అంకారా/ తుర్కియా: సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ద్వైపాక్షిక చర్చల నిమిత్తం తుర్కియా (టర్కీ) చేరుకున్నారు. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో రాజకీయ, ఆర్థిక, సైనిక, భద్రత, సాంస్కృతిక రంగాలలో ఒకరినొకరు సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య కొత్త శకానికి నాందిగా ఇద్దరు దేశాధినేతలు అభివర్ణించారు. చర్చల అనంతరం ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని, ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు, సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. బుధవారం జరిగిన సమావేశంలో, ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు కోసం ఇరు దేశాల “చారిత్రక సోదరభావం” ఆధారంగా సహకారాన్ని అభివృద్ధి చేసి, కొనసాగించాలని ఇద్దరు నాయకులు ప్రతిజ్ఞ చేశారు.
తమ రెండు దేశాల మధ్య విమానాల సంఖ్యను పెంచడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సులభతరం చేయడం, పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం వంటి అంశాలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. అంతేకాదు ఎక్స్పో- 2030కి ఆతిథ్యం ఇవ్వడానికి రియాద్ అభ్యర్థిత్వానికి తుర్కియా మద్దతు ఇచ్చినందుకు సౌదీ అరేబియా కూడా కృతజ్ఞతలు తెలిపింది.
భద్రత, ఆరోగ్యం, మీడియా, క్రీడా రంగాలలో సహకరించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చాయి. సౌదీ-టర్కిష్ కోఆర్డినేషన్ కౌన్సిల్ను పునరుత్తేజం చేయడానికి, ఉమ్మడి ఆసక్తి ఉన్న రంగాలలో సహకారం, సమన్వయ స్థాయిని పెంచడానికి, రెండు దేశాల నిపుణుల మధ్య అనుభవాన్ని పంచుకోవడానికి ఇద్దరు నాయకులు అంగీకరించినట్లు ప్రకటన పేర్కొంది.
పెట్రోలియం, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఎలక్ట్రిసిటీ, పునరుత్పాదక శక్తి, హైడ్రోకార్బన్ వనరుల కోసం స్వచ్ఛమైన సాంకేతికతలు వంటి ఇంధన రంగంలో తమ సహకార అంచనాలను కూడా వారు వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీలు, స్మార్ట్ సిటీల రంగాలలో ఉత్పత్తి, పెట్టుబడి భాగస్వామ్యాల అభివృద్ధిపై కుదిరిన ఏకాభిప్రాయాన్ని కూడా ఈ ఉమ్మడి ప్రకటన నొక్కిచెప్పింది.
వాతావరణ మార్పులపై యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, పారిస్ ఒప్పందం యొక్క సూత్రాలకు కట్టుబడి ఉండటం, ఉద్గారాలపై దృష్టి సారించడం ద్వారా వాతావరణ ఒప్పందాన్ని అమలు చేయవలసిన అవసరాన్ని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి
గత ఏప్రిల్ చివరలో, ఎర్డోగాన్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో సౌదీ అరేబియాలో రెండు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో ఎర్డోగాన్, సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్తో పాటు కిరీటం యువరాజుతో సమావేశమయ్యారు. వివిధ అంతర్జాతీయ, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
Saudi Crown Prince Mohammed bin Salman is welcomed by Turkish President Recep Tayyip Erdogan with a ceremony in Ankara, Türkiye.
The official visit will involve discussions on taking bilateral relations to a higher level in this new era between the two nations pic.twitter.com/JZzEZ68mND
— TRT World (@trtworld) June 22, 2022