Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

శాశ్వత భూ పరిష్కారాల కోసం ‘భూ భారతి’ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్‌: భూ వివాదాలను పరిష్కరించడానికి, భూ పరిపాలనలో పారదర్శకతను నిర్ధారించడానికి, కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… భూ భారతి చట్టం, పోర్టల్‌ను తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. రైతుల భూ స‌మ‌స్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎంతో అధ్యయనం చేసి తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లు చట్ట విరుద్ధం… మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ పరిరక్షణ కమిటీ!

హైదరాబాద్‌ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణల చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలన్నారు. ఇది 14, 25, 26 ఆర్టికల్‌ను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఈ బిల్లు ముస్లిం మైనారిటీలకు ఆర్థిక స్వాలంబనగా నిలిచిన వక్ఫ్ బోర్డ్ ను ఆర్థికంగా నిర్వీర్యంగా చేసి , దాని ఆధీనంలో ఉన్న ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టటానికి, ముస్లిముల రక్షణకు భద్రత లేకుండా చేసే కుట్ర దాగి […]
Read more

సైబర్ మోసం…42 లక్షలు కోల్పోయిన హైదరాబాదీ ఇంజనీర్‌!

హైదరాబాద్: నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఇటీవల సైబర్ దాడికి గురయ్యాడు, ఫలితంగా అతని బ్యాంక్, యుఎస్ షేర్ మార్కెట్ ఖాతాల నుండి రూ.42 లక్షలు కోల్పోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… మార్చిలో జరిగిన ఈ సైబర్‌ దాడిలో, హ్యాకర్లు OTP కూడా అడగకుండానే అనధికారికంగా అతడి అకౌంట్‌లోని డబ్బుని కొట్టేశారు. పనిలోపనిగా బాధితుడి వాట్సాప్ ఖాతాను కూడా హ్యాక్‌ చేశారు. దీనిని పునరుద్ధరించడానికి డబ్బును డిమాండ్‌ చేశారు. యుఎస్ షేర్ […]
Read more

ఏపీలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు…8మంది మృతి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ యూనిట్‌లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్‌, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కోటవురట్ల మండల కేంద్రానికి 3 కి.మీల దూరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తారాజువ్వల తయారీకి పేరొందిన ఈ కర్మాగారంలో బాణసంచా […]
Read more

కంచ గచ్చిబౌలి భూమిని తనఖా పెట్టారనే బీఆర్‌ఎస్‌ ఆరోపణను తోసిపుచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు!

హైదరాబాద్: గచ్చిబౌలి భూముల వివాదంపై బీఆర్‌ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ భూముల్లో ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్‌ ఇచ్చారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని, సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత ఎటువంటి వ్యాజ్యాలు లేకుండా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏదైనా ఆరోపణలు […]
Read more

ఆహార భద్రతలో సన్న బియ్యం పథకం గేమ్ ఛేంజర్‌…మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి!

హైదరాబాద్: పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం… ఆహార భద్రత- సంక్షేమంలో ‘గేమ్ ఛేంజర్’గా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. పేదలకు పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. ఇది చరిత్రాత్మక పథకమని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఆహార భద్రతా చొరవగా దీనిని అభివర్ణిస్తూ, ఈ పథకానికి ప్రజల నుండి భారీ స్పందన […]
Read more

రియల్ ఎస్టేట్ రంగంలో సందేహాలు తీర్చేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించిన హైడ్రా!

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో చట్టపరమైన స్పష్టత, పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం హౌసింగ్ రిక్వైర్‌మెంట్స్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్– HRCS ఇండియా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఆస్తి కొనుగోలుదారులు, విక్రేతలు, వాటాదారులకు చట్టపరమైన, రుణ సంబంధిత సమాచారాన్ని ఉచితంగా అందిస్తుంది. RERA-సర్టిఫైడ్ సంస్థ HRCS ఇండియా ద్వారా ఏర్పాటైన ఈ వెబ్‌సైట్… మనం కొనుగోలు చేసిన ఆస్తులు.. FTL పరిథిలో ఉన్నాయా లేదా బఫర్ జోన్‌లలోకి వస్తాయో లేదో నిర్ణయించడంలో వినియోగదారులకు సహాయపడుతుంది. […]
Read more

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ మసీదులో లౌడ్ స్పీకర్ల నిషేధంపై వివాదం!

హైదరాబాద్: హనుమాన్ జయంతి యాత్ర రోజున నమాజ్ సమయంలో సౌండ్ సిస్టమ్‌ను ఉపయోగించవద్దని మసీదు యాజమాన్యానికి నోటీసు జారీ చేయడంతో వివాదం రేగింది. అయితే నోటీసులోని కంటెంట్ “తప్పుగా ప్రచురితమైందని” పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌లోని మారియట్ హోటల్ లేన్‌లోని మసీదు యాజమాన్యానికి గాంధీనగర్ పోలీసులు నోటీసు జారీ చేశారు. శనివారం, ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి ర్యాలీ మసీదు ముందు నుండి వెళ్ళే సమయంలో సౌండ్ సిస్టమ్‌ను ఉపయోగించవద్దని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ SHO సంతకం చేసిన […]
Read more

తెలంగాణలో అసాధారణ వాతావరణ పరిస్థితులు…కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం, మరికొన్ని చోట్ల వేడిగాలులు!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రస్తుతం అసాధారణ వాతావరణ పరిస్థితులను చూస్తోంది, కొన్ని చోట్ల వర్షపాతం నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణంలోని ఈ మార్పు ఇటు ప్రజలు అటు అధికారుల దృష్టిని ఆకర్షించింది. నిజామాబాద్,హైదరాబాద్ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి, దీనివల్ల ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఇదేసమయంలో ఇతర ప్రాంతాలలో అప్పుడప్పుడు వర్షాలు తాత్కాలిక ఉపశమనం కలిగించాయి. కానీ వాతావరణ మార్పులు ప్రజల్లో అయోమయం రేకెత్తించింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు […]
Read more

గ్రూప్‌-1లో విజేత కావాలని ఆశ పడింది…లక్ష్యాన్ని సాధించింది!

హైదరాబాద్‌: పట్టుదలకు శ్రమ, కృషి, ఓర్పు, నేర్పు తోడైతే విజయం తథ్యం. కల కనడంతో సరిపెట్టుకోకుండా సంకల్పించుకొని తమదైన పంథాలో ముందుకు సాగితే కొలువులు దక్కించుకోవచ్చని నల్గొండ జిల్లా మిర్యాలగూడ యువతి నిరూపించింది. గ్రూప్స్‌లో విజేత కావాలని ఆశ పడింది.. నలుగురిలో ఒకరిగా నిలబడాలన్న కసికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది.. ఇంకేముంది పట్టుదల ముందు లక్ష్యం తలవంచింది. ఆమె తన మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1 మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో 162వ ర్యాంక్, మల్టీ-జోన్ […]
Read more
1 30 31 32 33 34 38

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.