కొలంబో: బ్రిటన్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది శ్రీలంక. కొలొంబో పోర్టుకు వచ్చిన బయోవేస్ట్ కంటైనర్లను తిరిగి వెనక్కు పంపింది. పలు ఆసియా దేశాలను డంపింగ్ యార్డులుగా వాడుకుంటున్నాయి పశ్చిమ దేశాలు. టన్నుల కొద్దీ వ్యర్థాల(Illegally Imported Waste)ను నౌకల ద్వారా రవాణా చేసి ఆసియా దేశాల్లో పడేస్తున్నాయి. దీనిపై శ్రీలంక చాలా దీటుగా స్పందించింది. అక్రమంగా దిగుమతి అయిన సుమారు 3 వేల టన్నుల చెత్తను, బ్రిటన్కు తిప్పి పంపింది. చివరి ట్రిప్ లో 45 కంటైనర్లతో ఉన్న కార్గో షిప్ నిన్న కొలంబో పోర్టు నుంచి బ్రిటన్కు బయలుదేరింది. 2017 నుంచి 2019 వరకు బ్రిటన్లోని ఓ కంపెనీ నుంచి శ్రీలంకకు సుమారు మూడు వేల టన్నుల చెత్త చేరింది.
వాడేసిన పరుపులు, కార్పెట్లు, రగ్గుల పేరిట ఇక్కడికి పంపిస్తోంది బ్రిటన్. అక్కడి నుంచి ఇతర దేశాలకు వాటిని పంపుతామని ఆ కంపెనీ తెలిపింది. ఆ కంటైనర్లను తెరిచి చూసి షాకయ్యారు శ్రీలంక కస్టమ్స్ అధికారులు. అందులో ఆసుపత్రుల వ్యర్థాలు, మార్చురీల నుంచి, పోస్ట్మార్టం అనంతరం మిగిలే మానవ శరీర భాగాలు వంటి ప్రమాదకర జీవ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో అవి నిండి ఉన్నాయి. ఈ కంటైనర్లకు ఏసీలు లేకపోవడంతో వాటి నుంచి దుర్వాసన వచ్చేది. మెడికల్, బయో వ్యర్థాలతో కూడిన 263 కంటైనర్లలో దిగుమతి అయిన 3వేల టన్నుల వ్యర్థాలను, ఆ దేశ కస్టమ్స్ అధికారులు పోర్టుల్లో గుర్తించారు. శ్రీలంక నుంచి తిరిగి వాటిని ఎక్కడికి రవాణా చేస్తారో అన్న దానిపై కస్టమ్స్ అధికారులకు సరైన ఆధారాలు లభించలేదు. అటు శ్రీలంక పర్యావరణ కార్యకర్తల గ్రూప్ బయో వ్యర్థాల కంటైనర్లపై కోర్టును ఆశ్రయించింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వాటిని తిప్పి పంపాలని డిమాండ్ చేసింది. 2020లో ఈ పిటిషన్ అపీల్ను శ్రీలంక కోర్టు సమర్థించింది. దశల వారీగా చెత్తను ఆ దేశానికే తిరిగి రవాణా చేస్తున్నారు. మొత్తం 263 కంటైనర్లలో చివరిగా 45 కంటైనర్ల వ్యర్థాలను రవాణా నౌక ద్వారా కొలంబొ పోర్టు నుంచి బ్రిటన్కు పంపారు శ్రీలంక అధికారులు. అక్రమంగా దిగుమతి చేసుకున్న వేలాది టన్నుల వ్యర్థాలతో నిండిన అనేక వందల కంటైనర్లలో చివరి భాగాన్ని శ్రీలంక సోమవారం బ్రిటన్కు పంపిందని అధికారులు తెలిపారు.
అనేక ఆసియా దేశాలు ఇటీవలి సంవత్సరాలలో సంపన్న దేశాల నుండి చెత్త దాడికి వ్యతిరేకంగా వెనక్కి నెట్టడం మరియు అవాంఛిత సరుకులను తిప్పికొట్టడం ప్రారంభించాయి.
బ్రిటన్ నుండి వచ్చిన వ్యర్థాలు 2017 మరియు 2019 మధ్య శ్రీలంకకు చేరాయి మరియు “ఉపయోగించిన పరుపులు, తివాచీలు మరియు రగ్గులు”గా జాబితా చేయబడ్డాయి.
అయితే వాస్తవానికి ఇందులో మార్చురీల నుండి శరీర భాగాలతో సహా ఆసుపత్రుల నుండి బయోవేస్ట్ కూడా ఉందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కంటెయినర్లు చల్లబడకపోవడమే కాకుండా వాటిలో కొన్ని శక్తివంతమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి.
సోమవారం కొలంబో ఓడరేవులో ఓడలో లోడ్ చేయబడిన 45 కంటైనర్లు 263 కంటైనర్ల చివరి బ్యాచ్, దాదాపు 3,000 టన్నుల వ్యర్థాలను కలిగి ఉన్నాయి.
ఈ మేరకు సోమవారం కొలంబో ఓడరేవులోని ఓడల్లో లోడ్ చేయబడిన కంటైనర్లలోదాదాపు 3 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నాయని శ్రీలంక అధికారులు గుర్తించారు.. దీంతో కస్టమ్స్ చీఫ్ విజిత రవిప్రియ ఈ విషయమై స్పందించి.. “ఇలాంటి ప్రమాదకర వాటిని దిగుమతి చేసుకోం అప్రమత్తంగా ఉండటమే కాక మళ్లీ జరగకుండా చూసుకుంటాం.” అని వివరణ ఇచ్చారు.
దౌత్య పరంగా శ్రీలంక నిర్ణయం పెద్ద అడుగుగానే చెప్పాలి. ఇటు కరోనా కారణంగా బాగా దెబ్బతిన్న శ్రీలంక భయపడకుండా వ్యవహరించిందని, మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సమస్య శ్రీలంక ఒక్క దేశానిదే కాదు.. చాలా దేశాలకు ఈ బెడద ఉంది.
ప్రపంచలో అభివృద్ధి చెందిన ధనిక దేశాలు చాలావరకు ఇలా చెత్తను దిగుమతి చేసి.. సముద్ర మార్గాల గుండా పంపించి చేతులు దులుపుకుంటాయి. ఈ క్రమంలో ఆసియా దేశాల్లో చాలావరకు ఇలాంటి చెత్త కంటెయినర్లు చేరి.. ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయి. శ్రీలంక లాగే.. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా (Indonesia), మలేషియా కూడా దిగుమతవుతున్న వందలాది చెత్త కంటైనర్లను గతంలో ఆయా దేశాలకు తిరిగి పంపించాయి. ఆయా దేశాల సత్సంబంధాల కన్నా ఈ చెత్తను భరించడం దేశాలకు తలనొప్పిగా మారింది. ఆ స్థాయిలో చెత్త వ్యర్థాలు ఉంటున్నాయని చెబుతోంది.