హైదరాబాద్: వరంగల్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా, ఆదివారం వరంగల్ రైల్వే స్టేషన్లో తనిఖీ చేస్తున్నప్పుడు, స్టేషన్లో 50 కిలోల గంజాయి ఉన్న నాలుగు క్లెయిమ్ చేయని బ్యాగ్లను ఆర్పిఎఫ్ గుర్తించింది. దాని విలువ రూ. 50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఆ గంజాయి బస్తాలను వరంగల్ టాస్క్ ఫోర్స్కు అప్పగించారు.
నిందితులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మితా ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు.
ఈ ఏడాది ఆర్పిఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ జరిపిన 39 తనిఖీల్లో రూ. 11.32 కోట్ల విలువైన మాదకద్రవ్యాల ఉత్పత్తులను రికవరీ చేసింది. మాదక ద్రవ్యాలను తీసుకువెళుతున్న 49 మందిని అరెస్టు చేసింది. చట్టపరమైన చర్యల కోసం వారిని సంబంధిత లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు అప్పగించింది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 44 శాతం అధికంగా మాదకద్రవ్యాల ఉత్పత్తుల స్వాధీనం చేసుకున్నారు.