Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కీలక పథకాలు ప్రారంభించే అవకాశం!

హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం కీలక పథకాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాలు నేటి క్యాబినెట్‌ భేటీలో తీసుకోనున్నారు. రెండు లక్షల కొత్త పెన్షన్లు, రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం, మరిన్ని వర్గాలకు గృహవసతి కల్పించడం వంటి అంశాలు మంత్రివర్గ సమావేశపు అజెండాలో ఉన్నాయి. జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను అప్పగించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో, గృహవసతి పథకం […]
Read more

తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా!

హైదరాబాద్: తెలంగాణ విద్యా కమిషన్ (TGEC) ఛైర్మన్ అకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు.ఈమేరకు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు ఉద్దేశించిన తన రాజీనామా లేఖలో, తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా రంగాల స్థితిగతులపై సమగ్ర నివేదికను, తగిన సిఫార్సులతో సహా సమర్పించే బాధ్యతను కమిషన్ పూర్తి చేసిందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కమిషన్ ఛైర్మన్‌గా సేవలు అందించే అవకాశాన్ని కల్పించినందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, విద్యా […]
Read more

తెలంగాణలోని ఇటుక బట్టీల నుంచి 518 మంది వెట్టిచాకిరి కార్మికుల విముక్తి!

హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇటుక బట్టీల నుంచి వెట్టిచాకిరి కార్మికులుగా భావిస్తున్న వారిలో ఒకరు తప్పించుకుని ఫిర్యాదు చేయడంతో, వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం 518 మందిని రక్షించారు. ఈ ఫిర్యాదును హైదరాబాద్‌లోని న్యాయ సేవల అథారిటీకి సమర్పించగా, అక్కడి నుంచి జిల్లా జడ్జి జి.వి.ఎన్. భరత లక్ష్మికి పంపించారు. అథారిటీ ఆదేశాల మేరకు ఆ న్యాయాధికారి మే 19న జిల్లాలోని ఆర్మూర్‌లో ఉన్న ఒక ఇటుక బట్టీని సందర్శించారు. ఇటుక బట్టీలలో తగినంత […]
Read more

కేబీఆర్ పార్క్ నిరసనకారుల అరెస్టుపై డీజీపీ, కలెక్టర్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు సమీపంలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఐదుగురు పర్యావరణ కార్యకర్తల ఏకపక్ష అరెస్టు, నిర్బంధంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ ఘటన నిర్ధారణ అయితే అది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని హెచ్చరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రెండు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, […]
Read more

కార్మికులకు రేవంత్‌ సర్కారు గుడ్‌న్యూస్‌… కనీస వేతనాల పెంపు!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 1.11 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా కనీస వేతనాలను భారీగా సవరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ ఉపసంఘం ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ సవరణ జరిగిందని, ఈ సంఘం తన నివేదికను ఖరారు చేసే ముందు సంబంధిత వర్గాలన్నింటినీ సంప్రదించిందని సీఎం తెలిపారు. నాలుగు వర్గాలు, మూడు జోన్లుకార్మికులను […]
Read more

తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు… ఏకంగా 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు!

హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ వేసవి కాలంలో తొలిసారిగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. నిన్న ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య తెలంగాణ అభివృద్ధి, ప్రణాళిక సంఘం పరిశీలన ప్రకారం, రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత హనుమకొండలోని ధర్మసాగర్, కరీంనగర్‌లోని చొప్పదండి, పెద్దాపల్లిలోని ఓడెలలో 46.4 డిగ్రీల సెల్సియస్ […]
Read more

విద్యారంగానికి ఐదువేల కోట్లు ఇవ్వండి…కేంద్రాన్ని కోరిన భట్టి విక్రమార్క!

న్యూఢిల్లీ: తెలంగాణ అభివృద్ధి అజెండాకు, ముఖ్యంగా విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ సంస్కరణలకు మద్దతుగా అదనపు కేంద్ర సహాయం, ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు ఇప్పటికే కేటాయించిన రూ. 4,208 కోట్లకు అదనంగా, ‘మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ పథకం’ (SASCI) కింద మరో రూ. 5,000 కోట్లను మంజూరు […]
Read more

కడప అల్మాస్‌పేట ఘర్షణలపై ఏపీసీఆర్‌ నిజ నిర్ధారణ నివేదిక!

కడప…ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఓ ప్రముఖ నగరం. అత్యంత ప్రభావవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతం నుంచే వచ్చారు. ఈ నగరం చాలా వైవిధ్యభరితమైనది కూడా. జనాభాలో 45-50% ముస్లింలు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఓ వాణిజ్య కూడలి అల్మాస్‌పేట్ సర్కిల్. కాగా, ఈ జంక్షన్‌కు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో విరోచితంగా పోరాడి మరణించిన మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ పేరును పెట్టాలని స్థానిక ముస్లింలు, పౌర సంఘాలు కోరుకుంటున్నాయి. […]
Read more

ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి పెంచిన తెలంగాణ!

హైదరాబాద్: నిరుద్యోగ యువత నుండి పదే పదే వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లు పెంచింది. దీంతో వివిధ విభాగాల పోస్టుల భర్తీకి రాబోయే ప్రత్యక్ష నియామకాలలో, వయోపరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర […]
Read more

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ… వడగాలుల హెచ్చరిక!

హైదరాబాద్‌: రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. ఈమేరకు మే 19 నుండి 24వ తేదీ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సగటు ఉష్ణోగ్రతలు 45°C మార్కును దాటే అవకాశం ఉందని, దీనివల్ల ఈ ప్రాంతమంతటా వడగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వడదెబ్బ వంటి వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించడానికి, ప్రజలు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:00 గంటల మధ్య బయటకు రాకూడదని నిపుణులు […]
Read more
1 2 3 4 5 6 51

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.