హైదరాబాద్: జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అనుసంధానించే మెట్రో లైన్లు, అలాగే ఓల్డ్ సిటీ కోసం చాంద్రాయణగుట్ట నుండి ఎంజిబిఎస్ లైన్ను కలుపుతూ మెట్రో రైలు రెండవ దశ కారిడార్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మొత్తం 116.2 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్లకు అనుమతి లభించింది. విమానాశ్రయానికి వెళ్లే మార్గం ఆరమ్ఘర్ మీదుగా వెళుతుందని హెచ్ఎంఆర్ తెలిపింది. ప్రస్తుతానికి, హైదరాబాద్ మెట్రో రైలు మూడు కాారిడార్లు ఉన్నాయి. – ఆకుపచ్చ, ఎరుపు, నీలం (సికింద్రాబాద్ నుండి HITEC సిటీ). అంతేకాకుండా, మెట్రో అలైన్మెంట్ కోసం రోడ్డు విస్తరణ కారణంగా సుమారు 1100 ఆస్తులు ప్రభావితమవుతున్నాయని అధికారులు తెలిపారు. కొత్త మార్గాలలో దాదాపు 103 మతపరమైన, వారసత్వం, ఇతర సున్నితమైన నిర్మాణాలు తగిన ఇంజనీరింగ్ సొల్యూషన్స్, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు ద్వారా సేవ్ చేేశామని HMR మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి తెలిపారు.
“ఇది దాదాపు 6 స్టేషన్లతో పూర్తిగా ఎలివేటెడ్ మెట్రో కారిడార్. కొత్త హైదరాబాద్ మెట్రో రైలు (HMR) కారిడార్ల కోసం ఆస్తుల సేకరణ నిమిత్తం 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశామని ” ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం MA & UD శాఖ సీనియర్ అధికారులతో మెట్రో రైలు రెండవ దశ వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికల (DPRs) తయారీ పురోగతిని సమీక్షించారు. “హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఎండీ NVS రెడ్డి మెట్రో రెండవ దశ కారిడార్ల అలైన్మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్ స్థానాలు మొదలైనవాటిని వివరిస్తూ సవివరమైన ప్రదర్శనను అందించారు” అని హైదరాబాద్ మెట్రో రైలు (HMR) నుండి ఒక ప్రకటన తెలిపింది.
అన్ని కారిడార్లకు సంబంధించిన డీపీఆర్లకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సమావేశంలో రేవంత్ రెడ్డికి తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా కోసం తయారుచేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం హెచ్ఏఎంఎల్ ఎదురుచూస్తోందని ఆయన తెలిపారు.