న్యూఢిల్లీ: జైలులో ఉన్న విద్యార్థి కార్యకర్త ఉమర్ ఖాలిద్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భయపడుతున్నారని, ధైర్యం ఉంటే విచారణను ముందుకు తీసుకెళ్లాలని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే సవాల్ విసిరారు రు. ఖాలిద్పై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనను వ్యతిరేస్తున్న అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)ను కూడా ఖర్గే విమర్శించారు. ఆ మితవాద విద్యార్థి సంస్థ విద్యా సంస్కరణల వంటి నిర్మాణాత్మక అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
“ఉమర్ ఖాలిద్ దేశద్రోహి అని ఎవరు చెబుతున్నారు? కోర్టు అలా చెప్పిందా? ఆయన దేశద్రోహి అని బీజేపీ చెబుతోంది. రేపు, మీరు దేశద్రోహులని బీజేపీ మీకు చెబుతుంది. మనం దాన్ని నమ్మాలా?” అని బెంగళూరులో ఖర్గే విలేకరులతో అన్నారు. ఖాలిద్ను జాతీయవాదిగా అభివర్ణించిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు బి.కె. హరిప్రసాద్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హరిప్రసాద్ వ్యాఖ్యలు బీజేపీ, మితవాద సంస్థల నుంచి విమర్శలను ఎదుర్కొన్నాయి. ఫిబ్రవరి 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో భాగంగా ఖాలిద్ను సెప్టెంబర్ 2020లో అరెస్టు చేశారు. అతనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంతో పాటు ఇతర నిబంధనల కింద కేసు నమోదు చేశారు.
బీజేపీ ప్రభుత్వం విచారణను ఎందుకు చేపట్టడం లేదు? ఆయన జైలులో ఉండి ఇన్ని సంవత్సరాలు అయ్యింది; ఆయనపై కొన్ని ఛార్జిషీట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ ఎందుకు జరగడం లేదు? విచారణ జరపడానికి వారు (బీజేపీ) ఎందుకు అంతగా భయపడుతున్నారు?””మోదీ, అమిత్ షా గారూ, మీరెందుకు ఉమర్ ఖాలిద్కు అంతగా భయపడుతున్నారు? చర్యలు తీసుకోండి,” అని ఆయన అన్నారు.
ఎవరు జాతీయవాది, ఎవరు కాదో బీజేపీ కాకుండా న్యాయస్థానమే నిర్ణయించాలని ఖర్గే అన్నారు. “దేశద్రోహి ఎవరో మీరెందుకు నిర్ణయిస్తున్నారు? ఎవరు జాతీయుడు, ఎవరు దేశద్రోహి అని తేల్చే జాతీయతా పత్రాలు పంచే కాంట్రాక్టును వాళ్లే (బీజేపీ) తీసుకున్నారా?” అని ఆయన ప్రశ్నించారు.

