న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై నెల రోజులవుతున్న తరుణంలో, భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా పడింది. ఈ సంక్షోభాన్ని చూపి ఇంధన ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని దాదాపు మూడింట రెండు వంతుల పట్టణ భారతీయులు (64 శాతం) భావిస్తున్నారని యూగౌస్ (YouGovs) అధ్యయన సంస్థ తాజా గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు అదే సంఖ్యలో (63 శాతం) నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇవి (ఇంధన ధరలకు 70 శాతం, వస్తువుల ధరకు 61 శాతం)కి సంబంధించినవి.
ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల మంది వ్యక్తులతో కూడిన యూగౌస్ (YouGov) ప్యానెల్ని ఉపయోగించి 2022 మార్చి 8-14, మధ్య భారతదేశంలో 1,527 మంది ప్రజల నుండి యూగౌ ఆమ్నిబస్ డేటా ఆన్లైన్లో సేకరించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కారణంగా ద్రవ్యోల్బణం రేటు పెరుగుదల తమ కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చాలా మంది పట్టణాల్లో నివసిస్తున్న భారతీయులు భావిస్తున్నారు. వారు తమ అత్యవసర ఖర్చులను (49 శాతం) తగ్గించుకోవాలి, అంతేకాదు ఖర్చుల కోసం తమ పొదుపు (18 శాతం)పై ఆధారపడాలి లేదా అప్పులు (9 శాతం) తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనం తేల్చింది.
పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని నివాసితులు తమ అత్యవసర ఖర్చులను తగ్గించుకుంటామని చెప్పారు, దక్షిణ భారతదేశంలోని వారు తమ పొదుపును లేదా వారి ఖర్చులను కవర్ చేయడానికి రుణం తీసుకుంటామని సర్వేలో తెలిపారు. ఇది కాకుండా, సగం మంది ప్రజలు మూడవ ప్రపంచ యుద్ధం గురించి (52 శాతం) భయపడుతున్నారు, అయితే చాలా మంది స్టాక్ మార్కెట్లో అస్థిరత, ద్రవ్యోల్బణంరేట్ల పెరుగుదల (43 శాతం మరియు 39 శాతం) అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదల ఆందోళనకరంగా ఉందని పేర్కొన్న వారిలో, మూడవ వంతు మంది (36 శాతం) మంది ప్రజలు ఇంధన ధరలో
మరింత పెరిగినట్లయితే, తమ సొంత వాహనాలను ఉపయోగించకుండా ప్రజా రవాణాను ఉపయోగిస్తామని చెప్పారు.