32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

మైనారిటీ సంక్షేమానికి కేంద్రం బడ్జెట్‌తో సమానంగా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయడంపై హర్షం!

 హైదరాబాద్: మైనారిటీ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ కేటాయింపులతో సమానంగా రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించడంపై తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్‌ఐఈఎస్) హర్షం వ్యక్తం చేసింది.

గురువారం రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమానికి రూ.3,000 కోట్లు ప్రతిపాదించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను టీఎమ్‌ఆర్‌ఐఈఎస్‌ ఉపాధ్యక్షుడు, మహమ్మద్‌ ఫహీముద్దీన్‌ ఖురేషీ అభినందించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ.3,183 కోట్లు మాత్రమే కేటాయించారని ఖురేషీ హైలైట్ చేశారు.

మైనారిటీలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఏళ్ల తరబడి నిలిచిపోయాయని విమర్శించారు. “కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌ల మైనారిటీ బడ్జెట్‌ను కలిపితే, అది కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్‌కు మూడు రెట్లు అవుతుంది” అని ఖురేషీ తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles