Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాల్వాన్ ఘటన తర్వాత మోదీ ప్రభుత్వం చైనాకు ‘లొంగిపోయింది’… మల్లికార్జున ఖర్గే!

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలోని అనేక కీలక రంగాలపై చైనా తన పట్టును మరింత బిగించేందుకు అనుమతించడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతదేశ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. 2020లో గాల్వాన్ ఘర్షణ జరిగినప్పటి నుండి చైనా దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా పెరిగిందని కూడా పేర్కొంది. వ్యూహాత్మక పరిశ్రమలలో భారతదేశం చైనా సరఫరాలపై నిరంతరం ఆధారపడటంపై వచ్చిన ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలవని భావిస్తున్న […]
Read more

ముస్లిం దేశమైన ఇండోనేషియా నుండి భారతదేశం నేర్చుకోగల పాఠాలు!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇండోనేషియా పర్యటన కేవలం దౌత్యంలోనే కాకుండా, మత సహజీవనంలో కూడా ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పింది. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశమైన ఇండోనేషియాలో, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన, దాదాపు 1,000 సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం ప్రంబనన్ ఉంది. ఈ ఆలయం కేవలం ఒక పురావస్తు స్మారక చిహ్నంగా మాత్రమే పరిరక్షించలేదు; ఇది ఇండోనేషియా గొప్ప నాగరిక వారసత్వంలో ఒక భాగంగా కీర్తిస్తున్నారు. […]
Read more

కోల్‌కతా ఘర్షణలు…ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించిన మమతా బెనర్జీ!

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని బారుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై కలకత్తా హైకోర్టు ఆమోదించిన నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు బీజేపీ హింసను ప్రేరేపిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు పోలీసులే పూర్తి బాధ్యులని పేర్కొంటూ, తమ పార్టీ ధిక్కార చర్యలు చేపడుతుందని ఆమె ప్రకటించారు. ర్యాలీ అనంతరం హజ్రా క్రాసింగ్ వద్ద మమతా విలేకరులతో మాట్లాడుతూ… బీజేపీ మద్దతుదారులు ఊరేగింపును పదేపదే అడ్డుకున్నారని, […]
Read more

శాశ్వత నివాస ధృవీకరణ పత్రాన్ని ప్రవేశపెట్టిన కర్ణాటక!

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన నివాసితుల కోసం శాశ్వత నివాస ధృవీకరణ పత్రం (PRC)ను ప్రవేశపెడుతూ ఒక అధికారిక ఉత్తర్వును జారీ చేసింది. ఈ ధృవీకరణ పత్రం జారీ చేయడానికి కావలసిన అర్హతా ప్రమాణాలు, విధానాన్ని వివరిస్తూ రెవెన్యూ శాఖ వివరణాత్మక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, ఈ ధృవీకరణ పత్రానికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు కనీసం 10 సంవత్సరాలు కర్ణాటకలో నిరంతరంగా నివసించి ఉండాలి. దరఖాస్తుదారుడి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన […]
Read more

రాజస్థాన్ సరిహద్దుల్లో మానవత్వం గెలిచింది!

విభజన రాజకీయాలపై హిందూ-ముస్లింలు ఐక్యంగా విజయం సాధించారు. భారతదేశ లౌకికత్వానికి, తరతరాల నాటి గంగా-జమునా తెహజీబ్ (మత సామరస్యం)కు రాజస్థాన్ పశ్చిమ సరిహద్దు జిల్లాలు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. ఇరు వర్గాల మధ్య విభేదాలు సృష్టించి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసే శక్తులకు బార్మర్, జైసల్మేర్ ప్రజలు తమ అపూర్వ ఐక్యతతో ఒక బలమైన సమాధానం ఇచ్చారు.రాజస్థాన్ సరిహద్దు బెల్ట్‌లో ‘ఆపరేషన్ స్వీప్’ పేరిట సాగిన కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసినప్పటికీ, అవి అక్కడి హిందూ-ముస్లింల మధ్య ఉన్న […]
Read more

రామ మందిర విరాళాల దొంగతనాన్ని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ‘కప్పిపుచ్చుతున్నాయి’…కాంగ్రెస్!

