33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

దేశంలో అత్యధిక బ్యాంకు మోసాలన్నీ మోదీ హయాంలోనే… రాహుల్ గాంధీ ఆరోపణ!

న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక బ్యాంకు మోసాలన్నీ మోదీ హయాంలోనే జరిగినట్లు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ పాలనలో ఏకంగా రూ. 5.35 లక్షల కోట్లు విలువ చేసే మోసాలు జరిగినట్లు రాహుల్​ పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఈ స్థాయిలో ఎప్పుడూ మోసాలు జరగలేదని వ్యాఖ్యానించారు. గుజరాత్​లోని ఏజీబీ షిప్​యార్డ్​ మోసంపై స్పందిస్తూ రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ హయాంలో కేవలం ఆయన మిత్రులకు మాత్రమే మేలు జరిగిందని పేర్కొన్నారు.
బ్యాంకు మోసాలకు పాల్పడే వారికి ‘లూట్​ అండ్ ఎస్కేప్​’ పేరుతో మోదీ ప్రభుత్వం ప్రత్యేకమైన పథకం ఏర్పాటు చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. ఈ జాబితాలో నీరవ్​ మోదీ, చోక్సీ, లలిత్​ మోదీ, నీషల్​ మోదీ, విజయ్​ మాల్యా, జతిన్​ మెహతా, చేతన్​ సందేశారా వంటివారు ఎందరో ఉన్నారనని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రిషీ అగర్వాల్​ సహా మరికొందరు చేరారని ఎద్దేవా చేశారు.
చేశారు.  రణదీప్ సుర్జేవాల మాట్లాడుతూ….”ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏబీజీ షిప్​యార్డుకు 1,21,000 చదరపు మీటర్ల భూమిని 2007లో గుజరాత్ ప్రభుత్వం నాటి​ సీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేటాయించింది. ఒక చదరపు అడుగు విలువ రూ.1400 అయితే సగం ధరకే వారికి అమ్మేశారు. ఇదే విషయాన్ని కాగ్​ తన నివేదికలో పేర్కొంది. అయినా లెక్కచేయకుండా.. మోదీ దహేజ్​లో ఏజీబీ సంస్థకు 50 హెక్టార్ల భూమిని కేటాయించారు. ఆ ప్రాజెక్టును 2015లో మూసివేయడం గమనార్హనేను  కాంగ్రెస్ ప్రతినిధి పేర్కొన్నారు.

  • మోదీ ప్రభుత్వం అండదండలు ఉండటం వల్లే కంపెనీ లిక్విడేషన్​ అయిన 5 ఏళ్లకు సీబీఐ ఎఫ్​ఐఆర్​ దాఖలు చేసిందని సుర్జేవాలా విమర్శించారు.
  • మరోవంక ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారసభలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా ఏబీజీ షిప్ యార్డ్ కుంభకోణంపై విమర్శలు చేశారు. ఏ బ్యాంక్ కుంభకోణం జరిగినా దేశంలోని ఓ ప్రత్యేక ప్రాంతానికి చెందిన వ్యక్తులే అందులో ఉంటారని పరోక్షంగా ‘గుజరాత్‘ను ఉద్దేశించి అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles