28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

గుజరాత్‌లో నేడు తొలి విడత ఎన్నికలు… 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రారంభం!

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఇవాళ మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ఆరంభమైంది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించగా.. తొలివిడతలో 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  గుజరాత్ రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ యత్నిస్తుండగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి.  మొదటి దశ పోలింగ్ 19 జిల్లాల్లోని 89 కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలున్నాయి.

1995 నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీకి, సంఖ్యాబలం తగ్గడమే అసలైన సవాలు. 2002 నుంచి పార్టీ స్థానాలు ఒక్కొక్కటిగా తగ్గుతున్నాయి. 2018 ఎన్నికల్లో 137 నుంచి ఆ పార్టీ బలం 99కి పడిపోయింది. రాష్ట్రంలోని 182 సీట్లలో 140 సీట్లను పార్టీ లక్ష్యంగా పెట్టుకుని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా కార్యకలాపాలను నియంత్రిస్తున్నారు. అగ్ర నేతలతో రాష్ట్ర వ్యాప్తంగా  బీజేపీ హై వోల్టేజ్ ప్రచారం నిర్వహించింది.

ఇక ఎన్నికల ప్రచారంలో భాగుంగా గుజరాత్‌లో  ఎక్కువ కాలం గడిపిన బీజేపీయేతర నాయకుడు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో సాధించిన భారీ విజయంతో ఉల్లాసంగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి గుజరాత్‌ను పార్టీ తదుపరి లక్ష్యంగా చేసుకున్నారు.

గుజరాత్‌లో 2018 ఎన్నికల్లో ఖాతా తెరవడంలో విఫలమైన ఆప్ — 92 సీట్లు, వాటిలో 8 సూరత్‌లోనే గెలుస్తుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. విద్య, ఆరోగ్యంపై దృష్టి సారించి ఢిల్లీలో పార్టీ పాలనా విధానంలో దూసుకెళ్తున్న ఆప్ అధినేత గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై భారీగా విమర్శలు గుప్పించారు.

ఎన్నికల ప్రచారంలో భాంగా  ‘ఆప్’ చేసిన సవాలును అమిత్ షా తోసిపుచ్చారు, “ఆప్ గుజరాత్ ప్రజల మనస్సులో ఎక్కడా లేదు. ఎన్నికల ఫలితాల కోసం వేచి ఉండండి, బహుశా విజయవంతమైన అభ్యర్థుల జాబితాలో ఆప్ పేరు కనిపించకపోవచ్చు” అని అన్నారు.

2018లో 77 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, బ్యాలెట్ బాక్సులను హోంగార్డులు లేదా రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలో కాకుండా కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉంచాలని ఎన్నికల కమిషన్‌ను కోరనున్నట్లు తెలిపింది. పోలింగ్ బూత్‌ల రక్షణ కోసం రప్పించిన త్రిపుర రైఫిల్స్‌ను 1.5 కి.మీ దూరంలో ఉండాలని కోరారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రంగానే సాగింది.  ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ గుజరాత్ ప్రచారంలో ఒకరోజు మాత్రమే పాల్గొన్నారు. డిసెంబర్ 5న రెండో దశ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది..

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles