28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

పీహెచ్‌డీ ఫీజు పెంపుపై ‘ఓయూ’ విద్యార్థులు నిరసన!

హైదరాబాద్: పీహెచ్‌డీ కోర్సు ఫీజును తగ్గించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం సభ్యులు మంగళవారం డీన్‌లకు లేఖ అందించారు. విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థి సంఘాలు… ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) ప్రతినిధులు సోషల్ సైన్సెస్, సైన్సెస్, లా, కామర్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ డీన్‌లకు ఈ లేఖను అందించారు.

లేఖకు సమాధానంగా, చాలా మంది డీన్ ఫ్యాకల్టీలు ఫీజు నిర్ణయంలో తమ పాత్ర లేదని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని తెలియజేసారు.

సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, కామర్స్, మేనేజ్‌మెంట్, ఓరియంటల్ లాంగ్వేజెస్ పీహెచ్‌డీ రీసెర్చ్ విద్యార్థుల కోర్సు ఫీజు రూ.2000 కాగా.. తాజాగా రూ.20వేలకు పెంచారు.

సైన్సెస్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ పరిశోధక విద్యార్థులకు గతంలో రూ.2500గా ఉన్న కోర్సు ఫీజును రూ.25వేలకు పెంచారు. రుసుమును పది రెట్లు పెంచారు.

ఉస్మానియా యూనివర్శిటీలో చాలా మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులు చెల్లించాలా లేక అడ్మిషన్‌ను వదులుకోవాలా అనే అయోమయంలో ఉన్నారని విద్యార్థి సంఘం తమ పత్రికా ప్రకటనలో పేర్కొంది.పేద విద్యార్థులు అడ్మిషన్ల నుంచి తప్పుకోకుండా ఉండేందుకు ఫీజును తగ్గించాలని డిమాండ్ చేశారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles