Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఫిబ్రవరిలో మైనారిటీలపై ద్వేషపూరిత నేరాలు 60 శాతం పెరిగాయి!

హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా కనీసం 67 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి, ఇది జనవరి గణాంకాలతో పోలిస్తే 60 శాతం ఎక్కువ. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 20 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత తెలంగాణలో 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో 13 ముస్లింలపై, ఒకటి దళితులపై నమోదయ్యాయి. తెలంగాణలోని ఐదు కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఈ నెలలో బహిరంగ సభలలో నిరంతర ద్వేషపూరిత ప్రసంగాలు, అధికారంలో ఉన్న ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింలపై కాల్పులు […]
Read more

కేరళ ప్రజలకు యూడీఎఫ్ ‘సరికొత్త ఆశ’…రాహుల్ గాంధీ!

తిరువనంతపురం: రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్షేత్రస్థాయి వాస్తవాలపై కేరళలో పార్టీ నాయకులతో చర్చించారు. ఈమేరకు వారితో కలిసి అల్పాహారం ఆస్వాదిస్తున్న ఒక వీడియోను రాహుల్‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో, ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీసన్, మరికొందరు పార్టీ అభ్యర్థులతో కలిసి అల్పాహారం చేస్తూ, మేధో వలసలు, ఉద్యోగాల కొరత, ఎఫ్‌సీఆర్‌ఏకు ప్రతిపాదిత సవరణలు వంటి […]
Read more

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం… ఉత్తర భారతంలో ప్రకంపనలు!

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సిఎస్) తెలిపింది. కొన్ని సెకన్ల పాటు కొనసాగిన ఈ ప్రకంపనలు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానాలలో సంభవించాయి. ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు. రాత్రి 9.42 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్‌ ప్రాంతంలో 150 కిలోమీటర్ల లోతులో ఉందని ఎన్‌సిఎస్ తెలిపింది. ఉత్తరాదిన నిన్న […]
Read more

కశ్మీర్‌లో ఉగ్రవాదిని చంపామన్న సైన్యం…’క్రూరమైన హత్య’ అంటున్న కుటుంబం!

జహంగీర్ అలీ…🖋️ శ్రీనగర్: మధ్య కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఒక ఉగ్రవాదిని కాల్చి చంపినట్లు సైన్యం ప్రకటించిన ఒక రోజు తర్వాత, ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధాలు లేని తమ కుమారుడే మృతి చెందాడని ఆరోపిస్తూ ఒక కుటుంబం నిన్న పోలీసులను ఆశ్రయించింది. గందర్‌బల్‌లోని లార్ ప్రాంతంలోని చౌంట్‌వాలివార్ గ్రామానికి చెందిన, కామర్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ అయిన 28 ఏళ్ల రషీద్ అహ్మద్ మొఘల్ కుటుంబం, మృతి చెందిన యువకుడు తమ కుటుంబాన్ని పోషించడానికి కష్టపడి పనిచేసేవాడని వివరిస్తూ గందర్‌బల్ […]
Read more

దేశంలోకెల్లా అత్యంత రాజకీయ ప్రేరేపితమైన రాష్ట్రం బెంగాల్‌…సుప్రీంకోర్టు!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు కేవలం మూడు వారాల ముందు, ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (SIR)కు వ్యతిరేకంగా నిన్న పలు జిల్లాల్లో నిరసనలు తీవ్రమయ్యాయి. మాల్దా, జల్పైగురి, కూచ్ బెహార్, పూర్బ బర్ధమాన్‌లలో ఆందోళనకారులు రోడ్లు, హైవేలను దిగ్బంధించారు. వారు టైర్లను తగలబెడుతూ, నిశ్శబ్ద ప్రదర్శనలు నిర్వహిస్తూ, బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిజమైన ఓటర్ల పేర్లను పెద్ద ఎత్తున తొలగించారని, ఇది మైనారిటీలు, బెంగాలీ మాట్లాడే […]
Read more

చమురు, గ్యాస్ కోసం భారత్‌ ప్రపంచవ్యాప్తంగా అన్వేషించాలి…అరవింద్‌ సుబ్రమణియన్‌!

న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ వల్ల కలిగే ఆర్థిక పరిణామాలపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ద్వారా కీలకమైన ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా భారతదేశం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అధిక ద్రవ్యోల్బణం, నెమ్మదైన వృద్ధి,అధిక నిరుద్యోగాన్ని కలిపి చూపే ఒక ఆకస్మిక ఆర్థిక సంఘటన (“stagflationary shock”)ను ఎదుర్కొంటున్నాయని ఆయన హెచ్చరించారు. ఈమేరకు ఇండియా టుడే ఇంటర్వ్యూలో డాక్టర్ సుబ్రమణియన్ మాట్లాడుతూ… […]
Read more

అస్సాంలో “నిరుద్యోగం పెరిగింది”…బీజేపీపై ప్రియాంక గాంధీ విమర్శలు!

గౌహతి: అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఆరు ఆదివాసీ సమూహాలకు ఎస్టీ హోదాను ఆలస్యం చేస్తోందని, రాష్ట్రంలోని 10 లక్షల మందికి ఉచిత చికిత్స, శాశ్వత భూమి పట్టాలు ఇస్తామన్న హామీ నెరవేరలేదని ఆమె ఆరోపించారు. “బీజేపీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయలేదు. నిరుద్యోగం పెరుగుతోంది. బీజేపీ పాలనలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు,” అని దిబ్రూగఢ్ జిల్లాలోని ఖోవాంగ్ నియోజకవర్గంలో జరిగిన ఒక […]
Read more

నేటి నుంచి జనగణన తొలిదశ!

న్యూఢిల్లీ: జనగణనకు వేళైంది. నేడు దేశ వ్యాప్తంగా తొలిదశ ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఆరునెలలపాటు ఇది కొనసాగనుంది. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. తదుపరి దశ – జనాభా గణన – వచ్చే ఏడాది మార్చి 1 నుండి ప్రారంభమవుతుంది. కాగా, తుది గణనకు తొలి దశ ఒక ఫ్రేమ్‌వర్క్‌గా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో 31లక్షల ఎన్యూమరేటర్లు, సూపర్‌ వైజర్లు, లక్షమందికి పైగా జనగణన సిబ్బంది పాల్గొంటారు. […]
Read more

ఓటర్ల హైజాకింగ్‌కు బీజేపీ కుట్ర…సీఈసీకి లేఖరాసిన మమతా బెనర్జీ!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలోకి చొరబడేందుకు బీజేపీ కుట్ర పన్నిందని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈమేరకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఘాటు లేఖ రాశారు. భారత ఎన్నికల సంఘం పరోక్ష మద్దతుతో, మోసపూరిత దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ఓటర్ల జాబితాలో బయటివారిని చేర్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. బెంగాల్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు ఇది ప్రత్యక్ష ముప్పు అని పేర్కొంటూ బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం […]
Read more

రూపాయి భారీ క్షీణత!

ముంబై: 2026 ఆర్థిక సంవత్సరంలో భారత రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 9.88 శాతం క్షీణించింది. గత 14 ఏళ్లలో ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. కాగా, 2012 ఆర్థిక సంవత్సరంలో, కరెంట్ ఖాతా లోటు 4.2 శాతానికి పెరిగిన సమయంలో, దేశీయ కరెన్సీ డాలర్‌తో పోలిస్తే 12.4 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, నిరంతర విదేశీ నిధుల తరలింపు, పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచవ్యాప్తంగా బలపడుతున్న డాలర్ కారణంగా ఈ […]
Read more
1 13 14 15 16 17 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.