హైదరాబాద్: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం దేశంలోనే అత్యధికంగా శ్రామిక మహిళలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు.
ఏఐజీ హాస్పిటల్స్లో జరిగిన ‘మెడికల్ కాన్క్లేవ్ ఈవెంట్’లో మహిళలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. పటిష్టమైన మహిళా శ్రామికశక్తిని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. భారతదేశంలో స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన మూడు కంపెనీల్లో రెండు హైదరాబాద్కు చెందినవేనని, ఈ రెండింటిలో డ్రైవర్ సీటులో మహిళలే నాయకులుగా ఉన్నారని మంత్రి గుర్తు చేశారు. కేవలం వైద్య రంగంలోనే కాకుండా కృత్రిమ మేధ రంగంలో కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థల్లో మహిళలు బలమైన పాత్ర పోషిస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో పురోగతి సాధించిన మహిళల జాబితా అనంతమని మంత్రి తెలిపారు. హైదరాబాద్లో జీవశాస్త్రం సాంకేతికతను, డేటా సైన్స్లు లైఫ్ సైన్సెస్ను పెళ్లి చేసుకుంటాయని, మడ అడవులు మెటావర్స్ను కలుస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలలో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ తెలంగాణలోని 40 మిలియన్లకు పైగా పౌరుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్లను రూపొందించడానికి వైద్యం, సాంకేతికతను ఒకచోట చేర్చే ప్రతిష్టాత్మక మిషన్ను ప్రారంభించింది.
“ఈ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ సమయంలో, మహిళల్లో ఆంకోలాజికల్ వ్యాధులు, కార్డియాలజిక్ సవాళ్లు ఎక్కువగా ఉన్నాయని మేము గమనించాము. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 33 మెడికల్ కాలేజీలను ప్లాన్ చేసిందని” మంత్రి అన్నారు.
రాజన్న సిరిసిల్లలో ప్రతి సంవత్సరం 42,000 మందికి క్యాన్సర్ చికిత్స అందించేలా ప్రత్యేక ఆంకాలజీ యూనిట్తో మెడికల్ కాలేజీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిగ్రీ ప్రోగ్రామ్లలో చేరుతున్న మహిళల సంఖ్య పెరుగుతుండడాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. మహిళలకు సంబంధించిన మొదటి మూడు ప్రముఖ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో బ్యాచిలర్ సైన్సెస్ చాలా ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొన్నారు.
లైఫ్ సైన్సెస్లో 75 శాతం మంది మహిళలు గొప్ప శ్రామికశక్తిని సృష్టించడానికి అద్భుతమైన అవకాశం అని కేటీఆర్ అన్నారు.
మహమ్మారి సమయంలో రోగులకు తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన చికిత్స అందించినందుకు AIG హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డిని మంత్రి అభినందించారు.
It was a proud moment for us at AIG to host you KTR Garu. Thank you for such poised and exemplary commentary on the role of #women in all of #healthcare. https://t.co/mqO9RIpnt7
— AIG Hospitals (@AIGHospitals) December 3, 2022