30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

పూణె-బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం… 38మందికి గాయాలు, 48 వాహనాలు ధ్వంసం!

న్యూఢిల్లీ: బెంగళూరు-పూణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలోని నవాలే వంతెన వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‍లో ఏకంగా 48 వాహనాలు దెబ్బతిన్నాయి. పూణె అగ్నిమాపక దళం ఈ విషయాలను వెల్లడించింది. ఈ ప్రమాదంలో 38 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుణె అగ్నిమాపక దళం, పుణె మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ (PMRDA) అధికారులు రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ఓ ట్యాంకర్‌ లారీ వేగంగా వెళ్తుండగా బ్రేకులు పని చేయకపోవటంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. అందులోని చమురు రోడ్డుపై పడటంతో పలు వాహనాలు పట్టుకోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. మొత్తంగా 48 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంతో పూణె, బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  బ్రేకులు ఫెయిల్ కావడం, వాహనం లోడ్‌తో ఉండటంతో కంట్రోల్ చేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

 

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles