హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఏడాది ప్రపంచ అత్యుత్తమ బ్రాండ్ అవార్డ్ను కైవసం చేసుకుంది. ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ శుక్రవారం బ్రిటన్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో ‘డబ్ల్యూసీఆర్సీ లీడర్స్ ఏషియా, వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ 2022 అవార్డును అందుకున్నారు. మీడియా నివేదికలు, విశ్వవిద్యాలయం యొక్క వాటాదారులతో ఇంటర్వ్యూలు, ప్రాథమిక, ద్వితీయ పరిశోధన డేటా ఆధారంగా ఈ అవార్డుకు ఉస్మానియ విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసారు.
ఈ సందర్భంగా ఓయూ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ… ఉస్మానియా వర్సిటీకి ప్రాతినిధ్యం వహించడం, ప్రపంచ అత్యుత్తమ బ్రాండ్ అవార్డ్ అందుకోవడం గర్వించదగిన క్షణం అని ప్రొఫెసర్ రవీందర్ అన్నారు.
తన పర్యటనలో భాగంగా బ్రిటన్లో ఓయూ వైస్ ఛాన్సలర్… ఇంగ్లండ్ పార్లమెంటు సభ్యుడు లార్డ్ కరణ్ ఫరీడూన్ బిలిమోరియాను, బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ను కూడా కలిశారు. బారన్ బిలిమోరియా ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి కావడం విశేషం.
ప్రొఫెసర్ రవీందర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయాల మధ్య పరిశోధన, విద్యాపరమైన సహకారాన్ని చేపట్టే అవకాశాలను కూడా చర్చించారు. వచ్చే ఏడాది జనవరి ప్రారంభంలో జరగనున్న అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమావేశం 2023కి లార్డ్ కరణ్ బిలిమోరియాకు ఆహ్వానాన్ని సైతం అందించారు.