లక్నో: అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన విరాళాల దొంగతనాన్ని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ‘కప్పిపుచ్చడానికి’ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. పారదర్శకతను నిర్ధారించడానికి ఆలయానికి అందిన అన్ని విరాళాల వివరాలను బహిరంగపరచాలని డిమాండ్ చేసింది. ఈమేరకు ఒక పత్రికా సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ… బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ‘అనధికారిక పద్ధతిలో’ శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పరిపాలనను ‘స్వాధీనం’ చేసుకున్నాయని ఆరోపించారు. ట్రస్ట్‌ను రద్దు చేయాలని, భారత సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి […]
Read more

కేంద్రమంత్రి సహాయకుల తొలగింపుపై బీజేపీని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్!

న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యాలయం నుంచి నలుగురు వ్యక్తిగత సిబ్బందిని ఆకస్మికంగా తొలగించడం వెనుక “ప్రధాన మంత్రి చందా దో ధంధా లో” (డొనేషన్లు ఇవ్వండి, వ్యాపారాలు పొందండి) పథకం పక్కదారి పట్టిందా అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. ఈ పరిణామాన్ని “దిగ్భ్రాంతికరం”గా అభివర్ణించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్, ఈ తొలగింపుల వెనుక ఉన్న పరిస్థితులను ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వెనుక అధికారికంగా వెల్లడించిన దానికంటే […]
Read more

న్యాయమూర్తులకు బెదిరింపులు…ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు!

జయీముద్దీన్ అహ్మద్…✍️ న్యాయస్థానాల ప్రధాన కర్తవ్యం ఏ ఒక్క వర్గాన్నో, సమూహాన్నో సంతోషపెట్టడం లేదా ఒక నిర్దిష్ట సిద్ధాంతాన్ని మోయడం కాదు. న్యాయవ్యవస్థ కేవలం రాజ్యాంగానికి, చట్టబద్ధమైన నిబంధనలకు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఒక కేసులోని రికార్డులు, సమర్పించిన సాక్ష్యాధారాలు, చట్టపరమైన సూత్రాలు దేనిని డిమాండ్ చేస్తాయో, ఒక న్యాయమూర్తి తన తీర్పులో దాన్నే పొందుపరుస్తారు. కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అని భావించే ఏ పౌరుడికైనా, దానిపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే హక్కును చట్టం […]
Read more

‘ఆర్ఎస్ఎస్’ రూట్ మార్చ్‌లకు ముందస్తు అనుమతి తప్పనిసరి…ప్రియాంక్ ఖర్గే!

బెంగళూరు: కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే RSSపై తన విమర్శలను తీవ్రతరం చేశారు. “నేను పదవిలో ఉన్నంత కాలం” రాష్ట్రంలో రూట్ మార్చ్‌లు నిర్వహించడానికి ఆ సంస్థ తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూనే, దాని చట్టపరమైన హోదా, నిధులు, అంతర్గత పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తారు. “గణేశ్ చతుర్థి సమయంలో ఒక చిన్న గణేశ్ పండాల్‌కు కూడా అనుమతి అవసరమైనప్పుడు, ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ (NGO) అని చెప్పుకుంటూ విదేశాల నుండి విరాళాలు […]
Read more

మణిపూర్‌లో కాల్పులు…తల్లి, కుమార్తెకు గాయాలు, మూడు ఇళ్లకు నిప్పు!

ఇంఫాల్‌: మణిపూర్‌లోని కాంగ్‌పోక్‌పి జిల్లాలో రెండు సాయుధ వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 56 ఏళ్ల మహిళ, ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె గాయపడ్డారు. జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈ రాష్ట్రంలో తాజాగా చెలరేగిన హింసలో భాగంగా, సమీపంలోని ఒక గ్రామంలో కనీసం మూడు ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇంఫాల్-సిల్చార్ జాతీయ రహదారికి సమీపంలోని థింగ్‌ఖోగ్‌జాంగ్ గ్రామంలో సాయంత్రం 5:10 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అధికారుల సమాచారం ప్రకారం, ప్రభుత్వంతో ‘సస్పెన్షన్ ఆఫ్ […]
Read more
1 6 7 8 9 10 97

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.