Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటీషన్లను కొట్టేసిన స్పీకర్!

హైదరాబాద్‌: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వచ్చిన అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. వీరిపై BRS, BJP దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు స్పీకర్‌ కొట్టేశారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్టైంది. స్పీకర్ ఈ ఆరోపణలపై నేడు విచారణ నిర్వహించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు తాము BRS సభ్యులుగానే ఉన్నామని,పార్టీ మారలేదని నొక్కి చెప్పారు. BRS తమకు […]
Read more

హైదరాబాద్‌లో గ్యాస్‌ కొరత… హోటళ్లకు తప్పని ఇబ్బందులు!

హైదరాబాద్: పశ్చిమ ఆసియాలో యుద్ధ సంక్షోభంతో నగరంలో భారీగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీని ప్రభావం నగరం అంతటా ఉన్న హోటళ్ళు, రెస్టారెంట్లపై పడింది. దీంతో హోటల్‌ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్‌లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని హోటల్స్ అసోసియేషన్స్‌ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేసినట్లు తెలిపింది. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం మధ్య, గ్యాస్‌ కొరత హోటల్‌ యజమానుల్లో ఆందోళనను రేకెత్తించింది. పరిస్థితి ఇలాగే […]
Read more

ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ సురక్షితం… సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆక్రమణలు, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలతో ఇతర నగరాలు ఇబ్బందులు పడుతుంటే, హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు. న్యూఢిల్లీ వంటి ప్రధాన మెట్రో నగరాలను పీడిస్తున్న తీవ్రమైన కాలుష్యాన్ని ఉదహరిస్తూ, మూసీ నది ప్రక్షాళన ద్వారా ఈ నగరంలో జీవన ప్రమాణాలను మరింత పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలో పునరుద్ధరించిన నల్ల చెరువును […]
Read more

ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకే ఫీజు ఉండాలి…టీఎస్‌పీవీ!

హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల్లో విస్తృత అసమానతలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రజా సంఘ వేదిక (TPSV) కోరింది. ఒకే రకమైన కోర్సులకు వేర్వేరు ఫీజులు ఉండటం వల్ల ఆర్థిక, సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని ఆ సంస్థ అధ్యక్షుడు నర్సిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC) ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు మూడు విద్యా సంవత్సరాలకు – 2025–26, […]
Read more

సివిల్ సర్వీసెస్ పరీక్షలో మెరిసిన తెలంగాణ… 20 మందికి ర్యాంకులు!

హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలంగాణ మెరిసింది. మొత్తం 20 మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మక పరీక్షలో ఉత్తీర్ణులై రాష్ట్రానికి గర్వకారణం అయ్యారు. కమిషన్ ప్రకారం, మొత్తం 958 మంది అభ్యర్థులు పరీక్షలో అర్హత సాధించారు. వివిధ కేంద్ర సివిల్ సర్వీసులకు నియామకానికి ఎంపికయ్యారు. అనుజ్ అగ్నిహోత్రి జాతీయ టాపర్‌గా నిలిచి ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1ని సాధించారు. ఆయన తర్వాత రాజేశ్వరి సువే రెండో ర్యాంక్‌, ఆకాన్ష్ ధుల్ మూడవ ర్యాంక్‌ సాధించారు. తెలంగాణ […]
Read more

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా AICC ఇన్‌చార్జ్‌కు లేఖ రాసిన మూసీ జన్ ఆందోళన్ కార్యకర్తలు!

హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిలిపివేయాలని మూసీ జన్ ఆందోళన్ కార్యకర్తలు AICC తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాశారు. ఈమేరకు రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ గ్రామంలో ఉన్న 10.34 ఎకరాల భూమిని అన్యాయంగా స్వాధీనం చేసుకోవడాన్ని ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఫలితంగా మధుపార్క్ రిడ్జ్‌ అపార్ట్‌మెంట్‌ వాసులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేరొన్నారు. ప్రాజెక్ట్‌ కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ […]
Read more

‘ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలున్న పేరెంట్స్‌కు 25వేలు ఇస్తాం’…చంద్రబాబు నాయుడు!

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తగ్గుతున్న జనన రేటును పెంచడానికి రాయితీలు ప్రకటించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు రూ.25వేలు ప్రోత్సాహాకం ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. ఈమేరకు అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR)ని ప్రస్తుత 1.5 నుండి 2.1కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. “మేము ఒక కొత్త పద్ధతిని పరిశీలిస్తున్నాము. ప్రసవ సమయంలోనే […]
Read more

తెలంగాణ కొత్త విద్యా విధానంపై చర్చిద్దాం…సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని ఖరారు చేసే ముందు దానిని ప్రజాక్షేత్రంలో ఉంచాలని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ డిమాండ్ చేసింది. విధాన నిర్ణయాలను ఖరారు చేసే ముందు కమిషన్లు, కమిటీలు… ప్రజా చర్చ కోసం ముసాయిదా నివేదికలను విడుదల చేయడం చాలా కాలంగా ఉన్న ప్రజాస్వామ్య సంప్రదాయమని కమిటీ పేర్కొంది. సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్‌ను నియమించింది. ఇటీవల, కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి […]
Read more

ఫీజు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు!

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పెంపుపై ఫిర్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫీజు నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఎక్కువ డబ్బు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎక్కువగా వసూలు చేసిన మొత్తాన్ని రికవరీ చేయాలని పేర్కొన్నారు. ఈమేరకు జరిగిన సమీక్షా సమావేశంలో, విద్యా మంత్రి కూడా అయిన సీఎం, ఈ విషయంపై తల్లిదండ్రులు ఫిర్యాదులు లేదా సూచనలను సమర్పించడానికి వీలుగా ఆన్‌లైన్ యంత్రాంగాన్ని రూపొందించాలని […]
Read more

తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు!

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షలు 1,495 కేంద్రాలలో నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమైనప్పటికీ, విద్యార్థులు ఉదయం 9:05 గంటల వరకు కేంద్రాలలోకి ప్రవేశించవచ్చు. నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్యఇంటర్మీడియట్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 9,97,075 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 4,89,126 మంది మొదటి […]
Read more
1 2 3 4 41

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.