హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రూపొందించిన “బీజేపీ వంద అబద్దాలు” బుక్ లెట్, సీడీనీ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ వైఫల్యాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందం(BRS Social Media) గత నాలుగు నెలలుగా ప్రచారం చేస్తోంది. ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం, జీఎస్టీ భారం, ఇంటింటికీ ఇంటర్నెట్, అందరికీ ఇళ్లు.. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, విభజన చట్టం హామీలు, ఐటీఐఆర్, ఆదిలాబాద్ సిమెంట్ కర్మాగారం, వాల్మీకీలకు ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఫల్యాలను సీడీ, బుక్లెట్ల్లో ప్రస్తావించారు.
కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలు నెరవేర్చని హామీలను పేర్కొన్నారు. వాటన్నింటినీ సీడీ, బుక్లెట్ రూపంలో సంకలనం చేశారు. బీజేపీ అబద్ధాలను ఇలా వెలుగులోకి తీసుకురావడం మంచి ప్రయత్నమని సోషల్ మీడియా కన్వీనర్లను కేటీఆర్ అభినందించారు.