హైదరాబాద్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (MANUU) డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (DDE) వివిధ డిస్టెన్స్ మోడ్ కోర్సుల కోసం తన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), అండర్ గ్రాడ్యుయేట్ (UG) సెమిస్టర్ మోడ్ 2020 బ్యాచ్, 2019 బ్యాచ్-సెమిస్టర్ మోడ్ ప్రోగ్రామ్లలోని విడిచిపెట్టిన విద్యార్థుల కోసం వివిధ కోర్సుల నమోదు ఇప్పుడు అవకాశమిచ్చారు.
MANUU ప్రొఫెసర్ మహ్మద్ రజావుల్లా ప్రకారం… పోర్టల్లో రుసుము చెల్లింపు మే 21, 2023 వరకు గడువు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం మే21వరకు వెబ్సైట్ తెరిచి ఉంటుంది.
వివిధ ప్రోగ్రామ్ల ఫీజు వివరాలు తెలుసుకునేందుకు… మరింత సమాచారం కోసం, యూనివర్సిటీ వెబ్సైట్ని చూడమని మనూ వర్గాలు తెలిపాయి.