33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నాంప‌ల్లిలో సెప్టెంబర్ 17న మెగా జాబ్ మేళా!

హైదరాబాద్: డెక్కన్ బ్లాస్టర్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వివిధ కార్పొరేట్ సంస్థల మద్దతుతో ఈ స్వచ్ఛంద సంస్థ NGO నిర్వహిస్తున్న 49వ జాబ్ మేళా ఇది. ఐటీ, విద్యా సంస్థలు, సెక్యూరిటీ, ఫార్మా తదితర వివిధ రంగాలకు చెందిన దాదాపు 70 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

అభ్యర్థులకు కనీస విద్యార్హత పదోతరగతి ఉత్తీర్ణత. ఈ జాబ్ మేళా 17వ తేదీ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య జరుగుతుంది.  మరిన్ని వివరాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చు.

ఈ సందర్భంగా మన్నన్ ఖాన్ మాట్లాడుతూ…  “ఇప్పటివరకు, మేము నగరంలో 48 జాబ్ మేళాలను నిర్వహించాము. 17 వ తేదీన నిర్వహించబోచే జాబ్ మేళా 49వది. ఈ జాబ్ మేళాల్లో వేల మంది  అభ్యర్థులను వివిధ కంపెనీలు ఎంపిక చేశాయి. కెరీర్ అవకాశాలతో పాటు, అభ్యర్థులు తమ సామర్థ్యాలను గుర్తించడంలో, వారికి సరైన ఫీల్డ్‌లను ఎంచుకోవడంలో సహాయపడేందుకు మేము కౌన్సెలింగ్ సెషన్‌లను కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులు అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాల యొక్క రెండు సెట్లు, బయోడేటా మరియు ఫోటోలు తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు.

దక్కన్‌ బ్లాస్టర్స్‌ స్వచ్ఛంద సంస్థ
ఈ సామాజిక సంస్థను ఓ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన మన్నన్‌ ఖాన్‌ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుపుతున్నాడు. మొదట లాక్‌డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం ప్రారంభించాడు. తరువాత కోవిడ్‌తో పోరాడుతున్న వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించాడు. డాక్టర్ సంజీవ్ కుమార్‌తో కలిసి ఆన్‌లైన్ ఉచిత వైద్యసేవలు ఆరంభించాడు. అంతేకాదు కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో యువతకు ఆయన కారుచీకట్లో కాంతిరేఖలా ఓ దారి చూపారు. అలాగే లాక్‌డౌన్‌ సమయంలో విశేష సేవలందించిన 25కు స్వచ్ఛంద సంస్థలను సత్కరించాడు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో నిర్విరామంగా సేవలందించిన పోలీసు సిబ్బందిని సత్కరించాడు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles