హైదరాబాద్: లంగర్హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదర్బాగ్లో కరెంట్ షాక్తో యువ జంట మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సయ్యద్ నిసారుద్దీన్ (26) సూర్యాపేట ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తుండగా, అతని భార్య ఉమ్మే మొహిమీన్ సైమా (22) డెక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఖాదర్బాగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో దంపతులు నివాసం ఉంటున్నారు.
కుటుంబ సభ్యులు వారిద్దరికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందన లేకపోయేసరికి అనుమానం వచ్చి… ఇంటికి చేరుకుని చూడగా వారిద్దరు విగతజీవులుగా కనిపించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని ఆసుపత్రికి తరలించగా… అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
గీజర్ నుండి మహిళకు మొదట విద్యుత్ షాక్ తగిలిందని, అతని భార్య రక్షించే ప్రయత్నంలో నిసారుద్దీన్కు షాక్ తగిలిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఇటీవలే వీరిద్దరికి వివాహమైంది. నవ దంపతుల మృతితో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగారు.
ఈ జంట స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.