హైదరాబాద్: మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో నాలుగు పాఠశాలలు, రెండు చొప్పున ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చెంది కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగ్గా మారాయి.
ఈ నాలిగింటిలో జడ్పీహెచ్ఎస్ జిల్లెలగూడ, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా, జడ్పీహెచ్ఎస్ శివరాంపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, మహబూబియా (బాలికల) మోడల్ హై స్కూల్, హైదరాబాద్, ఆలియా మోడల్ స్కూల్, గన్ ఫౌండ్రీ, హైదరాబాద్ ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రారంభించారు.
మన ఊరు-మనబడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన ప్రతి పాఠశాలలో నీటి సౌకర్యం, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు/సిబ్బందికి సరిపడా ఫర్నీచర్, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, పెద్ద మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, కాంపౌండ్ గోడలు, కిచెన్ షెడ్లు, భోజన సౌకర్యం కోసం హాళ్లు, శిథిలావస్థలో ఉన్న గదుల స్థానంలో కొత్త తరగతి గదులు, మరుగుదొడ్లను నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ మరియు డిజిటల్ విద్యను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.7,289.54 కోట్లు కేటాయించారు. ఈ పనుల వల్ల రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. మొదటి దశలో, ప్రస్తుత విద్యా సంవత్సరంలో 13 లక్షల మంది విద్యార్థులు చదువుతున్న 9,123 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి.