Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బెంగళూరు తొక్కిసలాట ఘటనలో ఆర్‌సీబీ ఉన్నతాధికారి సహా నలుగురు అరెస్ట్‌!

బెంగళూరు: ఐపీఎల్‌ విజయోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో కర్ణాటక పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్‌సిబికి చెందిన ఉన్నతాధికారి, మార్కెటింగ్ మేనేజర్‌ నిఖిల్ సోసలే అరెస్టు అయిన వారిలో ఉన్నారు. ఆయన ముంబైకి వెళుతుండగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. మార్కెటింగ్‌ అధికారి సోసలే […]
Read more

హైదరాబాద్‌లో రఫేల్‌ యుద్ధవిమానం విడిభాగాల తయారీ!

హైదరాబాద్‌ : అభివృద్దిలో జెట్‌స్పీడుగా దూసుకెళ్తున్న విశ్వనగరం హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వచ్చేసింది. రఫేల్ యుద్ధ విమానాల నిర్మాణంలో కీలకమైన భాగాలైన ఫ్యూజ్‌లేజ్‌లు మన భాగ్యనగరంలోనే తయారవుతాయి. ఈమేరకు డస్సాల్ట్ ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సంయుక్తంగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం భారత రక్షణ రంగానికి పెద్ద ప్రోత్సాహకం కానుంది. భారత నౌకాదళం కోసం 26 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారతదేశం ఇటీవల సంతకం చేసిన 7.4 బిలియన్ […]
Read more

ఖుర్బానీకి ప్రత్యామ్నాయం లేదు!

….ముహమ్మద్ ముజాహిద్ బక్రీద్ పండుగు వచ్చే ముందు ఖుర్బానీ కోసం ముస్లిములు ప్రయత్నాలు ఆరంబించడం సాధారణంగా ప్రతిచోట కనబడుతుంది. హజ్ చేసే అవకాశం దొరికిన లక్షలాది మంది లబ్బైక్ అంటూ మక్కా నగరానికి వెళతారు. కోట్లాది ముస్లిములు, హజ్ యాత్రకు వెళ్ళలేని వారు మహాప్రవక్త ముహమ్మద్ (స) సంప్రదాయాన్ని పాటిస్తూ, హజ్రత్ ఇబ్రాహీమ్ అపూర్వ త్యాగనిరతిని స్మరిస్తూ పశువులను ఖుర్బానీ ఇస్తారు. మారుతున్న కాలం, మారుతున్న ఆలోచనలు, వైఖరులు, విధానాల నేపథ్యంలో కొత్త కొత్త వాదనలు పుట్టుకు […]
Read more

ఆరు హామీల అమలుపై అధికారులు దృష్టి పెట్టాలి….వైద్యశాఖా మంత్రి రాజనరసింహ!

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలని వైద్యశాఖా మంత్రి దామోదర్ రాజ నరసింహ అధికారులను ఆదేశించారు. పథకాలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకం ప్రయోజనాలను త్వరగా అందించాలని ఆరోగ్య మంత్రి జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ మేరకు నిన్న సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి. క్రాంతి నేతృత్వంలోని అన్ని విభాగాల అధికారులతో మంత్రి అన్ని సంక్షేమ పథకాల […]
Read more

ఉద్యోగం నుంచి క్రైస్తవ సైనిక అధికారి తొలగింపు…సైనికుడి విశ్వాసాన్ని క్రమశిక్షణకు ముప్పుగా పరిగణిస్తారా!

న్యూఢిల్లీ: మతపర పరేడ్‌లో పాల్గొననందున ఆర్మీ అధికారి తొలగింపును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. మతం కంటే యూనిఫారమే ముఖ్యమని, ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా….1. సైనికుడి మత విశ్వాసం రెజిమెంటల్ సంప్రదాయంలో పాతుకుపోయిన సైనిక నియమాన్ని అధిగమించగలదా? 2. ఒక నిర్దిష్ట రెజిమెంట్‌లోని సైనికులలో ఎక్కువ మంది హిందువులు లేదా సిక్కులు అయినప్పటికీ, హిందువు కాని వ్యక్తి… హిందూ లేదా సిక్కు ఆలయంలో ప్రార్థనలలో పాల్గొనడం తప్పనిసరి అవుతుందా? […]
Read more

గాజాలో మానవత్వం మంటగలుస్తోంది…అక్కడి స్థితి నరకం కంటే దారుణంగా ఉందన్న రెడ్ క్రాస్ చీఫ్!

