Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ముంబయిలో చిన్నారుల కిడ్నాప్‌ కథ సుఖాంతం!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నిన్న మూడు గంటల పాటు సాగిన కిడ్నాప్‌ డ్రామా సుఖాంతమైంది. ఈ సందర్భంగా 17 మంది పిల్లలు, ఇద్దరు పెద్దలను రక్షించారు. కాగా, కిడ్నాపర్‌ బుల్లెట్ గాయంతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే… వెబ్‌సిరీస్ రూపొందించేందుకు ఆడిషన్స్ పేరిట ఓ వ్యక్తి కొంతమంది పిల్లల్ని స్టూడియోకి రప్పించి కిడ్నాప్ చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ పిల్లల్ని కిడ్నాపర్‌ చెరనుండి విడిపించారు.పోలీసుల ఎన్‌కౌంటర్‌లో కిడ్నాపర్ రోహిత్ ఆర్య మృతిచెందాడు. పొవాయ్ ప్రాంతంలో […]
Read more

బీహార్ ఎన్నికల సందర్భంగా 15ర్యాలీలలో ప్రసంగించనున్న రాహుల్, ప్రియాంక!

న్యూఢిల్లీ: ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఎన్నికల పోటీ రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇండియా కూటమికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దాదాపు 15 ర్యాలీలలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ ప్రక్రియ చేయించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీహార్‌లో మూడు ర్యాలీలతో పాటు కొన్ని విలేకరుల సమావేశాలను కూడా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. రాహుల్ గాంధీ బుధవారం ముజఫర్‌పూర్, దర్భంగాలో రెండు […]
Read more

ఒకే వేదికపైకి రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు బీహార్‌లో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించినట్లవుతుంది. సక్రా (ముజఫర్‌పూర్), దర్భంగాలో జరగనున్న రెండు ఉమ్మడి ర్యాలీలలో మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి రాహుల్ గాంధీ వేదికను పంచుకుంటారు. ఈమేరకు బీహార్ కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ రాజేష్ రాథోడ్ మాట్లాడుతూ… ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీకి ఇదే తొలి […]
Read more

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ముప్పు… కేరళ సీఎం పినరయి విజయన్!

తిరువనంతపురం: నవంబర్‌నుంచి రెండో దశ ఎస్‌ఐఆర్‌ చేపట్టాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు, ఇది ప్రజాస్వామ్య సమగ్రతకు “తీవ్రమైన సవాలు” అని అభివర్ణించారు. ఎస్​ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాను…కేంద్రం తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఈ చర్య ఎన్నికల కమిషన్ ఉద్దేశాలపై సందేహాన్ని కలిగిస్తుందని, అంతేకాకుండా ఎన్నికల వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని విజయన్ ఆరోపించారు. ప్రస్తుత జాబితాలకు బదులుగా పాత 2002–2004 ఓటరు జాబితాల సవరణ చేయాలని […]
Read more

తీరాన్ని తాకిన తుపాను…ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు!

అమరావతి: మంథా తుఫాను తీరాన్ని తాకింది. మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. కోనసీమ జిల్లాలో ఒక చెట్టు కూలిపోవడంతో ఒక మహిళ మరణించింది. దాదాపు 76వేల మందిని సహాయ శిబిరాలకు తరలించారు, రాష్ట్ర ప్రభుత్వం 219 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని […]
Read more

నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ‘SIR’రెండో దశ…సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌!

న్యూఢిల్లీ: వివాదాస్పద ఎస్‌ఐఆర్‌ రెండో దశకు రంగం సిద్ధమైంది. నవంబర్ – ఫిబ్రవరి మధ్య మొత్తం 9 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో రెండవ దశ ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణను నిర్వహిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. వీటిలో, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ,పశ్చిమ బెంగాల్ 2026లో […]
Read more

వాషింగ్టన్ పోస్ట్‌ నివేదికను తిరస్కరించిన ఎల్‌ఐసి!

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీలలో ₹34,200 కోట్లు పెట్టుబడి పెట్టమని ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థను ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైన నివేదికను ఎల్‌ఐసి తిరస్కరించింది.ఈ నివేదిక ” నిరాధారమైనది, సత్యానికి దూరంగా ఉంది” అని ఎల్‌ఐసి తెలిపింది. అమెరికా వార్తాపత్రిక నివేదికలో సూచించినట్లుగా, అదానీ గ్రూప్‌లోకి నిధులను చొప్పించడానికి కార్పొరేషన్ కోసం ప్రభుత్వ అధికారులు ఎటువంటి ప్రతిపాదనను రూపొందించలేదని బీమా సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం మే నెలలో బీమా సంస్థ […]
Read more

దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ..నేడు ఈసీ ప్రకటన!

న్యూఢిల్లీ: బిహార్‌ తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలోనే ఓటర్ల జాబితాల సవరణ (SIR) నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. ఈ మేరకు నేటి సాయంత్రం ఈసీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 4.15 గంటలకు ఈసీ విలేకరుల సమావేశం నిర్వహిస్తుందని మాత్రమే ఆహ్వానంలో పేర్కొన్నప్పటికీ, ఓటర్ల జాబితాల ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఈ సమావేశమని అధికారులు తెలిపారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న […]
Read more

పాలస్తీనాకు సంఘీభావంగా బర్గర్‌కింగ్‌ అవుట్‌లెట్‌ వద్ద నిరసన!

హైదరాబాద్: పాలస్తీనా ఆక్రమణలో బర్గర్ కింగ్ ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలోని పలు నగరాల్లో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. బర్గర్‌కింగ్‌ ఫాస్ట్‌ఫుడ్‌చైన్‌ గత రెండేళ్లుగా లక్షా 25వేల డాలర్ల విలువైన ఉచిత ఆహారాన్ని పంపిణీ చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలకు (IDF) బహిరంగంగా మద్దతు ఇస్తోందని’ ఆరోపణలు ఉన్నాయి. ఈమేరకు ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా (IPSP) నిన్న బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌ల వెలుపల దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. హైదరాబాద్‌లో నిరసనకారులు వీధి […]
Read more

‘ఎన్‌డీఏ’ గెలిస్తే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాలేరు…తేజస్వి యాదవ్!

పాట్నా: రెండు దశాబ్దాలుగా 20 JD(U) నేతృత్వంలోని NDA రాష్ట్రంలో పాలన సాగిస్తున్నప్పటికీ బీహార్ ఇప్పటికీ “పేద” రాష్ట్రమేనని RJD నాయకుడు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. అధికారపక్షం మళ్ళీ అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని తేజస్వీ అన్నారు. నితీష్‌కుమార్‌ను బిజెపి హైజాక్ చేసిందని, గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,హోంమంత్రి అమిత్ షాలను – బీహార్‌ను “నియంత్రిస్తున్నారని” యాదవ్ ఆరోపించారు. కేంద్రం, రాష్ట్రంలో అవినీతి నాయకులను, నేరస్థులను వీళ్లిద్దరు […]
Read more
1 17 18 19 20 21 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.