హైదరాబాద్: పేదలకు ఉచిత భోజన వసతి కల్పనకు ‘ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్’ పేరిట ఏర్పాటు చేసిన 20 వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 3వ వైస్ ప్రెసిడెంట్ ఎండార్సీ ఏపీ సింగ్తో కలిసి హైదరాబాద్లోని హోటల్ మారియట్లో మంగళవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320 నేతృత్వం వహించింది.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 3వ వైస్ ప్రెసిడెంట్ సింగ్ ఎన్నో ఏండ్లుగా నిరుపేదల కోసం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అందిస్తున్న సేవలు అద్భుతమని, ఆ సేవల్ని మరువలేనివని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 3వ వైస్ ప్రెసిడెంట్ ఎండార్సీ ఏపీ సింగ్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వాహనాలు తిరుగుతాయన్నారు. వీటితో ప్రస్తుతం కనీసం 100 రోజులపాటు ఉచిత భోజనం అందిస్తామన్నారు. భవిష్యత్తులో ఏడాదంతా భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్కో ట్రక్కులో రోజుకు 300 నుంచి 500 మందికి భోజనం వస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద 20 ఫుడ్ ట్రక్కులు కలిపి సంవత్సరానికి 28,84,000 భోజనాలను ఉచితంగా అందిస్తాయి. కార్యక్రమంలో ఆర్. సునీల్ కుమార్, జి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Launched “Meals on Wheels” initiative of The Lions Club International in Secunderabad. Under the project, wholesome meals will be distributed free of cost to needy people daily through 20 vehicles around the city. pic.twitter.com/tNCpGGyhrJ
— Talasani Srinivas Yadav (@YadavTalasani) May 3, 2022