Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఐఆర్‌ఎఫ్‌సీ రుణం నిలిపివేత…ఈ వైఫల్యానికి బాధ్యులు ఎవరు?

హైదరాబాద్: ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) రుణం విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యులు ఎవరు? రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలోని ఉన్నతాధికారుల మదిలో ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్నగా మారింది. ఎందుకంటే, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) మంజూరు చేసిన రూ. 13,600 కోట్ల రుణాన్ని, పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి దశను (Phase I) ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడానికి ఆ ప్రాజెక్ట్ రుణాలను పునర్వ్యవస్థీకరించడానికి (refinancing) […]
Read more

అయోధ్య నిధుల దుర్వినియోగంపై స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, ‘అప్నా జనతా పార్టీ’ అధినేత స్వామి ప్రసాద్ మౌర్య… శ్రీరాముడు, అయోధ్య రామమందిర నిధుల దుర్వినియోగంపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ, మతపరమైన వివాదానికి కారణమయ్యారు. ఈమేరకు మౌర్య ఒక సభలో మాట్లాడుతూ… రామమందిరం పేరుతో “కోట్లాది రూపాయలు” దోచుకున్నారని ఆరోపించారు.”కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఆ దోపిడీదారులు రాముడి ఆలయం నుండే డబ్బును కాజేశారు. కానీ శ్రీరాముడు ఆ దోపిడీదారులను శిక్షించలేకపోతే, ఇక మీకు మేలు ఎలా చేయగలడు?” అని దైవ […]
Read more

యూపీలో కార్మికులపై అఘాయిత్యాలు…మానవ గౌరవంపై దాడిగా అభివర్ణించిన రాహుల్!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో వెట్టిచాకిరి కార్మికులపై జరుగుతున్న హింస, దోపిడీని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనను “మానవ గౌరవంపై దాడి”గా అభివర్ణించారు. బాధితులకు న్యాయం, పునరావాసం కల్పించాలని, బాధ్యులకు అత్యంత కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. మండి గ్రామంలోని ఒక పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్‌పై పోలీసులు దాడి చేసి, మైనర్లతో సహా 12 మంది వెట్టిచాకిరి కార్మికులను రక్షించిన […]
Read more

వచ్చే వారం అమెరికా-ఇరాన్ సాంకేతిక చర్చలు పునఃప్రారంభం…అమెరికా!

వాషింగ్టన్‌: ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఒక సమగ్ర ఒప్పందంగా మార్చే ప్రయత్నాలలో భాగంగా, అమెరికా, ఇరాన్‌ల మధ్య సాంకేతిక స్థాయి చర్చలు వచ్చే వారం పునఃప్రారంభమవుతాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈమేరకు కువైట్ పర్యటన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ… సాంకేతిక బృందం జూన్ 29 లేదా 30 తేదీలలో స్విట్జర్లాండ్‌లో తిరిగి సమావేశమయ్యే అవకాశం ఉందని రూబియో చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌ల మధ్య […]
Read more

టీఎంసీ బ్యాంకు ఖాతాలపై నిఘా…ఐదేళ్ల లావాదేవీలపై సైబర్ పోలీసులు దర్యాప్తు!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. దోపిడీ వసూళ్లు, అక్రమ కమీషన్ డబ్బును మళ్లించడానికి ఈ ఖాతాలను ఉపయోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవంక ఈ మూడుబ్యాంకు ఖాతాలపై బిధాన్నగర్ నగర పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం సమగ్ర ఫోరెన్సిక్ పరీక్షను ప్రారంభించింది. ఈ దర్యాప్తుకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, ఉత్తర 24-పరగణాల జిల్లాలోని బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ […]
Read more

ఎస్ఐఆర్ దృష్ట్యా ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణకు సౌదీ తెలుగు సంఘం విజ్ఞప్తి!

హైదరాబాద్: ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) దృష్ట్యా, ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐల) ఓటు హక్కులను పరిరక్షించాలని సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) అధ్యక్షుడు శ్రీనివాస్… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కోరారు. విదేశాలలో నివసిస్తున్న పౌరులకు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అవగాహన ప్రచారాలు నిర్వహించాలని, ఆన్‌లైన్ ఓటరు నమోదు, సంబంధిత సేవలను బలోపేతం చేయాలని శ్రీనివాస్ కోరారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR ఇంటింటా […]
Read more

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలు… ఎన్‌జీఓ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి దెబ్బ!

న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలకు కేంద్రం చేసిన సవరణలు, భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జీఓలు), పౌర సమాజ సమూహాలపై ప్రభుత్వ నియంత్రణ ఆందోళనకరంగా పెరగడాన్ని సూచిస్తున్నాయి. అధికారికంగా పారదర్శకత, జవాబుదారీతనంపై దృష్టి సారించినప్పటికీ, ఈ మార్పుల విస్తృతి, ఎన్‌జీఓ రంగం స్వయంప్రతిపత్తిని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ప్రభుత్వం నిర్దేశించిన “షెడ్యూల్” నుండి ఎన్‌జీఓలు తమ ఉద్దేశ్యాలను, కార్యకలాపాల రంగాలను ఎంచుకోవాల్సి రావడం ఒక కీలకమైన మార్పు. […]
Read more

దేశంలో ఎల్ నినో ప్రభావం…111 జిల్లాలపై ఎఫెక్ట్!

న్యూఢిల్లీ: ఎల్ నినో కారణంగా 43 శాతం వర్షపాతం లోటు ఏర్పడటంతో ఖరీఫ్ సాగుకు ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో, పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉన్న 111 జిల్లాలను ప్రభుత్వం గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. బలహీనమైన రుతుపవన పరిస్థితులు జూలై 2 వరకు కొనసాగే అవకాశం ఉందని, దీంతో ఖరీఫ్ (వేసవి) పంట వేయడానికి రైతులకు తక్కువ సమయం మిగులుతుందని చౌహాన్ అన్నారు. జూన్ 22 నాటికి, […]
Read more

ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ…ఇరాన్ యుద్ధాన్ని నిలిపివేయాలని అమెరికా సెనేట్ ఓటు!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఇరాన్‌పై సైనిక చర్యలకు, యుద్ధ వాతావరణానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ అమెరికా సెనేట్ ఒక కీలకమైన తీర్మానాన్ని ఆమోదించింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ప్రజాదరణ లేని సంఘర్షణపై కొందరు రిపబ్లికన్లలో పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తూ, ఈ నెల ప్రారంభంలో ప్రతినిధుల సభ ఆమోదించిన యుద్ధ అధికారాల తీర్మానానికి సెనేట్ 50-48 ఓట్లతో అనుకూలంగా ఓటు వేసింది. 1973 నాటి యుద్ధ అధికారాల తీర్మానం […]
Read more

ప్రధాని మోదీ ప్రచారం కోసం ఈ ఆరేళ్లలో 2,586 కోట్లు ఖర్చు…RTI ద్వారా వెల్లడి!

న్యూఢిల్లీ: మాజీ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తు ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం, 2020 నుండి వివిధ మాధ్యమాల ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రచారం చేసే ప్రకటనల కోసం కేంద్రం రూ. 2,586 కోట్లు ఖర్చు చేసింది. ఈమేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) జూన్ 16న విడుదల చేసిన ఈ గణాంకాలు, 2020-21, […]
Read more
1 18 19 20 21 22 214

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.