హైదరాబాద్: ఆరోగ్యంపై అవగాహన ఉన్న వ్యక్తులకు ఉత్తేజకరమైన వార్త! దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) నవంబర్ 4న హైదరాబాద్లో మిల్లెట్ ఫెస్టివల్ను నిర్వహిస్తోంది.
ఈ ఈవెంట్ ప్రజలు, మిల్లెట్ రైతులు, నిపుణులతో మమేకం కావడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. వారి అంతేకాదు మిల్లెట్లకు సంబంధించిన అనేక సందేహాలకు పరిష్కారాలు అందివ్వనుంది.
‘మిల్లెట్ ఫెస్ట్’కు హాజరైనవారు మిల్లెట్ బఫేలో కూడా పాల్గొనవచ్చు, విత్తన ప్రదర్శనలో పాల్గొనవచ్చు.
ఫెస్టివల్లో పాల్గొనేవారు 10 రకాల మిల్లెట్ వంటకాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అంతేకాదు రకరకాల మిల్లెట్ వంటకాలను నేర్చుకోవచ్చు.
సైఫాబాద్లోని కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్సెస్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకుని, రూ. 230 రుసుము చెల్లించడం ద్వారా వారి తమ సీటును రిజర్వ్ చేసుకోవచ్చు. అంతేకాదు 6 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక గ్రూపుగా పాల్గొనదలిస్తే అదనపు తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.