Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

శాంటాను భయపెడుతున్న సంఘ్…భయం గుప్పిట్లో క్రిస్మస్!

న్యూఢిల్లీ: క్రిస్మస్ రోజున జన్మించిన దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకార్థం డిసెంబర్‌ 25ను… బీజేపీ సుపరిపాలన దివస్‌గా ప్రకటించడం ఒకింత ఆసక్తి రేకెత్తించింది . ఇక ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం క్రిస్మస్ రోజు పాఠశాలల్లో హాజరును తప్పనిసరి చేసింది. గైర్‌హాజరైతే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామంది. కాగా, క్రిస్మస్ రోజున, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఒక కేథడ్రల్‌ను సందర్శించనున్నారు. మోడీ సందర్శన నిమిత్తం అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటన […]
Read more

భారతదేశ ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం విజయవంతం!

న్యూఢిల్లీ: భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ‘బాహుబలి’ రాకెట్‌గా పేరొందిన అమెరికాకు చెందిన ‘బ్లూ బర్డ్‌ 2’ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. భారత్‌- అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం ఈరోజు ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు. 24 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత, రెండు S200 సాలిడ్ బూస్టర్‌ల మద్దతుతో 43.5 మీటర్ల పొడవైన రాకెట్ ఉదయం 8గంటల 55 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ […]
Read more

అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు!

వాషింగ్టన్‌: అమెరికాలో అక్రమంగా ఉంటున్న30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్‌లను అరెస్ట్‌ చేశారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్‌లో జరిగిన తనిఖీల్లో ఈ అరెస్టులు జ‌రిగాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) వెల్లడించింది. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌తో దొంగతనంగా సెమీ ట్రక్కులు నడుపుతున్నారని, మరికొందరు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు ఇంటర్ స్టేట్ హైవేలు, ఇమిగ్రేషన్ […]
Read more

ఇజ్రాయెల్-గ్రీస్-సైప్రస్ శిఖరాగ్ర సమావేశం…టర్కీని హెచ్చరించిన నెతన్యాహు!

హ్యూస్టన్(USA): తూర్పు మధ్యధరా ప్రాంతంలో టర్కీ ప్రాంతీయ పాత్ర,సైనిక ఉనికి నేపథ్యంలో, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ నాయకులు తాజాగా జెరూసలేంలో త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ…”ఓట్టోమన్‌ సామ్రాజ్యాలను పునరుద్ధరించాలని కలలు కనే వారు అలాంటి భావనలను తమ మనస్సుల నుండి తొలగించుకోవాలని” టర్కీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ త్రైపాక్షిక సమావేశం కేవలం దౌత్యపరమైన సమావేశం కాదని, తూర్పు మధ్యధరాలో కొత్త కూటమి అని ఇజ్రాయెల్ ప్రధాన […]
Read more

నేడు కొత్త సర్పంచులతో ‘లంచ్‌’ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికైన కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించనున్నారు. వారంరితో కలిసి ఈరోజు మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ఈరోజు కోస్గిలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సమ్మేళనంలో… సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో సీఎం ముఖాముఖి చర్చలు జరుపుతారు. గ్రామ అభివృద్ధి, స్థానిక […]
Read more

లౌకికవాదం కారణంగా దేశం ఇప్పటికీ ‘సమస్యలను’ ఎదుర్కొంటోంది…కేంద్ర మంత్రి గడ్కరీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంపై ఉన్న ఆలోచనలు, దాని ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దేశం… ఇప్పటికీ “హిందూ-ముస్లిం సమస్యలను” ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ…ఆంగ్ల పదం “సెక్యులర్”కు హిందీలో “సర్వ ధర్మ భావ” అని, ఆంగ్లంలో “అందరికీ న్యాయం, ఎవరినీ బుజ్జగించకపోవడం” అని అర్థం. అయితే కాంగ్రెస్ తన ఆలోచనల ఆధారంగా వర్ణించినట్లుగా “ధర్మనిరపేక్ష” అని కాదని గడ్కరీ అన్నారు. “1947 తర్వాత, దేశాన్ని పాలించే […]
Read more

భారత్‌తో చేదు సంబంధాలు కోరుకోవడం లేదు…బంగ్లాదేశ్‌ నేత!

ఢాకా: భారత్ వంటి పెద్ద పొరుగు దేశంతో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం “చేదు సంబంధాలు” కోరుకోవడం లేదని, దానికి బదులుగా న్యూఢిల్లీతో సంబంధాలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలేహుద్దీన్ అహ్మద్ తెలిపారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని అన్నారు. బంగ్లాదేశ్ దినపత్రిక ‘దేశ్ రూపాంతర్’ ప్రకారం… ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ వ్యక్తిగతంగా ఉద్రిక్తతలను తగ్గించడానికి, న్యూఢిల్లీతో సంబంధాలలో […]
Read more

మూక ఉన్మాదానికి బలిపీఠం కావాలా? బంగ్లాదేశ్ ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయమిది!

ముహమ్మద్ ముజాహిద్, 9640622076 బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లాలో 25 ఏళ్ల యువకుడు దీపు చంద్ర దాస్‌పై జరిగిన అమానుష హత్య, కేవలం ఒక మైనారిటీ పౌరుడి ప్రాణహరణ మాత్రమే కాదు; అది ఆ దేశ ప్రజాస్వామ్య విలువలకు, చట్టబద్ధ పాలనకు తగిలిన పరాభవం. కేవలం వదంతుల ఆధారంగా, ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక మనిషిని కట్టేసి, చిత్రహింసలు పెట్టి, సజీవ దహనం చేయడం అనేది ఆధునిక నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. వేలమంది ప్రేక్షకులు […]
Read more

మహారాష్ట్ర స్థానిక ఫలితాల తర్వాత ఐక్యతా రాగం…రాహుల్ గాంధీకి పిలుపు!

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం కేవలం 24 గంటల్లోనే గణనీయంగా మారిపోయింది. ఆదివారం వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని అధికార కూటమిలో ఉత్సాహాన్ని నింపగా, ప్రతిపక్ష శిబిరంలో ఆందోళన గంటలు మోగించాయి. తాజా పరిణామాలు బీజేపీ బలమైన ప్రదర్శన కారణంగా ప్రతిపక్షాలు తమ కూటమిలోని అంతర్గత విభేదాలను పునఃపరిశీలించుకోవలసి వచ్చిందని సూచిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు గెలుచుకున్న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన సీనియర్ […]
Read more

ఎన్‌ఐఏ చరిత్రలో తొలిసారిగా ‘నేరాంగీకారం’ అనే పదం పాపులర్ అయింది!

ఎన్‌ఐఏ దర్యాప్తు తీరుపై ‘ద వైర్‌’ సమగ్ర కథనం బెంగళూరు/హైదరాబాద్: ఒబైద్-ఉర్-రెహమాన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆరు నెలలకు పైగా గడిపిన తర్వాత, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)తో సహా పలు ఏజెన్సీలు జైలులో ఉన్న అతడిని ఆకస్మికంగా సందర్శించడం ప్రారంభించాయి. 2012 ఆగస్టులో అరెస్ట్ అయినప్పుడు కేవలం 21 ఏళ్ల వయస్సున్న, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన రెహమాన్, లష్కర్-ఎ-తయ్యబా (ఎల్‌ఈటీ) అనే ఉగ్రవాద సంస్థలో భాగస్వామ్యం ఉన్నాడనే ఆరోపణలపై, బెంగళూరులో మితవాద […]
Read more
1 17 18 19 20 21 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.