న్యూఢిల్లీ: బెంగళూరు-పూణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలోని నవాలే వంతెన వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్లో ఏకంగా 48 వాహనాలు దెబ్బతిన్నాయి. పూణె అగ్నిమాపక దళం ఈ విషయాలను వెల్లడించింది. ఈ ప్రమాదంలో 38 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుణె అగ్నిమాపక దళం, పుణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ (PMRDA) అధికారులు రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఓ ట్యాంకర్ లారీ వేగంగా వెళ్తుండగా బ్రేకులు పని చేయకపోవటంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. అందులోని చమురు రోడ్డుపై పడటంతో పలు వాహనాలు పట్టుకోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. మొత్తంగా 48 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.
ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంతో పూణె, బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బ్రేకులు ఫెయిల్ కావడం, వాహనం లోడ్తో ఉండటంతో కంట్రోల్ చేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
A major accident occurred at Navale bridge on the Pune-Bengaluru highway in Pune in which about 48 vehicles got damaged. Rescue teams from the Pune Fire Brigade and Pune Metropolitan Region Development Authority (PMRDA) have reached the spot: Pune Fire Brigade pic.twitter.com/h5Y5XtxVhW
— ANI (@ANI) November 20, 2022