జెరూసలేం : గాజాలో మానవత్వం మంటగలిసిందని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అధ్యక్షురాలు మిర్జానా స్పోల్జారిక్ హెచ్చరించారు, యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనా ప్రాంతంలో ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న బాధలను చూడటం భరించలేనిదిగా మారుతోంది. పరిస్థితి నైతిక, మానవీయ ప్రమాణాలను మించిపోయిందని ఆమె BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కొన్ని వారాల క్రితం, గాజా పర్యటన సందర్భంగా, వేదనకు గురైన రెడ్ క్రాస్ చీఫ్ గాజా భూమిపై నరకంగా మారిందని వ్యాఖ్యానించారు. మంగళవారం BBCకి చెందిన జెరెమీ బోవెన్‌తో […]
Read more

ఆర్‌సీబీ విజయోత్సవాల్లో అపశృతి…11మంది మృతి, 50మందికి గాయాలు!

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. ఆర్‌సీబీ విజయోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. స్టేడియం వెలుపల నిన్న సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత వారిని సత్కరించే కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. టిక్కెట్లు, పాస్‌లు ఉన్న వ్యక్తులకే స్టేడియంలోకి అనుమతించినప్పటికీ, భారీసంఖ్యలో అభిమానులు తమ క్రికెట్ హీరోలను […]
Read more

రఫాలోని గాజా సహాయ పంపిణీ కేంద్రం వద్ద ఇజ్రాయెల్‌ కాల్పులు… 27 మంది పాలస్తీనియన్ల మృతి!

జెరూసలేం: దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఆహార పంపిణీ కేంద్రం సమీపంలో నిన్న ఇజ్రాయెల్ సైన్యం జరిపిన కాల్పుల్లో కనీసం 27 మంది పాలస్తీనియన్లు మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. వరుసగా మూడవరోజు కూడా ఇజ్రాయెల్‌ రక్తపాతానికి పూనుకోవడంతో సహాయ కార్యకలాపాలను ప్రభావితం చేసింది. రఫాలోని పంపిణీ కేంద్రం సమీపంలో నిర్దేశించిన మార్గాలను దాటి వెళ్ళిన వ్యక్తుల సమూహంపై తమ దళాలు కాల్పులు జరిపాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఏమి జరిగిందో దర్యాప్తు […]
Read more

అమెరికాకు సరెండర్‌ అయిన నరేందర్‌… పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై రాహుల్ గాంధీ విమర్శలు!

భోపాల్: భారత్-పాకిస్తాన్ సైనిక ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు లొంగిపోయారని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. భోపాల్ లో జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ, అమెరికా తన నౌకాదళాన్ని పంపినప్పటికీ అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1971 యుద్ధంలో చలించలేదని రాహుల్‌ అన్నారు. “భారత్‌, పాక్ ఉద్రిక్తతల సందర్భంగా‌ కాల్పుల విరమణ ఆపాలని ట్రంప్ ఆదేశించారు మోడీ పాటించారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. చరిత్ర […]
Read more

ముస్లిం వ్యతిరేక హింస, బుల్డోజర్ అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన జమాతే ఇస్లామీ హింద్!

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేక హింసపై జమాతే-ఇ-ఇస్లామీ హింద్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ముస్లిం ఇళ్ళు, మదర్సాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి బుల్డోజర్లను వినియోగాన్ని తీవ్రంగా ఖండించారు. “మూక దాడులకు పాల్పడటం అన్యాయం”: JIH అలీఘర్‌లో నలుగురు ముస్లిం మాంసం వ్యాపారులపై జరిగిన దారుణమైన దాడిని జేఐహెచ్‌ ఉపాధ్యక్షుడు మాలిక్ మోహతసిమ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. “కోపంగా ఉన్న ఒక గుంపు ఈ వ్యక్తులను అడ్డగించి, వారి బట్టలు […]
Read more
1 99 100 101 102 103 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.