Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణలో ఈనెల 30 నుండి జూనియర్ డాక్టర్ల సమ్మె!

హైదరాబాద్: తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె సైరన్‌ మోగించారు. సమ్మెనుంచి అత్యవసర సేవలను మినహాయించారు. తమ సమస్యలపై రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడంతో 30వ తేదీ నుండి రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలల్లో నిరవధిక సమ్మెను ప్రారంభించనున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (T-JUDA) ప్రకటించింది. నవంబర్ 2024 నుండి తాము ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శికి, ఆరోగ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదన్నారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ […]
Read more

తెలంగాణలోని 339 గ్రామాల నుండి ఆదివాసీలను తరలించడాన్ని వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు!

హైదరాబాద్: టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో కుమ్రం-భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని 339 గ్రామాల నుండి ఆదివాసీలను తరలించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) తీవ్రంగా వ్యతిరేకించింది. గురువారం, సిర్పూర్ (యు), వాంకిడి, జైనూర్, కెరమేరి, ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్, నార్నూర్, సిర్పూర్ (టి), చింతల మాసపల్లి, గాజుగూడ, బెజ్జూర్, లింగాపూర్, పెంచికల్‌పేట్ మండలాల్లోని ఆదివాసీలు తమ నివాసాలను వదిలి వెళ్ళవలసి వస్తోందని హైలైట్ చేస్తూ సిపిఐ (ఎం) రాష్ట్ర ప్రభుత్వానికి ఒక […]
Read more

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: ఇరాన్‌కు వ్యూహాత్మక లాభాలు, ఇజ్రాయెల్‌కు భారీ నష్టాలు!

న్యూఢిల్లీ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది, ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న అపోహలను బద్దలు కొట్టి, ఈ ప్రాంతంలో కొత్త శక్తిగా అవతరించింది. ఇజ్రాయెల్‌ను సాంకేతికంగా ఉన్నతమైందని, సైనికపరంగా ఆధిపత్య శక్తిగా పరిగణించినప్పటికీ, ఇటీవలి యుద్ధంలో దాని రక్షణ వ్యవస్థల డొల్లతనం బహిర్గతం చేసింది. మరోవైపు ఇరాన్…అమెరికా-ఇజ్రాయెల్ నేతృత్వంలోని బహుముఖ సైనిక, దౌత్య దాడి నుండి బయటపడటమే కాకుండా, దాని నాయకత్వం చెక్కుచెదరలేదు. క్షిపణి కార్యక్రమం కార్యాచరణ, […]
Read more

వంటమనిషిగా దళిత మహిళ…పాఠశాల నుంచి వెళ్లపోయిన విద్యార్థులు!

బెంగళూరు: దళిత మహిళను వంటమనిషిగా నియమించారని విద్యార్థులు ఆ బడికి రాకుండా మానేశారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హొమ్మ గ్రామంలోని ఒక పాఠశాల ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు అందరు విద్యార్థులు పాఠశాలను విడిచిపెట్టారు. ఆ స్కూల్‌లోని మొత్తం 22 మంది విద్యార్థుల్లో 21 మంది తల్లిదండ్రులు బదిలీ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇతర పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వంటమనిషిగా దళిత మహిళను నియమించిన వెంటనే తల్లిదండ్రులు నిరాశ చెందారు. పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనం […]
Read more

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండ…రక్తమోడిన గాజా!

గాజా: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణతో యుద్ధం ఆగిపోయింది. అయితే రక్తపిపాసి ఇజ్రాయెల్‌ మాత్రం పాలస్తీనియన్లను చంపటం ఆపలేదు. తన దేశంపై ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించగానే మానవత్వం ఎక్కడుంది అంటూ గగ్గోలు పెట్టిన ఇజ్రాయెల్‌… గాజా ప్రజలపై మాత్రం వైమానిక దాడులతో విరుచుకు పడుతోంది. ఆహారం కోసం వేచి ఉన్న ప్రజలను విచక్షణరహితంగా చంపేస్తోంది. మధ్య గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 18 మంది మరణించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గడచిన 24 గంటల్లో […]
Read more

మాదకద్రవ్యాలపై వేటకు ‘ఈగల్’ వస్తోంది!

హైదరాబాద్: గంజాయి సాగు, నిషేధిత మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌ అంతర్-రాష్ట్ర రవాణాను అరికట్టడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ప్రత్యేక ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE)గా అప్‌గ్రేడ్ చేసి పేరు మార్చినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నిన్న ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. EAGLE టీమ్‌లోని సిబ్బంది కోసం మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక శిక్షణ […]
Read more

ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ…యుద్ధంలో గెలిచిందెవరు?

హైదరాబాద్ : ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ముగిసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటించాడు. ఈమేరకు కీ తాను ఎంతో కోరుకునే నోబెల్ శాంతి బహుమతిని పొందుతానని ట్రంప్‌ ఆశిస్తున్నాడు. అన్నింటికంటే, ఒబామా పెద్దగా ఏమీ చేయకుండానే దానిని పొందాడు. ఇక నుంచి చాలా వరకు మరచిపోయిన పాలస్తీనియన్ బాధలు మళ్ళీ వెలుగులోకి రానున్నాయి. గాజా పాలస్తీనియన్ల సామూహిక ఆకలి, “సహాయ కేంద్రాలపై” ఇజ్రాయెల్‌ దాడులు…నిరాశ, ఆకలితో ఉన్న ప్రజలను రోజువారీ వేటాడటం వంటి అంశాలే […]
Read more

వెండి ప్లేట్లలో విందు భోజనం…మహారాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంపై వివాదం!

మహారాష్ట్ర: ముంబైలో జరిగిన పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం వివాదంలో చిక్కుకుంది, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా డబ్బు ఖర్చు చేసిందని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ వెండి ప్లేట్లపై అతిథులకు వడ్డించడం ద్వారా “విలాసవంతమైన” విందు ఇచ్చిందని మహారాష్ట్ర కాంగ్రెస్, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. అసలేం జరిగిందంటే… ముంబైలోని విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించిన రెండు రోజుల కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 600 మంది అతిథులు హాజరయ్యారు. అతిథులు […]
Read more

హైదరాబాద్‌లో కో-లివింగ్ హాస్టళ్లను నిషేధించాలని కోరిన కాంగ్రెస్ నేత విహెచ్‌!

హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్‌లో కోలివింగ్ హాస్టళ్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. నగరానికి నిత్యం వేలాది మంది యువత ఉ పాధి, ఉద్యోగం, చదువు కోసం వస్తుంటారు. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వస్తారు. అయితే కొందరు వీటిని అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంత రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ […]
Read more

ఎమర్జెన్సీకి 50 ఏళ్లు…పరస్పరం విమర్శలు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కత్తులు దూసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ సంఘటనను “ప్రజాస్వామ్యాన్ని అరెస్టు చేసిన” కాలంగా స్మరించుకున్నారు. అత్యవసర పరిస్థితిలో తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తగా గడిపిన సమయాన్ని వివరించే పుస్తకాన్ని ప్రచారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం అదే పుస్తకాన్ని విడుదల చేస్తూ, […]
Read more
1 142 143 144 145 146 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.