హైదరాబాద్: విశ్వ నగరం హైదరాబాద్ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు చెరిగిపోకుండా చార్మినార్ దగ్గర త్వరలో అత్యాధునిక సౌకర్యాలతో సందర్శకుల ప్లాజా రూపుదిద్దుకోనుందని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం అన్నారు. సందర్శకుల ప్లాజాలో పబ్లిక్ ప్లాజా, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెల్ కాకుండా బహుళ ప్రయోజన పబ్లిక్ టాయిలెట్లు ఉంటాయి.
జీహెచ్ఎంసీ ప్రణాళికలపై MLC మీర్జా రహమత్ బేగ్తో కలిసి పార్టీ కార్యాలయంలో సమీక్షించిన సందర్భంగా ఆయన హైదరాబాద్ సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించడంపై దృష్టి సారించారు. హైదరాబాద్ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుతూనే, పర్యాటకులు చారిత్రక ప్రదేశాలను ఆస్వాదించేలా చూడాలని మేము కోరుకుంటున్నాము, ”అని ఆయన ట్వీట్ చేశారు.
జీహెచ్ఎంసీ ప్రణాళిక ప్రకారం, పబ్లిక్ స్థలాలు, పర్యాటక ప్రదేశాలకు సమీపంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్లను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. పబ్లిక్ ప్లాజాలో ముఖ్యమైన స్మారక చిహ్నాలను వీక్షించడానికి ఒక చిన్న యాంఫిథియేటర్ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాజా కింద పబ్లిక్ రెస్ట్రూమ్లు, సందర్శకుల కేంద్రం ఉండనున్నాయి. చారిత్ర ప్రదేశాలకు సంబంధించిన సమస్త సమాచారం సందర్శకులకు అందించనున్నారు. అంతేకాదు నావిగేట్ చేయడానికి మ్యాప్లు, తాగునీరు, పబ్లిక్ టాయిలెట్లు వంటి ప్రాథమిక సేవలను యాక్సెస్ చేయగల సమగ్ర సౌకర్యాలను ఈ ప్లాజాలో అందించనున్నారు. త్రాగునీరు, శిశువులకు సౌకర్యార్థం శానిటరీ నాప్కిన్ డిస్పెన్సర్ ఉన్నాయి.