Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని పాఠశాలలకు హాఫ్‌ డే సెలవు!

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆగస్టు 13, 14 తేదీలలో భారీ వర్షపాతం అంచనాతో తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ హాప్‌ డే సెలవులు ప్రకటించారు. వాతావరణ నివేదిక ప్రకారం, రెండు రోజుల్లో GHMC పరిమితుల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విద్యార్థుల భద్రత, రవాణా సమస్యల కారణంగా ఈ తేదీలలో ఉదయం షిఫ్ట్ సమయంలో మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయని విద్యా శాఖ […]
Read more

హైదరాబాద్‌లో భారీ వర్షం ధాటికి నిలిచిన కరెంట్‌ సరఫరా, దెబ్బతిన్న విద్యుత్ ఫీడర్లు!

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ అంతటా నిన్న కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, వివిధ జోన్లలో 43 విద్యుత్ ఫీడర్లు (11 కెవి) దెబ్బతిన్నాయి, కొన్ని నివాస, వాణిజ్య ప్రాంతాలలో విద్యుత్ సరఫరాపై ప్రభావం పడింది. బంజారాహిల్స్ (11 ఫీడర్లు), సికింద్రాబాద్ (12), హైదరాబాద్ సెంట్రల్ (3), హైదరాబాద్ సౌత్ (1), సైబర్ సిటీ (5), రాజేంద్రనగర్ (2), సరూర్‌నగర్ (1), హబ్సిగూడ (1), మేడ్చల్ (7) ఫీడర్లలో అంతరాయాలు సంభవించాయి. హబ్సిగూడ-మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మౌలా […]
Read more

పుష్ప 2 తొక్కిసలాట…ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ!

హైదరాబాద్: “పుష్ప-2” సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి పోలీసు శాఖ సమర్పించిన నివేదికపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి,హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పోలీసులపై NHRC అసంతృప్తిపెద్ద సంఖ్యలో జనం గుమిగూడినప్పటికీ తగిన భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోందని NHRC తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన […]
Read more

బీసీ కోటా కోసం ఢిల్లీలో ధర్నా… పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇండియా కూటమి నాయకులు!

న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సెగ ఢిల్లీని తాకింది. 42 శాతం బీసీ కోటా సాధన కోసం ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ దీక్ష చేపట్టింది. ఈ మేరకు సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులకు అపాయింట్‌మెంట్ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ […]
Read more

కాళేశ్వరం ప్రాజెక్టు’అవకతవకలకు కేసీఆరే బాధ్యుడు… జ్యుడీషియల్ కమిషన్!

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్‌”ప్రత్యక్షంగా, పరోక్షంగా” బాధ్యులని తెలంగాణ ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్ నిర్ధారించింది. నిన్న రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో జరిగిన సమావేశంలో కమిషన్ నివేదికను చర్చించి ఆమోదించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులకు తెలిపారు. క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ…కమిషన్ తన నివేదికలో బిఆర్ఎస్ పాలనలో నీటిపారుదల మంత్రిగా ఉన్న కెసిఆర్ మేనల్లుడు టి హరీష్ రావు, అప్పటి ఆర్థిక […]
Read more

చలో ఢిల్లీ…హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన కాంగ్రెస్ నేతలు!

హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. ఈ రైలులో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కోరుతూ ఆగస్టు 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]
Read more

మెహదీపట్నంలో పాలస్తీనా అనుకూల నిరసన చేపట్టిన విద్యార్థులు!

హైదరాబాద్: హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతంలోని మజీద్‌-ఎ-అజీజియాలో నిన్న స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO) పాలస్తీనా అనుకూల నిరసనను నిర్వహించింది. పాలస్తీనా పౌరులను, ప్రధానంగా పిల్లలు, శిశువులను ఉద్దేశపూర్వకంగా ఆకలితో అలమటించేలా చేస్తున్న ఇజ్రాయెల్‌ వైఖరిని ఖండిస్తూ విద్యార్థలు నినాదాలు చేశారు. దీనిని తీవ్రమైన మానవతా అన్యాయంగా అభివర్ణించారు. తక్షణ అంతర్జాతీయ జోక్యాన్ని కోరారు. హైదరాబాద్ అంతటా నిరసనలుఇజ్రాయెల్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై వివిధ వాణిజ్య దుకాణాలలో జరిగిన అనేక పాలస్తీనా అనుకూల నిరసనలకు హైదరాబాద్ ఇటీవల […]
Read more

ఆపరేషన్ ముస్కాన్…7వేలకు పైగా పిల్లలను రక్షించిన అధికారులు!

హైదరాబాద్: హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’-XI కింద గత నెలలో 7,678 మంది పిల్లలను రక్షించామని, వారిలో 6,000 మందికి పైగా బాల కార్మికులని అధికారులు శుక్రవారం తెలిపారు. రైల్వే, బస్ స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ దుకాణాలు, నిర్మాణ స్థలాలు, టీ స్టాళ్లు సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదేశాలను మ్యాప్ చేసి, 12 రాష్ట్రాల నుండి అక్రమంగా తీసుకొచ్చిన మొత్తం 7,678 మంది పిల్లలను (7149 మంది బాలురు, […]
Read more

సిగాచి బాధితులను ఆదుకోండి… రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు!

హైదరాబాద్: ఇటీవల సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తూ సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మోహినుద్దీన్‌తో కూడిన కోర్టు విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది. సమయం గడిచేకొద్దీ ప్రమాదం తీవ్రతను తగ్గించడానికి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా కూడా ధర్మాసనం హెచ్చరించింది. సిగాచి […]
Read more

ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి తేల్చండి… సుప్రీంకోర్టు!

హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను ఆదేశించింది. భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ K.T. రామారావు, మరికొందరు BRS ఎమ్మెల్యేలు,అసెంబ్లీలో BJP ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి B.R. గవాయ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లను త్వరగా నిర్ణయించేలా తెలంగాణ […]
Read more
1 31 32 33 34 35 52

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.