Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

విదేశాంగ మంత్రి జైశంకర్‌పై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్!

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌పై తృణమూల్ కాంగ్రెస్ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో అమెరికా నుండి బహిష్కృతులైన భారతీయుల చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో బంధించిన విషయాన్ని వెల్లడించడంలో విదేశాంగ మంత్రి విఫలమయ్యారని ఆరోపిస్తూ టీఎంసీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ సాగరిక ఘోష్ ఫిబ్రవరి 20న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్‌కు ఒక లేఖను సమర్పించారు, మంత్రిపై రాజ్యసభ విధాన నియమాలు, ప్రవర్తనా నియమాలలోని సంబంధిత నిబంధనలను ప్రయోగించాలని కోరారు. […]
Read more

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల్లో భయం!

హైదరాబాద్‌: భారత పార్లమెంటులో ఎంపీల సంఖ్యను పెంచే లక్ష్యంతో చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియకు దేశంలోని దక్షిణాది రాష్ట్రాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ అంశం కారణంగా దక్షిణాది ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనలను తోసిపుచ్చింది. కాగా డీలిమిటేషన్ అంశంపై ఫిబ్రవరి 23 న కోయంబత్తూరులో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ… పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. […]
Read more

హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి? త్రిభాషా విధాన వివాదంపై డిఎంకె ఎంపీ కనిమొళి!

చెన్నై: తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలనే వివాదాస్పద అంశంపై ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) సీనియర్ నాయకురాలు, లోక్‌సభ ఎంపి కనిమొళి తన పార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు, హిందీ నేర్చుకోవాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలు చేయడానికి నిరాకరించిన కారణంగా తమిళనాడుకు ఉద్దేశించిన రూ. 5,000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఆమె ఆరోపించారు. ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం […]
Read more

ముస్లిం యాజమాన్యంలోని విశ్వవిద్యాలయాలను టార్గెట్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన జెఐహెచ్ ఉపాధ్యక్షుడు!

న్యూఢిల్లీ: బిజెపి పాలిత రాష్ట్రాల్లో ముస్లిం యాజమాన్యంలో ఉన్న విశ్వవిద్యాలయాలను సెలెక్టివ్‌గా టార్గెట్ చేయడంపై జమాతే-ఇ-ఇస్లామి హింద్ ఉపాధ్యక్షుడు మాలిక్ ముహ్‌తసిమ్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం అంతటా ముస్లింలు నిర్వహిస్తున్న ప్రముఖ విద్యా సంస్థలను ప్రభావితం చేసే చట్టపరమైన చర్యలు, అరెస్టులు, ఆస్తుల జప్తులకు సంబంధించిన వరుస సంఘటనలను ముహ్‌తసిమ్ ఖాన్ ప్రస్తావించారు. అస్సాంలో యుఎస్‌టిఎం ఛాన్సలర్ మహబూబుల్ హక్ అర్ధరాత్రి అరెస్టు, రాజస్థాన్‌లో మౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయ ఛైర్‌పర్సన్‌పై వేధింపులు, గ్లోకల్ […]
Read more

తమిళనాడుకు “కొత్త ఆశ” నటుడు విజయ్… ప్రశాంత్ కిషోర్!

చెన్నై : వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సినీ నటుడు ఇళయదళపతి విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగంకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పును చూడాలనుకునే లక్షలాది మందికి టీవీకే చీఫ్ విజయ్ ఒక కొత్త ఆశ అని అన్నారు. నిన్న జరిగిన టీవీకే మొదటి వార్షికోత్సవ వేడుకకు ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. కాగా, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ద్రవిడ పార్టీలను ఓడించాలని లక్ష్యంగా […]
Read more

మరో భాషా యుద్ధానికి సిద్ధం…తమినాడు సీఎం స్టాలిన్!

చెన్నై : జాతీయ విద్యా విధానంపై తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విద్యను రాజకీయం చేస్తోందని, తమపై బలంగా హిందీ భాషను రుద్దాలని ప్రయత్నిస్తోందని , పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమినాడు మరో భాషా ఉద్యమానికి సిద్ధంగా ఉందని సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ స్థానాల పునర్విభజన అంశాన్ని చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. భారత […]
Read more

మణిపూర్ గవర్నర్‌తో శాంతి, నిరాయుధీకరణపై చర్చించాం…అరంబాయి టెంగోల్!

ఇంఫాల్/న్యూఢిల్లీ: అరంబాయి టెంగోల్ (AT) ప్రతినిధి బృందం మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి, సరిహద్దు రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి ముందుకు సాగే మార్గం గురించి చర్చించిందని ఆ సంస్థ ప్రతినిధి ఇంఫాల్‌లో విలేకరులకు తెలిపారు. ఈ విషయం ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తులు NDTVతో మాట్లాడుతూ…ఆయుధాలు అప్పగించిన తర్వాత పౌరులపై ఎటువంటి దాడులు జరగవని, కేంద్ర దళాలు, పోలీసులు ఏవైనా భద్రతా లోపాలను భర్తీ చేస్తారని, లేకుంటే పౌరులు మళ్లీ ఆయుధాలు చేపట్టాల్సి వస్తుందని అరాంబాయి […]
Read more

2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసుల్లో 80% నిర్దోషులు!

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లకు ఐదేళ్లు పూర్తవుతున్న తరుణంలో, 120 కేసుల్లో దాదాపు 80 శాతం నిర్దోషులుగా విడుదలయ్యారని ఒక నివేదిక వెల్లడించింది. బిబిసి హిందీలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ఉమన్ పొద్దార్ 126 కేసులను విశ్లేషించి, 758 హింసకు సంబంధించిన నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల స్థితిని తనిఖీ చేశారు. ఈ గణాంకాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ మత హింసలో 53 మంది మరణించారు, వారిలో 40 మంది ముస్లింలు, పదివేల మంది గాయపడి నిరాశ్రయులయ్యారు. […]
Read more

తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దకండి…కేంద్రానికి సీఎం స్టాలిన్ వార్నింగ్!

చెన్నై: జాతీయ విద్యా విధానంలో భాగంగా రూపొందించిన త్రిభాషా ఫార్ములా కింద తమిళనాడుపై హిందీని రుద్దడానికి కేంద్ర విద్యాశాఖా మంత్రి ప్రయత్నిస్తున్నారని సీఎం స్టాలిన్ విమర్శించారు. రాష్ట్రానికి హాని కలిగించే దేనిని తాను అనుమతించబోనని స్టాలిన్ అన్నారు. తమిళ గుర్తింపును సవాలు చేయవద్దని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం స్టాలిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “రాష్ట్రాలు అభివృద్ధి చెంది బలంగా మారినప్పుడు […]
Read more

భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అమెరికా సాయం…కాంగ్రెస్, బీజేపీ ప్రత్యాపరోణలు!

న్యూఢిల్లీ: భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు గత బైడెన్‌ ప్రభుత్వం రూ.181 కోట్ల నిధులు కేటాయించిందని ఇటీవల ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ(డోజ్‌) వెల్లడించింది. దీనిపై మియామిలో జరిగిన ఎఫ్‌ఐఐ సదస్సులో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు అమెరికా ఎందుకు 21 మిలియన్‌ డాలర్ల సాయం చేయాలంటూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు చేశారు. ఈ మేరకు భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను […]
Read more
1 40 41 42 43 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.