Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఆక్రమణలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం!

హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్‌లో ఉన్న దుర్గం చెరువు అక్రమ ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝళిపించింది. మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ వైపు ఉన్న దాదాపు 5 ఎకరాల చెరువు భూమిని కబ్జాల నుండి విడిపించి స్వాధీనం చేసుకుంది. ఆక్రమణదారులు చెరువు గర్భంలో కొంత భాగాన్ని మట్టితో నింపి, ఆ ప్రాంతాన్ని వాణిజ్య పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తున్నారని, దీని ద్వారా నెలకు ₹50 లక్షల వరకు అద్దె వసూలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో ప్రచురితమైన ఒక ఫిర్యాదుపై […]
Read more

హైదరాబాద్‌ను ప్లాస్టిక్ రహితంగా మారుద్దాం…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: రాజధాని నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…హైదరాబాద్‌ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి, డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీలో కొత్తగా […]
Read more

ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి పేరుతో కొత్త పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు!

హైదరాబాద్: నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్లు – హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండను నాలుగు కొత్త కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పాత రాచకొండ పోలీస్ సర్కిల్‌ను ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించారు. ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించిన నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. కొత్త పోలీస్ పరిధుల ప్రకారం… అసెంబ్లీ, సచివాలయం, బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయం, బుద్వేల్ హైకోర్టు వంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిన్న […]
Read more

పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చిన సీఎం…ఆరోపించిన కేటీఆర్!

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరును తిరిగి వలసల జిల్లాగా మార్చారని, కాంగ్రెస్ పార్టీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్వీర్యం చేసి, ఈ ప్రాంతాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టిందని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణకు సంబంధించి నీటి హక్కులను పరిరక్షించడానికి తమ పార్టీ అధినేత కేసీఆర్‌ కొత్త పోరాటానికి సిద్ధమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అన్నారు. నాగర్ కర్నూల్‌లో కొత్తగా ఎన్నికైన సర్పంచుల సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నీటిపారుదల, అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైందని, బీఆర్ఎస్ […]
Read more

హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌లో 1050 స్టాళ్లు…మంత్రి శ్రీధర్ బాబు!

హైదరాబాద్: దక్కన్‌ సంస్కృతికి నిదర్శనమైన నాంపల్లి ఎగ్జిబిషన్‌ 85వ ఎడిషన్ జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ నుమాయిష్ కోసం మొత్తం 1050 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి, హస్తకళలను ప్రదర్శించే ఈ బృహత్తర ప్రదర్శన 46 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రదర్శనను ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి ఈ ఎగ్జిబిషన్‌ను జనవరి 1వ తేదీన ఉప ముఖ్యమంత్రి […]
Read more

డీజే పార్టీలో డ్రగ్స్‌ వినియోగం…ఎనిమిది మంది అరెస్ట్‌!

హైదరాబాద్: నగరంలో పబ్బులు, డీజే పార్టీల సంస్కృతి ఇటీవల భారీగా పెరిగిపోయింది. అయితే.. ఈ పబ్బులు, డీజే పార్టీల ముసుగులో వీళ్లు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు పలుమార్లు బయటపడింది. తాజాగా జరిగిన ఓ డీజే పార్టీలో ఎనిమిది మంది డ్రగ్స్‌ వినియోగదారులు పట్టుబడ్డారని తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ విభాగం – ‘EAGLE ఫోర్స్’ తెలిపింది. విశ్వసనీయ నిఘా ఆధారంగా…ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ఫోర్స్, సైబరాబాద్ పోలీసులతో సమన్వయంతో, డిసెంబర్ 27న ఇక్కడి ఒక […]
Read more

టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు…ఒకరు మృతి!

అమరావతి: ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ సమీపంలో టాటా-ఎర్నాకులం (18189) ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో జరిగింది. ప్యాంట్రీ కారులో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న B1, M2 AC కోచ్‌లకు త్వరగా వ్యాపించాయి. నివేదికల ప్రకారం…లోకో పైలట్లు ఎలమంచిలి సమీపంలో పొగను గమనించి, సమీప స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. ఫైర్‌ ఇంజన్‌లు వచ్చేలోపు మంటల కారణంగా రెండు కోచ్‌లు దగ్ధయ్యాయి. ప్రయాణికుల్లో భయాందోళనలు చెలరేగాయి, వీరిలో […]
Read more

కొత్తగా ఏర్పాటైన విద్యుత్‌ డిస్కంపై అప్పుల భారం!

హైదరాబాద్‌: ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరంతో దక్షిణ డిస్కమ్‌ (టీజీఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌), ఉత్తర డిస్కమ్‌ (టీజీఎన్పీడీసీఎల్‌-వరంగల్‌) చితికిపోతున్నాయని, వాటి పరపతి పెంచడానికి వీలుగా ప్రభుత్వం కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పాటైన మూడో డిస్కం తన కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి రోజు నుంచే పెద్ద ఆర్థిక సవాళ్లను ఎదుర్కోబోతోంది. ఇప్పటికే ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థల రూ. 35,900 కోట్ల పెండింగ్ విద్యుత్ బకాయిలను కొత్త విద్యుత్ సంస్థకు బదిలీ చేసి, […]
Read more

ఈనెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఏడవ సమావేశాలు , డిసెంబర్ 29న ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల సమస్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాదోపవాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ఈ శీతాకాల సమావేశాలు రాజకీయంగా వాడీవేడిగా సాగే అవకాశం ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజుల సెలవుల తర్వాత జనవరి 2న సభ తిరిగి ప్రారంభమవుతుందని మీడియా […]
Read more

నేడు కొత్త సర్పంచులతో ‘లంచ్‌’ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికైన కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించనున్నారు. వారంరితో కలిసి ఈరోజు మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ఈరోజు కోస్గిలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సమ్మేళనంలో… సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో సీఎం ముఖాముఖి చర్చలు జరుపుతారు. గ్రామ అభివృద్ధి, స్థానిక […]
Read more
1 3 4 5 6 7 38

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.