హైదరాబాద్: నగరంలో దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లు బంగ్లాదేశ్, నేపాల్, థాయ్లాండ్కు కూడా చేరుతున్నాయి. అక్కడ అవి సెకండ్ హ్యాండ్ గాడ్జెట్లుగా అమ్ముడవుతున్నాయి. ఇందుకోసం నగరంలో బహుళ అంచె సిండికేట్ పనిచేస్తోంది. దొంగిలించిన గాడ్జెట్లను స్థానిక కొనుగోలుదారులు ఈ దేశాలకు అక్రమంగా రవాణా చేసే డీలర్లకు విక్రయిస్తున్నారు.
“నిందితులు తాము దొంగిలించిన మొబైల్ ఫోన్లను స్థానిక కొనుగోలుదారులకు విక్రయిస్తారు, వారు దానిని ఇతర రాష్ట్రాల్లోని డీలర్లకు విక్రయిస్తారు. బంగ్లాదేశ్ లేదా నేపాల్ నుండి కొంతమంది వ్యక్తులు వచ్చి వారి నుండి తమ ఏజెంట్ల ద్వారా వాటిని కొనుగోలు చేస్తారు. విక్రయించే ముందు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ను తారుమారు చేస్తారు’’ అని హైదరాబాద్ సిటీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
దొంగ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయడానికి నేపాల్, బంగ్లాదేశ్ నుండి డీలర్లు తరచుగా పశ్చిమ బెంగాల్కు వస్తున్నట్లు పోలీసులు ఇటీవలి దర్యాప్తులో తేలింది. “గాడ్జెట్లు మన పొరుగు దేశాలలో సెకండ్ హ్యాండ్ గాడ్జెట్లుగా తిరిగి విక్రయిస్తున్నారు. కొంతమంది డీలర్లు ముంబైని కూడా వెళతారు, అక్కడ నుండి వారు ఈ గాడ్జెట్లను కొనుగోలు చేసి విక్రయించడానికి తమ దేశానికి అక్రమంగా రవాణా చేస్తారు, ”అని అధికారి తెలిపారు.
దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం రాష్ట్రంలో ఒక సాధారణ పని అయింది, అనేక మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి వాటి యజమానులకు అందజేస్తున్నామని పోలీసులు చెప్పారు. అయితే, ప్రొఫెషనల్ దొంగలు దొంగిలించిన మొబైల్ ఫోన్లను డీలర్లకు విక్రయిస్తే మాత్రం వాటిని తిరిగి పొందడం కష్టం.
“ఒకసారి మొబైల్ ఫోన్ రాష్ట్రం నుండి అక్రమంగా రవాణా అయితే మాత్రం దానిని ట్రాక్ చేయడం, తిరిగి పొందడం కష్టం. అలా కాకుంటే మాత్రం పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందవచ్చు”అని అధికారి తెలిపారు. సాధారణంగా రైళ్లలో, బస్సుల్లో, రద్దీగా ఉండే ప్రదేశాలలో, పెద్ద ఊరేగింపులు లేదా రాజకీయ సమావేశాల సమయంలో మొబైల్ ఫోన్లను జేబు దొంగలు దొంగిలిస్తారు. వీటిని “తమ ముఠా నాయకులకు ఇచ్చే చిన్న దొంగలు ఉన్నారు. మరికొంతమంది దొంగ వస్తువులను కొనుగోలు చేసే వ్యక్తులతో నాయకులు నేరుగా టచ్లో ఉన్నాఉంటారు, ”అని అధికారులు తెలిపారు.
అయితే చోరీ వస్తువులు కొనుగోలు చేసే వారిని పట్టుకోవడంపై పోలీసులు దృష్టి సారించారు. “స్థానికంగా దొంగ ఫోన్లను కొనుగోలుచేసే దుకాణదారులను శిక్షిస్తే, ఈ గొలుసు చాలా వరకు విచ్ఛిన్నమవుతుంది. స్థానిక దొంగలు గాడ్జెట్లను పారవేయడం కష్టంగా ఉంటుంది’’ అని మరో అధికారి తెలిపారు.