Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కేశవరావు హత్య తర్వాత కొత్త నాయకత్వం కోసం వెతుకుతున్న మావోయిస్ట్‌లు… అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు!

హైదరాబాద్: మావోయిస్ట్‌ల దళపతి కేశవరావు మరణం తర్వాత, సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి నాయకత్వం వహించే అవకాశం ఉన్నవారిని భద్రతా దళాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఆపరేషన్ కాగర్ సమయంలో కేశవరావు అలియాస్ బసవ రాజ్ హత్య నక్సల్ ఉద్యమానికి ఒక కీలక ఘట్టంగా నిలిచింది – దశాబ్దాల సాయుధ పోరాటంలో మావోయిస్టులక లీడర్‌ లేకపోవడం ఇదే తొలిసారి. భద్రతా దళాలు ఉన్నత స్థాయి నక్సలైట్‌ను ఎన్‌కౌంటర్‌ చేయడం కూడా ఇదే మొదటిసారి. దేశం నుండి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించే […]
Read more

‘కిరు హైడల్’ కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సహా ఆరుగురిపై అభియోగాలు మోపిన సీబీఐ!

న్యూఢిల్లీ: కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కేసుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సహా మరో ఐదుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. మూడేళ్ల దర్యాప్తు తర్వాత సీబీఐ తన విచారణాంశాలను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న మాలిక్ ఇల్లు, ఇతర ఆస్తులపై సిబిఐ దాడులు చేసిన తర్వాత ఈ చార్జిషీట్ దాఖలైంది. మాలిక్‌తో పాటు, అప్పటి చెనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ […]
Read more

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత… భారత్‌లో ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన!

న్యూఢిల్లీ: పహల్గామ్‌లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న తరువాత బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ముస్లిం సమాజాన్ని, వారి సంస్థలను లక్ష్యంగా చేసుకున్న వైనం ఆందోళన రేకెత్తిస్తోంది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలను ఢీకొట్టగా, అదే సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ముస్లిం సమాజాలలో తీవ్రమైన మానవ హక్కుల ఆందోళనలను రేకెత్తించాయి. విషాదం తర్వాత, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని అధికారులు మదర్సాలు, మసీదులు, ఇతర ముస్లిం మత సంస్థలను అధికారిక అనుమతి […]
Read more

పాక్‌పై భారత్‌ దౌత్య యుద్ధం…భారత ఎంపీలు విదేశాల్లో ఎదుర్కోవాల్సిన ప్రశ్నలు!

న్యూఢిల్లీ : పహల్గామ్‌ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌పై భారత్‌ దౌత్య యుద్ధానికి దిగింది. ఉగ్ర సంస్థలకు ఆశ్రయమిస్తున్న పాక్ తీరును అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ఏడు బృందాలతో కూడిన 59 ఎంపీలు 33 దేశాల్లో పర్యటింకానున్నారు. 7 అఖిలపక్ష ఎంపీల బృందాలు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటివారంలో తిరిగి భారత్ వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని […]
Read more

ఢిల్లీ అసెంబ్లీలో సావర్కర్, దయానంద సరస్వతి, మాలవీయా చిత్రపటాలు!

న్యూఢిల్లీ: జనరల్ పర్పసెస్ కమిటీ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం తర్వాత ఢిల్లీ శాసనసభలో వీర్ సావర్కర్, మహర్షి దయానంద సరస్వతి, పండిట్ మదన్ మోహన్ మాలవీయల చిత్రపటాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ విజేందర్ గుప్తా ప్రకటించారు. గుప్తా అధ్యక్షత వహించిన జనరల్ పర్పసెస్ కమిటీ సమావేశం, ఇది “జాతీయ చిహ్నాలను” గౌరవించే తీర్మానాన్ని ఆమోదించింది. స్పీకర్‌ కార్యాలయం నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం… భారతదేశ స్వాతంత్ర్య పోరాటం, సామాజిక సంస్కరణ, విద్యా పునరుజ్జీవనానికి వారు చేసిన […]
Read more

త్రిభాష ఫార్ములా అమలు చేయనందుకు ఆగిపోయిన నిధులు…సుప్రీంకోర్టు మెట్లెక్కిన తమిళనాడు!

న్యూఢిల్లీ: కేంద్రం, తమిళనాడు మధ్య భాషా వివాదంలో మరో సంచలనాత్మక మలుపు తిరిగింది. జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేసిందని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విద్యార్థులు ఇంగ్లీష్, ప్రాంతీయ భాషతో పాటు మూడవ భాషను నేర్చుకునే త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసే జాతీయ విద్యా విధానాన్ని డిఎంకె […]
Read more

బీజేపీ ఐటీ సెల్ చీఫ్, జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు!

బెంగళూరు: బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిపై తప్పుడు సమాచారం అందించారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 192 (అల్లర్లకు కారణమయ్యే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం), 352 (శాంతిని ఉల్లంఘించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ హెడ్ శ్రీకాంత్ స్వరూప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళవారం హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు […]
Read more

కన్నడ రచయిత్రి ‘బాను ముష్తాక్’కు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్‌!

లండన్: రచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది బాను ముష్తాక్ ప్రతిష్టాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న మొదటి కన్నడ రచయిత్రి ఆమె. “హార్ట్ ల్యాంప్” అనే కథా సంకలనానికి ఈ అవార్డును అందుకున్నారు. మంగళవారం లండన్ లో అవార్డును ప్రకటించారు. ఈ బహుమతితో పాటు…. 50 వేల పౌండ్లను ప్రైజ్ మనీగా అందిస్తారు. బాను ముష్తాక్, దీపా భస్తి ప్రైజ్ మనీని సమానంగా పంచుకోనున్నారు . ముష్తాక్ తన విజయాన్ని వైవిధ్యానికి విజయంగా అభివర్ణించారు, […]
Read more

భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిన మిజోరం!

ఐజ్వాల్‌ : దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం నిలిచింది. ఈమేరకు మిజోరాం యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సమక్షంలో మిజోరాం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటించారు. ప్రస్తుతం మిజోరం అక్షరాస్యత 98.2 శాతంగా ఉంది. కాగా ఏ రాష్ట్రమైనా 95% బెంచ్ మార్కును సాధిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లుగా గుర్తిస్తారు. సమిష్టి కృషి, అంకితభావం, సమాజ సమీకరణ ఫలితంగా మిజోరం పూర్తి అక్షరాస్యత […]
Read more

గుజరాత్ రాజధానిలో వేలాది ఇళ్లు కూల్చివేత…’అమానవీయ’ చర్యను ఖండించిన ముస్లిం సంస్థలు!

గాంధీనగర్‌ : అహ్మదాబాద్‌లో అక్రమ నిర్మాణాల పేరిట అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ వేలాది ముస్లింల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున కూల్చివేత డ్రైవ్‌ను ప్రారంభించింది. మొత్తం ఏడువేలకు పైగా నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించారు. కూల్చివేతను సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించడానికి 75 బుల్డోజర్లు, 150 డంపర్లను మోహరించారు. కూల్చివేతల సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి ఏకంగా 8,000 మంది సిబ్బందితో కూడిన భారీ పోలీసు బలగాలను మోహరించారు. మానవ హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థల నుండి తీవ్ర విమర్శలు […]
Read more
1 25 26 27 28 29 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.