Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

రబీ సీజన్‌లో 10.2 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన తెలంగాణ!

హైదరాబాద్: ఈ రబీ సీజన్‌లో నిన్నటికి 10.2 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు, రాష్ట్ర ప్రభుత్వం 4.50 లక్షల టన్నుల సన్న రకం, 5.50 లక్షల టన్నుల దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సేకరించిన వరి ధాన్యానికి సంబంధించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్ష మందికి పైగా రైతులకు రూ. 500.20 కోట్ల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నేరుగా విడుదల చేసిందని పౌర సరఫరాల […]
Read more

తుమ్మిడిహట్టి బ్యారేజీ సమస్యపై మహారాష్ట్రతో చర్చలు జరుపనున్న తెలంగాణ!

హైదరాబాద్: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ సమస్య ఏమిటంటే, తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ప్రస్తుతం ఉన్న వివాదం ప్రధానంగా దాని పూర్తి జలాశయ మట్టం (FRL), దాని ఫలితంగా మహారాష్ట్రలోని భూమి మునిగిపోవడానికి సంబంధించినది. ఈమేరకు నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల FRL ఎత్తులో నిర్మించడం ద్వారా కనీసం 100 టీఎంసీల […]
Read more

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ‘అతిపెద్ద కుంభకోణం’…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: గ్రేట్ నికోబార్ ద్వీపంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు దేశంలో జరిగిన “అతిపెద్ద కుంభకోణాలలో” ఒకటని రాహుల్‌ గాంధీ అన్నారు. అభివృద్ది ముసుగులో వేల ఏళ్ల నాటి అడవులను నరికివేస్తూ.. పర్యావరణ విధ్వంసం చేస్తుందని లోక్ సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గ్రేట్ నికోబార్ లో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడి పరిస్థితులపై ఎక్స్ వేదికగా ఈరోజు ట్వీట్ చేశారు బంగాళాఖాతంలోని అండమాన్,నికోబార్ ద్వీపసమూహంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను […]
Read more

హైదరాబాద్ విమానాశ్రయంలో ఆరు కిలోల గంజాయితో పట్టుబడ్డ ప్రయాణికుడు!

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయిని గుట్టుగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 2.15 కోట్లు. కాగా, దీని మొత్తం బరువు 6.15 కిలోలు కావడం గమనార్హం. ఈ కేసులో ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చేపట్టిన భారీ దాడుల్లో భాగంగా, డీఆర్ఐ (DRI) అందించిన నిర్దిష్ట […]
Read more

హైదరాబాద్‌లో మే 9న పాస్‌పోర్ట్ మేళా!

హైదరాబాద్: తెలంగాణలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం మే 9న పాస్‌పోర్ట్‌ మేళా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, ఆర్‌పిఓ హైదరాబాద్ పరిధిలోని ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలన్నింటిలో 4,000 సాధారణ అపాయింట్‌మెంట్‌లు విడుదల చేయనున్నారు. దీనివల్ల ప్రస్తుతం సుదీర్ఘ కాలంపాటు వెయిటింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు కరీంనగర్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నట్లు కూడా కార్యాలయం ప్రకటించింది. […]
Read more

క్రేన్ కూలి ఐదుగురు వలస కార్మికులు మృతి!

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో నిన్న సాయంత్రం ఒక ప్రీఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ తయారీ యూనిట్‌లో క్రేన్ కూలిపోవడంతో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మహాలింగాపురం గ్రామంలో సాయంత్రం పూట కార్మికులు మొత్తం విధుల్లో నిమగ్నమై ఉండగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. భారీ ఈదురుగాలులు వీయడంతో ఆ కంపెనీలోని భారీ క్రేన్ కంట్రోల్ తప్పి కార్మికులపై పడిపోయింది. క్రేన్ కూలినప్పుడు 17 మంది కార్మికులు ఒక షెడ్డులో తలదాచుకున్నారు. […]
Read more

హైదరాబాద్‌ను మరో ఢిల్లీగా మార్చొద్దు…హెచ్-సిటీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన!

హైదరాబాద్: “హైదరాబాద్ మరో ఢిల్లీగా మారడం మాకు ఇష్టం లేదు,” అని కేబీఆర్ జాతీయ పార్క్ ప్రధాన ద్వారం వెలుపల కొనసాగుతున్న హెచ్-సిటీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. కాగా, భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (హెచ్-సిటీ) ప్రాజెక్టు పనులు… పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణాలకుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ‘ స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన […]
Read more

‘ఏఐ’ నైపుణ్య శిక్షణా కేంద్రాలను ప్రారంభించిన తెలంగాణ మైనారిటీల సంస్థ!

హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) నిన్న హైదరాబాద్‌లో రెండు నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థలను ప్రారంభించింది. మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ప్రాంప్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను అందిస్తున్నాయి. ఈమేరకు టీజీఎంఎఫ్‌సీ ఛైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కొత్వాల్, కార్పొరేషన్ నైపుణ్యాభివృద్ధి, శిక్షణా పథకం కింద ఈ రెండు కేంద్రాలను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్‌లో జినాటినియం ఇన్‌స్టిట్యూట్, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని […]
Read more

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విరమణ!

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ముగిసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించింది. గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, 2017 వేతన సవరణ సంఘం (PRC) సిఫార్సుల మేరకు వేతనాల్లో 11 శాతం పెంపును అమలు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈతెల్లవారుజామున ప్రకటించారు. TGSRTCని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను రూపొందించడానికి అధికారులు, సంఘ […]
Read more

చర్చలకు ముందు మూసీ ప్రాజెక్ట్ నివేదికలను వెల్లడించండి!

హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌పై సంప్రదింపులకు ముందు ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని పత్రాలను వెల్లడించాలని కోరుతూ… మూసీ జన ఆందోళన్ (ఎంజేఏ), తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ సబ్-కమిటీకి ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లకు ఉద్దేశించిన ఈ వినతిపత్రం, నదీ పరివాహక ప్రాంత దృక్కోణం నుండి ప్రాజెక్ట్‌ను సమగ్రంగా పునఃసమీక్షించాలని కోరింది. వెల్లడించాలని అభ్యర్థనస్పష్టంగా గుర్తించిన నదీ సరిహద్దులు, బఫర్ జోన్‌లు, రహదారి అమరికలు, […]
Read more
1 2 3 4 46

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.