Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘ఎస్‌ఐఆర్‌’ ద్వారా ఏకంగా 6.5 కోట్ల మంది ఓటర్ల తొలగింపు దేనికి సంకేతం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా ఏకంగా 6.5 కోట్ల మంది ఓటర్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. 2025అక్టోబర్ 27న, భారత ఎన్నికల సంఘం, తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, 1950లో సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రవేశపెట్టినప్పటి నుండి భారతదేశం ఈ స్థాయిలో ఓటర్ల తొలగింపును ఎప్పుడూ చూడలేదు – యుద్ధాల సమయంలో… కరువు సమయంలో కూడా కాదు, […]
Read more

కలుషిత నీటి మరణాల నేపథ్యంలో నేడు ఇండోర్‌కు రాహుల్ గాంధీ!

భోపాల్: ఇండోర్‌లో కలుషిత నీటి సంక్షోభంపై రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు నగరానికి వెళుతున్నారు. ఈ పర్యటన ఇప్పటికే పార్టీలకతీతంగా తీవ్ర ప్రతిచర్యలకు దారితీసింది. రాహుల్ గాంధీ పర్యటనను స్వాగతిస్తూ, మాజీ లోక్‌సభ స్పీకర్, సీనియర్ బీజేపీ నాయకురాలు సుమిత్రా మహాజన్, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రను నొక్కి చెబుతూ సయోధ్య ధోరణిని ప్రదర్శించారు. “ప్రజాస్వామ్యం ఇలాగే పనిచేస్తుంది,” అని ఆమె అన్నారు. “ప్రతిపక్షం తన పనిని బలంగా, సమర్థవంతంగా […]
Read more

మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ కూటమి విజయం!

ముంబై: దాదాపు మూడు దశాబ్దాల పాటు అవిభక్త శివసేన ఆధిపత్యాన్ని బద్దలు కొడుతూ, భారతీయ జనతా పార్టీబృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే పూణేలో కూడా విజయం సాధించింది, అక్కడ శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వర్గాల కూటమిని చిత్తు చేసింది. మొత్తం మీద, జనవరి 15న ఎన్నికలు జరిగిన ముంబైతో సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ నేతృత్వంలోని […]
Read more

మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపుదిశగా అధికార బీజేపీ కూటమి!

ముంబయి: మూడేళ్ల విరామం తర్వాత జరిగిన బీఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. కౌంటింగ్‌లో తొలుతనుంచి బీజేపీ ముందంజలో ఉండగా…శివసేన రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక బృహన్‌ముంబయి కార్పొరేషన్‌ ఎన్నికలో అధికార పార్టీ గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల మేరకు బీజేపీ కూటమి… థాకరే సోదరులపై ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం… బీఎంసీలో బీజేపీ నేతృత్వంలోని కూటమి 56 వార్డుల్లో ముందంజలో ఉంది. బీజేపీ 42 వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, ఏక్‌నాథ్ షిండే శివసేన 14 వార్డుల్లో […]
Read more

కరూర్ తొక్కిసలాటపై విజయ్‌కు సీబీఐ సమన్లు… బీజేపీతో పొత్తుకు నిరాకరించిన దళపతి!

చెన్నై: టీవీకే ర్యాలీలో జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ…విజయ్‌ను జనవరి 19న మరో విడత విచారణకు పిలిచినప్పటికీ, ఆయన పార్టీ టీవీకే బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేసింది. విజయ్ మొదటి నుంచీ కాషాయ పార్టీని తన సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణిస్తూ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దానితో పొత్తును తోసిపుచ్చుతూనే ఉన్నారు. బీజేపీతో సంబంధాలను పునరుద్ధరించుకున్న ఏఐఏడీఎంకేతో కూడా ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన పరోక్షంగా సూచించారు. […]
Read more

పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ తీరుపై విమర్శలు గుప్పించిన బీజేపీ!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ అమలు జరుగుతున్న తీరుపై విమర్శలు గుప్పిస్తున్న అధికార టీఎంసీకి ఇప్పడు బీజేపీ కూడా జత కలిసింది. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ కొనసాగుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే రాష్ట్రంలో పార్టీకి చెందిన కీలక నాయకుడు సువేందు అధికారి ఇటీవల ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. కాగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ… ఓటర్ల జాబితాలో ఓటర్లను తొలగించడం లేదా చేర్చడంపై తమ పార్టీ కార్యకర్తలు సమర్పించిన […]
Read more

ముంబైని బీజేపీ, అదానీల ఆధీనంలోకి పోనివ్వం… థాకరే బ్రదర్స్‌!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్‌ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ఈమేరకు అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇందులో భాగంగా జరిగిన బహిరంగ సభలో శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు రాజ్ థాకరే బీజేపీని ఘాటుగా విమర్శించారు. ఆ పార్టీ విభజన రాజకీయాలను అనుసరిస్తోందని, ముంబైలోని మరాఠీ మనూస్‌ను క్రమపద్ధతిలో “ఒంటరి” చేస్తోందని ఆరోపించారు. జాతీయ పార్టీ అదానీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు భూ కబ్జాకు పాల్పడుతుందని, […]
Read more

అసంబద్ధమైన ఆధారాలతో నా భర్తను నిర్బంధించారు…సుప్రీంకోర్టుకు తెలిపిన వాంగ్‌చుక్‌ భార్య!

న్యూఢిల్లీ: సరైన అధారాలు లేకుండానే తన భర్తను నిర్బంధించారని జైలులో ఉన్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో నిన్న సుప్రీంకోర్టుకు తెలిపారు. నిర్బంధ అధికారి చెబుతున్న నాలుగు వీడియోలను వాంగ్‌చుక్‌కు అందించలేదని, ఇది అతని హక్కును ఉల్లంఘించడమేనని ఆమె కోర్టుకు తెలిపారు. ఆంగ్మో తరపున కోర్టులో హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, జస్టిస్‌లు అరవింద్ కుమార్, ప్రసన్న బి వరాలేతో కూడిన ధర్మాసనానికి వీడియోలను అందించకపోవడంతో… సలహా మండలి ముందు, అలాగే ప్రభుత్వం […]
Read more

బెంగాల్‌లో దర్యాప్తు అధికారుల”అక్రమ నిర్బంధం”… మమతా తీరుపై కోర్టుకెక్కిన ఈడీ!

కోల్‌కతా: గత వారం కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ నివాసంలో జరిగిన దాడుల సమయంలో తమ అధికారులను “అక్రమంగా నిర్బంధించారంటూ” ఈడీ నేడు సుప్రీంకోర్టులో రెండో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు నిశాంత్ కుమార్, విక్రమ్ అహ్లావత్, ప్రశాంత్ చండీలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీజీపీ రాజీవ్ కుమార్, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ, డిప్యూటీ కమిషనర్ ప్రియోబ్రతో రాయ్‌లపై […]
Read more

దృఢమైన, స్వతంత్ర విదేశాంగ విధానం కోసం నెహ్రూ చేసిన కృషిని బలహీనపరిచిన మోడీ!

భారతదేశ మానవ వనరులు, ఒక బిలియన్ కంటే ఎక్కువ జనాభా గురించి పదే పదే గొప్పలు చెప్పుకునే ప్రధాన మంత్రి మోడీ, ట్రంప్ ఆదేశాలకు లొంగిపోయారు, భారతదేశ విదేశాంగ విధానాన్ని ఎంతగానో దెబ్బతీశారు, అది ప్రజలను, మన దేశ ప్రతిష్టను దెబ్బతీసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ “సర్, నేను మిమ్మల్ని కలవవచ్చా” అని అడగడం ద్వారా అమెరికా అధ్యక్షుడుని కలవడానికి మోడీ సమయం కోరారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, మోడీ ఈ వాదనను ఖండించకపోవడం, మోడీని […]
Read more
1 3 4 5 6 7 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.