం!

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా అమలులో ఉన్న కార్మిక చట్టాల స్థానంలో 4 కొత్త లేబర్ కోడ్‌లను కేంద్రం అమలులోకి తెచ్చింది. అందులో వేతనాల కోడ్ 2019, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 ఉన్నాయి. నవంబర్ 21 నుంచి ఈ నాలుగు లేబర్ కోడ్‌లు అమలులోకి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను హేతుబద్ధం చేసినట్లయింది. ఈ సంస్కరణ […]
Read more
1 11 12 13 14 15 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.