హైదరాబాద్: నగరానికి ‘హైదరాబాద్’ అనే పేరుపై అక్కర లేని చర్చలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి, ముఖ్యంగా మితవాదులు రాజ్యమేలే కాలం నుండి నగరం పేరు మార్చాలని పదే పదే పట్టుబడుతున్నాయి. అయితే, ‘హైదరాబాద్’ పేరు భాగ్యనగర్ అనేందుకు తగ్గ చారిత్రక ఆధారాలు ఏవీ లేవని పేర్కొంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) స్పష్టం చేసింది. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి సంబంధించిన చారిత్రక రికార్డుల వివరాలు కూడా తమ వద్ద లేవని భారతీయ పురాతత్వ శాఖ తెలిపింది.
రాబిన్ అనే ఆర్.టి.ఐ కార్యకర్త దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం పిటీషన్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. చార్మినార్, గోల్కొండ కోట ఏఎస్ఐ హైదరాబాద్ సర్కిల్ పరిధిలోనే ఉండటం విశేషం. ఆర్టీఐ ప్రకారం హైదరాబాద్కు భాగ్యనగర్, లేదా మరేదైనా పేరు పెట్టలేదు. భాగమతి లేదా భాగ్యనగర్ పేర్లను సూచించే శాసనం కానీ, ఆ కాలానికి చెందిన నాణెం వంటి చారిత్రక ఆధారాలు లేవని కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) స్పష్టంగా పేర్కొంది.
అంతేకాకుండా, హైదరాబాద్ పేరును భాగ్యనగర్ లేదా మరేదైనా పేరు మార్చాలని భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుబట్టిన దాఖలాలు తమ వద్ద లేవని ఏఎస్ఐ పేర్కొంది.
చార్మినార్లో భాగ్యలక్ష్మి ఆలయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా అని దరఖాస్తులో అడిగితే… ఈ రోజు చార్మినార్ ఉన్న ప్రదేశంలో ఆలయం లేదా మరే ఇతర దేవాలయం ఉన్నట్లు తమ వద్ద రికార్డులు లేవని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) తెలిపింది.
చార్మినార్కు అనుబంధంగా ఉన్న ఆలయం 1960ల చివరలో నిర్మించిన అక్రమ కట్టడమని ఏఎస్ఐ కూడా అంగీకరించింది. 2019లో హైదరాబాద్లోని లమకాన్లో జరిగిన ప్రదర్శనలో, మాజీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్, ఆర్కియాలజిస్ట్ మిలన్ కుమార్ చౌలే దీనిని పునరుద్ఘాటించారు.
తెలంగాణలో తమ పరిధిలోని పురాతన మసీదులను హిందూ మతపరమైన ప్రదేశాల్లో నిర్మించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని జూన్లో ఏఎస్ఐ పేర్కొంది.