శ్రీనగర్: జమ్మూలో భద్రతా అధికారుల చేతిలో హత్యకు గురైన తన తండ్రికి న్యాయం చేకూర్చాలనే ఆశతో కూతురు జీనత్ ముస్తాక్ జమ్మూ – కాశ్మీర్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) శ్రీనగర్ కార్యాలయానికి ఒక దశాబ్దానికి పైగా తిరుగుతూనే ఉంది.
2019లో ఎస్హెచ్ఆర్సిని రద్దు చేసిన దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత, ఆర్టికల్ 370 , 35ఎలను రద్దు చేయడం వల్ల J&K తన రాష్ట్ర హోదాను కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాక “నేను ఆశ కోల్పోయాను” అని ఆమె చెప్పింది.
దశాబ్దాలుగా మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగుతున్న సంఘర్షణలతో దెబ్బతిన్న ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన SHRC, సమాచార, మహిళా కమిషన్తో సహా ఇతర సంస్థల జాబితాలో ఉంది, దీనికి ‘నయా కాశ్మీర్’లో స్థానం లేదు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, శ్రీనగర్లో ఫిబ్రవరి 7 – 9 వరకు షెడ్యూల్ చేయబడిన కార్యక్రమంలో ఈ ప్రాంతం నుండి మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించాలని జాతీయ మానవ హక్కుల సంఘం ప్యానెల్ నిర్ణయించినప్పుడు, జీనత్తో పాటు అనేక ఇతర బాధిత కుటుంబాల్లో మరోసారి ఆశారేఖలు విచ్చుకున్నాయి.
అయితే, ఈ NHRC పబ్లిక్ హియరింగ్ అకస్మాత్తుగా వాయిదా పడింది. వాతావరణ పరిస్థితుల కారణంగా తదుపరి తేదీని ప్రకటించలేదు, బాధిత కుటుంబాలకు ఎటువంటి ఉపశమనం లభించలేదు.
న్యాయం కోసం అంతులేని తపన
1990వ దశకంలో, కాశ్మీర్ స్థానికులపై భారీ అణిచివేతను ఎదుర్కొన్నప్పుడు, అధికారులు మామూలుగా వారిని నిర్బంధ శిబిరాలు, జైళ్లలో ఉంచడం ద్వారా, జీనత్ తండ్రి ముష్తాక్ అహ్మద్ బోటూ 1993లో అణిచివేత సమయంలో 10 గర్వాల్ రెజిమెంట్ తీసుకెళ్లిందని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.
కాశ్మీరీలకు వారి స్వంత భూమిలో వేధింపులు, అవమానాలు, చిత్రహింసలు ఎక్కువైన ఈ కాలంలో, బోటూను ఎటువంటి ఆరోపణలు లేకుండా యాదృచ్ఛికంగా బలగాలు పట్టుకుని బాదామ్ బాగ్ ఆర్మీ క్యాంపులో ఉంచారు. తరువాత మార్చి 20, 1993న జమ్మూలోని కోట్ భల్వాల్ జైలుకు తీసుకెళ్లారు. .
అతని జైలు శిక్ష దాదాపు ఒక నెల తర్వాత, సంబంధిత అధికారులు అతను ఏప్రిల్ 29, 1993న విడుదల అవుతారని బోటూ కుటుంబానికి తెలియజేసారు. ఉత్తర్వులను కూడా పంపించారు. అయితే, ఏప్రిల్ 27, 1993న జైలులో ఉన్న తన సోదరుడిని చూడటానికి వచ్చిన మహిళా సందర్శకులలో ఒకరి పట్ల ఖైదీలు చేసిన చెడు వ్యాఖ్యలపై ఖైదీలు, సెక్యూరిటీ గార్డుల (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్) మధ్య గొడవ జరిగింది. సెక్యూరిటీ గార్డులు బోటూను కాల్చి చంపారు.
తరువాత, బోటూ, ఇతరులు జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సెక్యూరిటీ గార్డులు పేర్కొన్నారు.
“నా తండ్రి నిరాయుధుడు, అతను పారిపోవడానికి లేదా జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, సెక్యూరిటీ గార్డులు అతని కాలు మీద లేదా నడుము క్రింద ఎక్కడైనా కాల్చవచ్చు, కానీ అతని ముఖ్యమైన అవయవాలపై కాల్చారు. ఇది కోల్డ్ బ్లడెడ్ హత్య” అని జీనత్ ది వైర్తో అన్నారు.
“2009 నుండి 2019 వరకు, నేను మా నాన్నకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్న నీడ లేకుండా పోయిన నా చిన్ననాటికి, మేము ఇప్పటికీ అనుభవిస్తున్న నిరాశకు నేను న్యాయం కోరుతున్నాను. ప్రారంభంలో, నాకు ఎటువంటి ఆశ లేదు, కానీ నేను SHRC వద్ద నా కేసును కొనసాగిస్తున్నాను” అని జీనత్ పేర్కొన్నారు.
బొటూ కుటుంబం ప్రకారం, ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే SHRC కేసుపై తీర్పును ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
“జమ్ము కశ్మీర్ ఇక్కడ తన స్వంత మానవ హక్కుల కమిషన్ను కలిగి ఉన్నప్పుడు, మాకు న్యాయం జరిగేలా ఏదైనా పొందాలనే ఆశ ఇంకా ఉంది. ఎందుకంటే మా ఉనికి కోసం SHRC నుండి మాకు కాల్స్ వస్తాయి. మా కేసుల గురించి వారు ఆందోళన చెందారు. కమిషన్ ఉనికిని కోల్పోయిన తర్వాత, న్యాయంపై నా ఆశ సన్నగిల్లుతోంది” అని జీనత్ అన్నారు.
మూడు దశాబ్దాల క్రితం హత్యకు గురైన తన తండ్రికి న్యాయం చేసేందుకు పోరాడుతున్న జీనత్ ముస్తాక్ గత చాలా సంవత్సరాలుగా చట్టపరమైన పత్రాలను భద్రపరిచారు. ఏప్రిల్ 1993లో జరిగిన కాల్పుల్లో సబ్ జైలు కోట్ భల్వాల్లో ఉంచబడిన ఖైదీలు, అండర్ ట్రయల్లతో సహా కొందరు వ్యక్తులు మరణించి, గాయపడిన సంఘటనకు గల కారణాలను మెజిస్టీరియల్ విచారణ వెల్లడించే దశకు బోటూ కేసు చేరుకుంది.
ఈ ఘటనపై 18 ఏళ్ల విచారణ అనంతరం కొందరు ఖైదీలు జైలు కాంప్లెక్స్లోని అధికారులపై రాళ్లు రువ్వారని తెలిసింది.
అయితే, ఈ సమయంలో ITBP/పోలీసు సిబ్బంది చాలా మంది సర్వీసు నుండి పదవీ విరమణ పొందారు. పోలీసులు, ITBP సిబ్బంది తప్ప సంఘటనకు స్వతంత్ర సాక్షులు ఎవరూ లేకపోవడంతో ఈ సమయంలో బోటూ ఈ సంఘటనలో పాల్గొన్నట్లు నిర్ధారించడానికి మార్గం లేదు.
బోటూ కేసులో, కుటుంబం అతనితో కోట్ భల్వాల్ జైలులో చేసిన తప్పులను గుర్తించి, దానికి తగిన పరిహారం ఇవ్వాలని కోరింది.
జంగ్ బహదూర్ సింగ్ జమ్వాల్, జిల్లా మరియు సెషన్ జడ్జి (రిటైర్డ్), J&K SHRC సభ్యుడు, రూ. 1 లక్ష నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారని, దానిని కుటుంబం తిరస్కరించిందని కుటుంబం చెబుతోంది.
ఇలా ఎన్నో కుటుంబాలు మానవహక్కుల కమిషన్ ద్వారా న్యాయం పొందేందుకు ఎదురుచూస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ రాష్ట్రహోదా కోల్పోవడంతో SHRC 2019లో మూసివేసారు. దాని కేసులు NHRCకి బదిలీ అయ్యాయి. అప్పటి నుండి, ఇప్పుడు కాశ్మీర్లో న్యాయం కోసం ఎటువంటి సంస్థ లేనందున SHRC ఆదేశాలను అమలు చేయడం లేదు.
2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసే వరకు, SHRC 22 సంవత్సరాలు పనిచేసింది. ఈ సందర్భంగా మానవ హక్కులు RTI కార్యకర్త MM షుజా మాట్లాడుతూ.. SHRCతో పాటు, సమాచార కమిషన్, మహిళా కమిషన్తో సహా 2019లో J&K నుండి ఇతర ముఖ్యమైన కమీషన్లను లాక్కున్నారని భావిస్తున్నారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలో పారదర్శకతను కోరుకుంటున్నట్లు చెబుతోంది కానీ కాశ్మీర్లో సంబంధిత వ్యక్తులకు జవాబుదారీగా ఉండే ఏ కార్యాలయమూ లేదని షుజా చెప్పారు.
“సమాచార హక్కు దరఖాస్తుల గురించి నాకు సమాచారం అందడం లేదు. నేను జోక్యం చేసుకోవాలని కేంద్ర సమాచార కమిషన్కు విజ్ఞప్తి చేయవలసి వస్తుంది. SHRC ఒక ముఖ్యమైన సంస్థ. SHRC మూసివేసే సమయంలో 2,800 కంటే ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్నాయి, తరువాత వాటిని NHRCకి బదిలీ చేశారు. ఆ కేసులలో చాలా వరకు ముగింపు దశలో ఉన్నాయి, ”అని షుజా ది వైర్తో అన్నారు.
అధికారులు కేసులను ఎన్హెచ్ఆర్సికి బదిలీ చేసినందున, న్యాయం జరుగుతుందనే అంచనాలు దెబ్బతిన్నాయని ఆయన హైలైట్ చేశారు.
“UT అడ్మినిస్ట్రేషన్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేనప్పుడు, మేము ఆయా సంస్థల నుండి ఎటువంటి న్యాయం ఆశించలేము” అని షుజా అన్నారు.