Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

దేశ రాజధాని ఢిల్లీలో వంట గ్యాస్‌ కొరత… అలాంటిదేమీ లేదంటున్న ప్రభుత్వం!

న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఢిల్లీలో గ్యాస్‌ కొరత తీవ్రమైంది. స్థానికులు గ్యాస్ సిలిండర్ల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. దక్షిణ ఢిల్లీలోని సాకేత్, హౌజ్ రాణి,రద్దీగా ఉండే కల్కాజీ ప్రాంతంతో సహా అనేక ప్రదేశాల్లోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు సిలిండర్లకోసం ఏజెన్సీ ఆపరేటర్లతో గొడవకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు హింసాత్మకంగా కూడా మారాయి. ఏజెన్సీ ఆపరేటర్లు కోపంగా ఉన్న కస్టమర్లకు పరిస్థితికి తాము బాధ్యులం కాదని వివరించడానికి ప్రయత్నించారు. ఇదిలా ఉండగా…దేశంలో […]
Read more

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం!

శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు. ఈ హఠాత్పరిణామాన్ని ఆయన పార్టీ ఒక పెద్ద భద్రతా లోపంగా అభివర్ణించింది. ఈమేరకు జమ్మూలోని పురానీ మండి నివాసి కమల్ సింగ్ జామ్వాల్‌ అనే అనుమానితుడిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 సంవత్సరాలుగా అబ్దుల్లాను చంపాలని తాను ప్లాన్ చేస్తున్నానని అతను దర్యాప్తుదారులకు చెబుతున్నట్లు ఒక వీడియో చూపించింది. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన […]
Read more

లోక్‌సభ స్పీకర్ ‘ఓం బిర్లా’పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షం!

న్యూఢిల్లీ: స్పీకర్ ఓం బిర్లా పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఆయనను తొలగించాలని కోరుతూ ప్రతిపక్షం అవిశ్వా తీర్మానం ప్రవేశపెట్టింది. కాగా, ఈ పరిణామంపై అధికార పక్ష సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ కుర్చీని ఎవరు ఆక్రమించాలో ప్రతిపక్షం నిర్ణయించాలని కోరుకుంటున్నట్లు బిర్లాను సమర్థించాయి. గత నెలలో బడ్జెట్ సమావేశాల మొదటి భాగంలో 118 మంది ఎంపీలు బిర్లాను తొలగించాలని కోరుతూ నోటీసుపై సంతకం చేసిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి తీర్మానం ప్రతిపాదించబడటం […]
Read more

జూన్ 2024 నుండి ఒడిశాలో 54 మత ఘర్షణలు, 7 మూక దాడులు…అసెంబ్లీకి తెలిపిన సీఎం!

భువనేశ్వర్: ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అంటే జూన్ 2024 నుండి రాష్ట్రవ్యాప్తంగా 54 మత ఘర్షణలు, ఏడు మూక దాడుల (mob lynching) కేసులు నమోదయ్యాయని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రాష్ట్ర శాసనసభకు తెలియజేశారు. ఈ ఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలు, మత సామరస్యంపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. గౌతమ్ బుద్ధ దాస్ లేవనెత్తిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ముఖ్యమంత్రి ఈ ఘటనలకు సంబంధించిన జిల్లా వారీ వివరాలను, శాంతిభద్రతల సంస్థలు తీసుకున్న […]
Read more

ఆర్‌ఎస్‌ఎస్‌పై తీసిన చిత్రానికి యూపీలో పన్ను మినహాయింపు… ఎన్నికల లబ్ధి కోసమేనని విమర్శ!

అఖిలేష్ త్రిపాఠి….🖋️ లక్నో: ఆర్‌ఎస్‌ఎస్‌పై తీసిన “శతక్ – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు వందేళ్లు” అనే చిత్రానికి యూపీ ప్రభుత్వం భారీ పన్ను తగ్గింపును మంజూరు చేసింది. 2027 అసెంబ్లీ ఎన్నికలను హిందూత్వం, జాతీయ భద్రత అనే నినాదంతో ఎదుర్కోవాలని బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చినట్టు సమాచారం. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి మద్దతును సమీకరించడానికి రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సిద్ధమవుతున్నందున ఈ నిర్ణయం […]
Read more

కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో ఈ ముఖ్యమైన విధాన మార్పును ప్రకటించారు. తద్వారా కర్ణాటక అటువంటి పరిమితిని అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా నిలిచింది. మొబైల్‌ ఫోన్లు, సోషల్‌మీడియా వినియోగం వల్ల చిన్నారులపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక సీఎం పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ […]
Read more

బెంగాల్ గవర్నర్ రాజీనామా…షాక్‌కు గురయ్యానన్న మమతా బెనర్జీ!

కోల్‌కత: ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో విభేదాల కారణంగా వార్తల్లో నిలిచిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన పీటీఐతో మాట్లాడుతూ “గవర్నర్ కార్యాలయంలో తగినంత సమయం గడిపాను” అని అన్నారు. కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. అయితే కొత్త గవర్నర్‌ నియామకానికి ముందు తనను సంప్రదించలేదని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్రం చర్య “ప్రజాస్వామ్య సంప్రదాయాలను, రాష్ట్రాల […]
Read more

ఇస్లామోఫోబియా… ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఒక మానవ హక్కుల సంక్షోభం!

ప్రపంచ రాజకీయాలు, మీడియా, విద్యా వ్యవస్థలలో పెరుగుతున్న ఒక తీవ్రమైన సమస్య గురించి నేటి ప్రపంచం నిజాయితీగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ సమస్యే ఇస్లామోఫోబియా. ఇది కేవలం ముస్లింల పట్ల ఉన్న వ్యక్తిగత ద్వేషం లేదా అపోహ మాత్రమే కాదు; ఇది అనేక దేశాలలో రాజకీయాలు, విధానాలు, మీడియా కథనాలు, విద్యా వ్యవస్థలలో కూడా గాఢంగా నాటుకుపోయిన ఒక నిర్మాణాత్మక వివక్ష. ఇస్లాం, ముస్లింల పట్ల ఉన్న అర్థరహిత భయం, ద్వేషం లేదా పక్షపాత భావనల […]
Read more

‘మోడీ’ విధానాలతో భారతదేశంలో యుద్ధం వచ్చే ఛాన్స్‌…రాహుల్ గాంధీ!

హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రం వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ విధానాలు సరైన మార్గంలో లేవని ఆరోపించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో దేశంలో యుద్ధం వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత హెచ్చరించారు. ప్రస్తుత జాతీయ పరిస్థితిపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సభ్యులతో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ…పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. సామాజిక అంశాలపై దృష్టి […]
Read more

ఉపవాసమా, ఉత్సవమా? రమజాన్ ఆత్మను పునరావిష్కరించాల్సిన సమయం!

పవిత్ర రమజాన్ మాసం కేవలం క్యాలెండర్‌లో మారే ఒక నెల మాత్రమే కాదు; అది ఆత్మపరిశీలనను కోరుకునే ఒక ఆధ్యాత్మిక క్రతువు. ముస్లిం సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే ఈ మాసం, క్రమశిక్షణ, నైతిక విలువల మేలుకలయిక. అయితే, సమకాలీన సామాజిక పోకడలను గమనిస్తే, రమజాన్ యొక్క అసలు ఉద్దేశ్యం—ఆధ్యాత్మిక వికాసం—క్రమంగా ‘వినియోగవాద’ నీడన మరుగున పడుతోందా అనే సందేహం కలగక మానదు. ఒకవైపు పగటిపూట కఠిన నిగ్రహం, మరోవైపు రాత్రివేళ విపరీతమైన వేడుకల మధ్య ఈ […]
Read more
1 16 17 18 19 20 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.