Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తీరాన్ని తాకిన తుపాను…ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు!

అమరావతి: మంథా తుఫాను తీరాన్ని తాకింది. మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. కోనసీమ జిల్లాలో ఒక చెట్టు కూలిపోవడంతో ఒక మహిళ మరణించింది. దాదాపు 76వేల మందిని సహాయ శిబిరాలకు తరలించారు, రాష్ట్ర ప్రభుత్వం 219 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని […]
Read more

నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ‘SIR’రెండో దశ…సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌!

న్యూఢిల్లీ: వివాదాస్పద ఎస్‌ఐఆర్‌ రెండో దశకు రంగం సిద్ధమైంది. నవంబర్ – ఫిబ్రవరి మధ్య మొత్తం 9 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో రెండవ దశ ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణను నిర్వహిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. వీటిలో, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ,పశ్చిమ బెంగాల్ 2026లో […]
Read more

వాషింగ్టన్ పోస్ట్‌ నివేదికను తిరస్కరించిన ఎల్‌ఐసి!

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీలలో ₹34,200 కోట్లు పెట్టుబడి పెట్టమని ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థను ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైన నివేదికను ఎల్‌ఐసి తిరస్కరించింది.ఈ నివేదిక ” నిరాధారమైనది, సత్యానికి దూరంగా ఉంది” అని ఎల్‌ఐసి తెలిపింది. అమెరికా వార్తాపత్రిక నివేదికలో సూచించినట్లుగా, అదానీ గ్రూప్‌లోకి నిధులను చొప్పించడానికి కార్పొరేషన్ కోసం ప్రభుత్వ అధికారులు ఎటువంటి ప్రతిపాదనను రూపొందించలేదని బీమా సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం మే నెలలో బీమా సంస్థ […]
Read more

దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ..నేడు ఈసీ ప్రకటన!

న్యూఢిల్లీ: బిహార్‌ తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలోనే ఓటర్ల జాబితాల సవరణ (SIR) నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. ఈ మేరకు నేటి సాయంత్రం ఈసీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 4.15 గంటలకు ఈసీ విలేకరుల సమావేశం నిర్వహిస్తుందని మాత్రమే ఆహ్వానంలో పేర్కొన్నప్పటికీ, ఓటర్ల జాబితాల ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఈ సమావేశమని అధికారులు తెలిపారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న […]
Read more

పాలస్తీనాకు సంఘీభావంగా బర్గర్‌కింగ్‌ అవుట్‌లెట్‌ వద్ద నిరసన!

హైదరాబాద్: పాలస్తీనా ఆక్రమణలో బర్గర్ కింగ్ ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలోని పలు నగరాల్లో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. బర్గర్‌కింగ్‌ ఫాస్ట్‌ఫుడ్‌చైన్‌ గత రెండేళ్లుగా లక్షా 25వేల డాలర్ల విలువైన ఉచిత ఆహారాన్ని పంపిణీ చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలకు (IDF) బహిరంగంగా మద్దతు ఇస్తోందని’ ఆరోపణలు ఉన్నాయి. ఈమేరకు ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా (IPSP) నిన్న బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌ల వెలుపల దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. హైదరాబాద్‌లో నిరసనకారులు వీధి […]
Read more

‘ఎన్‌డీఏ’ గెలిస్తే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాలేరు…తేజస్వి యాదవ్!

పాట్నా: రెండు దశాబ్దాలుగా 20 JD(U) నేతృత్వంలోని NDA రాష్ట్రంలో పాలన సాగిస్తున్నప్పటికీ బీహార్ ఇప్పటికీ “పేద” రాష్ట్రమేనని RJD నాయకుడు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. అధికారపక్షం మళ్ళీ అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని తేజస్వీ అన్నారు. నితీష్‌కుమార్‌ను బిజెపి హైజాక్ చేసిందని, గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,హోంమంత్రి అమిత్ షాలను – బీహార్‌ను “నియంత్రిస్తున్నారని” యాదవ్ ఆరోపించారు. కేంద్రం, రాష్ట్రంలో అవినీతి నాయకులను, నేరస్థులను వీళ్లిద్దరు […]
Read more

బీహార్‌లో ముస్లిం ఓటు ‘రక్షా కవచమా’ లేక ప్రాతినిధ్యం లేని ఓటు బ్యాంకా?

– ముహమ్మద్ ముజాహిద్, 9640622076 దశాబ్దాలుగా, బిహార్‌లోని ముస్లిం సమాజం ఇతరుల్లాగే ఓటు హక్కును వినియోగించుకుంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హిందుత్వ రాజకీయాలను నిలువరించగలిగే వారికే ఓటు వేయాలనే వ్యూహాత్మక ధోరణి ముస్లింలలో పెరిగింది. ఇది వారి రాజకీయ ఎంపికలో కీలకమైన మలుపు.భారత ఎన్నికల సంఘం బిహార్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు మద్దతు […]
Read more

అగ్నికి ఆహుతైన ప్రైవేటు బస్సు…20మంది మృతి!

హైదరాబాద్: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు హైవేపై బస్సుకు మంటలు అంటుకున్న ఘటనలో కనీసం 20 మంది మరణించినట్లు అనుమానం. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంనుండి బెంగళూరుకు కావేరీ ట్రావెల్ బస్సు గురువారం రాత్రి బయలుదేరింది. బస్సు సిబ్బందితో పాటు మొత్తం 43 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. హైదరాబాద్ దాటగానే చాలామంది ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు… మొత్తంగా తెల్లవారుజామున డ్రైవర్ […]
Read more

జార్ఖండ్‌లో 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న తెలంగాణ ఈగిల్ టీం!

హైదరాబాద్: రాంచీ డివిజన్‌లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)తో కలిసి తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ విభాగం – ఈగిల్ బృందం… జార్ఖండ్‌లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్న లారీని అడ్డగించి 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. అక్టోబర్ 20-21 మధ్య రాత్రి ఒక లారీలో గంజాయిని రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, తెలంగాణలోని ఖమ్మం నుండి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగిల్) బృందం ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఎఓబి) ప్రాంతానికి చేరుకున్నట్లు అధికారిక […]
Read more

భారతదేశంలో ముస్లిం సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గింది!

ముంబై: ఇటీవల, హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భారతదేశంలో ముస్లిం జనాభా అమితంగా పెరుగుతోందని అన్నారు. ఈ వాదనకు మద్దతుగా ఆయన గణాంకాలను సమర్పించారు. తరువాత, చొరబాటుదారుల వల్ల ఇలా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. “మీరు చొరబాటుదారులను ఓటు వేయడానికి అనుమతిస్తారా?” అని సభికులను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ప్రజలు “లేదు” అని ప్రతిస్పందించారు. కాగా, బీహార్‌లో చాలా మంది చొరబాటుదారులు ఉన్నారని ఎన్నికల కమిషన్ పేర్కొంది, కానీ ఎన్నికల కమిషన్ SIR నివేదికను ప్రచురించినప్పుడు, […]
Read more
1 39 40 41 42 43 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.