Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఆత్మాహుతి చేసుకున్న తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ మృతి…పలుచోట్ల ఉద్రిక్తత!

హైదరాబాద్: ఏజెన్సీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లు అధికారులు పట్టించుకోకపోవడంతో, వరంగల్ జిల్లాలోని నర్సంపేట డిపో వద్ద ఆత్మాహుతి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగి, ప్రాణాలతో పోరాడి మరణించారు. 50 ఏళ్ల శంకర్ గౌడ్‌గా గుర్తించిన ఆ డ్రైవర్, తనపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోవడం ద్వారా ఆత్మహత్యకు యత్నించారు. చుట్టుపక్కల ఉన్న RTC కార్మికులు వెంటనే ఆయన సహాయార్థం పరుగెత్తుకొచ్చి, ఆ బస్సు డ్రైవర్‌ను చుట్టుముట్టిన మంటలను ఆర్పివేశారు. అయితే, […]
Read more

కాళేశ్వరం కేసు…కేసీఆర్‌, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట!

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి టి. హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (KLIP) అమలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన ‘ఘోష్ కమిషన్’ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్‌, హరీష్ రావు, ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ… కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని హైకోర్టు సమర్థించినప్పటికీ, విచారణ […]
Read more

నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్న గిరిజనులు!

హైదరాబాద్: నగర జీవితాన్ని ఎన్నడూ చూడని గిరిజన బృందం ఒకటి, ‘ఆదివాసి పర్యాటక అనుభవ కార్యక్రమం’లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌కు రానుంది. ‘రివర్స్ టూరిజం’ కార్యక్రమం కింద జరిగే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉదయం 6 గంటలకు ఉట్నూరులో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఆదివాసి బృందం మధ్యాహ్నం 12:30 గంటలకు తారామతి బారాదరికి చేరుకుంటుంది. అక్కడ వారితో సంభాషణ కార్యక్రమం, అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. […]
Read more

తెలంగాణలో మొదలైన ఆర్టీసీ సమ్మె…డిపోలకే పరిమితమైన బస్సులు!

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అర్థరాత్రినుంచి ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది. ప్రభుత్వంతో నిన్న జరిపిన చర్చలు విఫలం కావడంతో ముందుగా ప్రకటించినట్లుగానే కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా ఇవాళ‌ ఉదయం నుంచే కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత స్థాయి అధికారుల కమిటీకి, కార్మికులకు మధ్య రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు కొనసాగాయి. అయితే, తమ నివేదికను సమర్పించడానికి కమిటీకి మరో […]
Read more

సంగారెడ్డి ఎరిత్రో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం!

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఎరిత్రో ఫార్మా లిమిటెడ్‌లో నిన్న సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కార్మికులు రసాయన ద్రావకాలను లోడ్ చేస్తుండగా, ఒక రసాయన రియాక్టర్ నుండి వెలువడిన నిప్పురవ్వలు సమీపంలోని డ్రమ్ములలో నిల్వ ఉంచిన మండే పదార్థాలు అంటుకున్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనతో పారిశ్రామిక ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, ఉద్యోగులను కంపెనీ ప్రాంగణం నుండి సురక్షితంగా తరలించారని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక నివేదికలు […]
Read more

పదివేల కోట్ల బకాయిలు విడుదల చేయండి… ఉస్మానియా విద్యార్థులు!

హైదరాబాద్‌: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న, పేద, మధ్యతరగతి, అణగారిన వర్గాలకు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దాదాపు నాలుగేళ్లుగా సుమారు పదివేల కోట్లు చెల్లించకుండా మిగిలిపోయాయని వారు పేర్కొన్నారు. తద్వారా సుమారు 22-25 లక్షల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని విద్యార్థులు తెలిపారు. “స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లలో జాప్యం కారణంగా, ఫీజులు చెల్లించడానికి మా అమ్మల మంగళసూత్రాలను తాకట్టు […]
Read more

దళిత ప్రొఫెసర్‌పై వేధింపులు ఆపండి…సీఎంను కోరిన సామాజిక కార్యకర్తలు!

హైదరాబాద్: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో దళిత మహిళా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై జరుగుతున్న వేధింపులను తక్షణమే ఆపాలని, ఆమెను ‘అర్బన్ నక్సల్స్’గా ముద్ర వేయడం మానుకోవాలని, ఆమె భద్రత, గౌరవం, శ్రేయస్సుకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకైనా దూరంగా ఉండాలని దేశ, విదేశాలకు చెందిన సామాజిక కార్యకర్తలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. విప్లవ రచయిత పి. వరవరరావుతో పాటు విద్యావేత్తలు, సాంఘిక కార్యకర్తలు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు సహా 209 […]
Read more

ఏప్రిల్ 22 నుండి నిరవధిక సమ్మెకు దిగనున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు!

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. ఈమేరకు నిన్న ఆర్టీసీ ప్రతినిధులు, కార్మిక శాఖ కమిషనర్ మధ్య హైదరాబాద్‌లో జరిగిన సమావేశం విఫలమవడంతో, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సంయుక్త కార్యాచరణ సమితి (JAC) ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. “మా డిమాండ్లు నెరవేర్చకపోతే, ఏప్రిల్ 21- 22 తేదీల మధ్య రాత్రి, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత డిపో నుండి బయలుదేరాల్సిన మొదటి బస్సు డిపోలోనే ఉంటుందని” TGSRTC […]
Read more

తెలంగాణ విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు…ఒక విశ్లేషణ!

హైదరాబాద్‌: తెలంగాణ విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు-2026 ప్రకారం…మతసామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య అసమ్మతి, శత్రుత్వాన్ని రెచ్చగొట్టే చర్యలను నేరుగా ఎదుర్కొని, నివారించే ఒక సమగ్ర వ్యవస్థను సృష్టించడం దీని ప్రాథమిక లక్ష్యం. మతం, కులం, లింగం, భాష, ఇతర గుర్తింపులకు అతీతంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేష ప్రసంగ సంఘటనల నేపథ్యంలో ఈ బిల్లు వచ్చింది. ఈ […]
Read more

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే ఆధిపత్యం…అగ్రస్థానంలో మెదక్!

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచి బాలురను అధిగమించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 89.07 శాతం నుండి 69.04 శాతం మధ్య ఉండగా, బాలుర ఉత్తీర్ణత శాతం 79.14 శాతం నుండి 39.42 శాతం మధ్య నమోదైంది. రాజన్న (సిరిసిల్ల) జిల్లాలో బాలికల ఉత్తీర్ణత శాతం 69.04 శాతం ఉండగా, బాలుర ఉత్తీర్ణత శాతం […]
Read more
1 2 3 4 5 46

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.