24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బీఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర ప్రముఖ మైనారిటీ నేత….సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ మౌలానా!

హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి.  తెలంగాణలో అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ మోడల్ పేరిట జాతీయస్థాయిలో ప్రజాధరణ చూరగొంటున్నాయి.  ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులతో పాటు, రైతు సంఘాల నేతలు, ముస్లిం మైనారిటీ వర్గాల నేతలు కూడా సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలనపట్ల ఆకర్షితులవుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు మోడల్ మాదిరిగా తెలంగాణ మైనారిటీ అభివృద్ధి  మోడల్ మహరాష్ట్ర సహా దేశ వ్యాప్తంగా అమలు చేయాలని బలంగా కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం నాటి  మహారాష్ట్ర రైతు సంఘాల నేతల చేరిక జాతీయస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. దీని కొనసాగింపుగా మహారాష్ట్రకు చెందిన పలువురు మైనార్టీ నేతలు నిన్న బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

మహారాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకుడు సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ మౌలానా ఆదివారం ప్రగతి భవన్‌లో బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వచ్చిన మైనార్టీ నేతకు కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.

సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ మౌలానా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నాయకుడు. NCP పార్టీ ఉపాధ్యక్షుడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మౌలానా పోటీ చేశారు. గతంలో, అతను NCP జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడిగా, మహారాష్ట్ర NCP పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. మౌలానా NCP మహారాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు కూడా. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు చేరడం మహారాష్ట్రలో గణనీయమైన రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని, ఔరంగాబాద్ ప్రాంతంలో మౌలానా మంచి పట్టు ఉన్న నాయకులని చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles