హైదరాబాద్: గత సెప్టెంబరులో దక్షిణమధ్య రైల్వేలోని రక్షక దళం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా నుండి 72 మంది పిల్లలను రక్షించింది. అంతేకాదు ఆపరేషన్ నార్కోస్ పేరిట నిర్వహించే డ్రైవ్ ద్వారా రూ.1.94
‘ఆపరేషన్ నన్హే ఫరిస్తే’ డ్రైవ్లో భాగంగా (ఒంటరిగా ఉన్న, రైల్వే స్టేషన్లలో వదిలేసిన పిల్లలు) ఆర్పిఎఫ్ 60 మంది బాలురు, 12 మంది బాలికలను రక్షించింది. అదనంగా, ‘ఆపరేషన్ ఆహ్త్’ కింద (మహిళలు, పిల్లలను అక్రమ రవాణాదారుల బారి నుండి రక్షించడం) 16 మంది బాలలను రక్షించారు.
రైల్వే ఆస్తులపై నేరాలను అరికట్టేందుకు ఆర్పీఎఫ్ ‘ఆపరేషన్ రైల్ సురక్ష’ను ప్రారంభించింది. 34 చోరీ కేసులను గుర్తించిన పోలీసులు రూ.89,40,007 విలువైన రైల్వే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు రూ.77,520 విలువైన అక్రమ మద్యాన్ని సీజ్ చేసి ముగ్గురు నేరస్తులను అరెస్టు చేయగా, ఎనిమిది కేసులు నమోదు చేశారు.
అదనంగా, ఆర్పిఎఫ్ ‘ఆపరేషన్ ఉపలబ్ద్’ కింద 14 మందిని అరెస్టు చేసి రూ. 2,51,689 విలువైన టిక్కెట్లను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎక్సైజ్ శాఖకు అప్పగించారు.