Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అసెంబ్లీలో ఘోష్ నివేదిక…వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్‌!

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ నివేదికపై సభలో తమ వాదన వినిపించడానికి తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ బిఆర్ఎస్ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని, స్పీకర్‌ ఏం సంబంధం లేనట్లు వ్యవహరించారని ఆరోపించారు. తమ నేత హరీశ్‌రావు ఒకరు మాట్లాడితే.. సీఎం సహా మంత్రులంతా అబద్ధాలు చెప్పారన్నారు. కాళేశ్వరంపై కుట్రను ప్రజల్లో ఎండగడతామని, ఆ ప్రాజెక్టును […]
Read more

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: గత BRS హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐకి అప్పగిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ కమిషన్ నివేదికపై జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…అంతర్రాష్ట్ర సమస్యలు, వివిధ కేంద్ర, ప్రభుత్వ విభాగాలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నందున దర్యాప్తును సీబీఐకి అప్పగించడం సముచితమని రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక సంస్థలు కూడా ప్రాజెక్టు రూపకల్పన, […]
Read more

తెలంగాణలో వరదలు…1,444 మందిని రక్షించిన రెస్క్యూ టీం!

హైదరాబాద్: ఎడతెరిపిలేని వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. వివిధ జిల్లాలు తీవ్ర వరదల బారిన పడ్డాయి. గురువారం సాయంత్రం 6:30 గంటల నాటికి విపత్తు ప్రతిస్పందన దళాలు మొత్తం 1,444 మందిని రక్షించాయి. కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టారు. గందరగోళం, విధ్వంసం మధ్య, ఆరుగురు వ్యక్తులు కనిపించకుండా పోయినట్లు సమాచారం. జగిత్యాల నుండి ఒకరు, మెదక్ నుండి ఇద్దరు, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, […]
Read more

పోచారం ప్రాజెక్టుకు ముప్పు…తీవ్రస్థాయిలో వరద!

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. గంటగంటకు పెరుగుతున్న వరదతో.. పోచారం ప్రాజెక్టుపైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్‌ ఓవర్‌హెడ్‌ ప్రాంతంలో భారీ గండిపడినట్లు సమాచారం. దీంతో ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లవచ్చని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముందు జాగ్రత్తగా దిగువన ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును ఆదేశించారు. నివేదికల ప్రకారం, రిజర్వాయర్ […]
Read more

తెలంగాణలో యూరియా కొరత…తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు!

హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరతతో తెలంగాణ సతమతమవుతోంది. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల (PACS) వెలుపల రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి తమకు తగినంత యూరియా అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై చాలా మంది ఆగ్రహం, నిరాశ వ్యక్తం చేశారు. ఎరువులు పొందడానికి నిన్నంతా రైతులు గంటల తరబడి క్యూలో ఓపికగా నిలబడి ఉన్నట్లు చూపే దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఒక వీడియోలో, సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్‌పేట్ […]
Read more

హైదరాబాద్‌లో తరచూ ఇంటర్నెట్‌కు అంతరాయం!

హైదరాబాద్: గత పక్షం రోజులుగా హైదరాబాద్‌లో తరచూ ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడుతుంది. దీనికి కారణం విద్యుత్‌ అధికారులు కేబుల్స్‌ను కట్‌చేయడమేనని అంటున్నారు. విద్యుత్ బోర్డు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI)తెలిపింది. నగరంలో కరెంట్‌ షాక్ మరణాలు సంభవించిన తర్వాత TGSPDCL అధికారులు నగరం అంతటా వైర్లను కత్తిరించడం ప్రారంభించారు. “హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో TGSPDCL సిబ్బంది చట్టవిరుద్ధంగా కేబుల్స్‌ కట్‌ చేయడాన్ని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా […]
Read more

ఆగస్టు 30 నుండి అసెంబ్లీ సమావేశాలు!

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకు ముందు రోజు ఆగస్టు 29న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ క్యాబినెట్ సమావేశానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశమే ముఖ్యమైన ఎజెండాగా ఉండనుంది. కాగా, అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమీషన్‌ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా […]
Read more

హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీని భగ్నం చేసిన పోలీసులు…ఏడుగురి అరెస్ట్‌!

హైదరాబాద్‌: నగరంలోని కొండాపూర్‌లో జరిగిన రేవ్ పార్టీని తెలంగాణ ఈగల్‌ టీమ్‌, నగర పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు వ్యాపారవేత్తలు, ఒక గృహిణి, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఒక ఇంజనీరింగ్ విద్యార్థితో సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసులు, ప్రత్యేక మాదకద్రవ్యాల నిరోధక బృందంతో కలిసి సోమవారం కొండాపూర్‌లోని రాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి, 20 గ్రాముల కొకైన్, 8 ఎక్స్‌టసీ మాత్రలు (20 గ్రాములు),3 గ్రాముల MDMAతో సహా గణనీయమైన […]
Read more

సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన…గృహ నిర్బంధంలో బీఆర్ఎస్ విద్యార్థి నేతలు!

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు జి. శ్రీనివాస్ యాదవ్, మరికొందరు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. కొన్ని విద్యార్థి సంఘాలు నిరసనకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా క్యాంపస్‌లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ముందస్తు అరెస్టులుపోలీసులు విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులు చేసి, ఏ నిరసననైనా విఫలం చేయడానికి క్యాంపస్‌లో ఇనుప కంచె వేసినట్లు సమాచారం. 1,200 మంది విద్యార్థులకు […]
Read more

యూరియా కొరతపై మాటల యుద్ధం…కేంద్రం vs రాష్ట్రం!

హైదరాబాద్: తెలంగాణ అంతటా, అది కూడా ఖరీఫ్ సీజన్‌లో యూరియాకు తీవ్ర కొరత ఏర్పడటంతో, రాష్ట్రం-కేంద్రం మధ్య అనాలోచిత మాటల యుద్ధం మొదలైంది. వేలాది మంది రైతులు రాజకీయాల సుడిగుండంలో చిక్కుకుని, అవసరమైన ఎరువుల సరఫరా కోసం కష్టపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ‘తగినంత నిల్వలను అందించడంలో విఫలమైనందుకు’ కేంద్రాన్ని నిందిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరానికి మించి రాష్ట్రానికి యూరియా అందించామని నమ్మబలుకుతోంది. భారతదేశంలో చౌకైన, విస్తృతంగా ఉపయోగించే ఎరువు యూరియా మాత్రమే. ఇది ఆహార ధాన్యాల […]
Read more
1 29 30 31 32 33 52

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.