Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తమిళనాడులో ఎస్ఐఆర్…97.4 లక్షల ఓటర్లను తొలగింపు!

చెన్నై: తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుండి మొత్తం 97.4 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర ఓటర్ల జాబితాలో 5.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 27 నాటికి ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆమె చెప్పారు.కొత్త ముసాయిదా ప్రకారం మొత్తం ఓటర్ల జాబితాలో […]
Read more

‘క్యాష్ ఫర్ క్వైరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు ఊరట!

న్యూఢిల్లీ: ‘క్యాష్ ఫర్ క్వైరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై చార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐకి అనుమతి మంజూరు చేస్తూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు ఈరోజు రద్దు చేసింది. మోయిత్రా పిటిషన్‌పై జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ… “ఆ ఉత్తర్వు రద్దు చేసాం. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం… సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఒక నెలలోపు అనుమతి మంజూరుపై పునఃపరిశీలన […]
Read more

యువ నాయకుడి హత్య తర్వాత బంగ్లాదేశ్‌లో నిరసనలు!

ఢాకా: బంగ్లాదేశ్‌లో 2024 విద్యార్థి ఉద్యమానికి కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన షరీఫ్ ఉస్మాన్ హదిపై కాల్పులు జరగడంతో తీవ్రంగా గాయపడి, సింగపూర్‌లోని ఆసుపత్రిలో మరణించడంతో దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. వేలాది మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలో ఢాకాలోని కొన్ని పత్రికా కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, ముహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హాదీ మరణాన్ని “దేశానికి తీరని లోటు”గా […]
Read more

నేటినుంచే హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌!

హైదరాబాద్‌: హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌కు వేళయింది. ఈ పుస్తక ప్రదర్శన నేటినుంచి ఈనెల 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. మద్యాహ్నం ఒంటిగంటనుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది. ఈ ఏడాది ప్రదర్శనను పుస్తకాల స్ఫూర్తిని చాటిచెప్పేలా, పిల్లల కోసం పండుగ వాతావరణాన్ని సృష్టించేలా ప్రణాళిక వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్‌ఫెయిర్‌లో మొత్తం 365 స్టాళ్లు, పఠనం ప్రాముఖ్యతను బలోపేతం చేసే లక్ష్యంతో అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పుస్తకాల కొనుగోలు, అమ్మకాలకు అతీతంగా ఈ […]
Read more

ఈ ఏడాది భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా ఏం వెతికారో తెలుసా?!

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన అంశాల జాబితాను ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. టాప్ ట్రెండింగ్‌లను వెల్లడించింది. మొత్తం టాప్ టెన్ సెర్చ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొదటి స్థానంలో నిలిచి…భారత్‌లో క్రికెట్‌కు ఉన్న అభిమానాన్ని మరోసారి ఈ నివేదిక నిరూపించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఈ ఏడాది ఐపీఎల్‌ కప్పును గెలవడంతో, ఈ సలా కప్‌ నమ్‌దే’ అనే హ్యష్‌ట్యాగ్‌ […]
Read more

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూనే ఉన్నారు…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ 66 శాతం గ్రామ పంచాయతీలను గెలుచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరిగిన 12,702 గ్రామ పంచాయతీలలో, కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు 7,527 చోట్ల విజయం సాధించగా, పార్టీ రెబల్ అభ్యర్థులు 808 గ్రామాలను కైవసం చేసుకున్నారని ఆయన తెలిపారు. “అది పట్టణమైనా, గ్రామీణమైనా, గత రెండేళ్లుగా జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికలలో ప్రజలు మా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు,” అని ముఖ్యమంత్రి ఇక్కడ […]
Read more

గాజా స్థిరీకరణ దళం ఏ ఒక్క పక్షానికి మద్దతు ఇవ్వకూడదు…ఖతార్‌!

వాషింగ్టన్‌: కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం గాజాలో మోహరించనున్న ప్రతిపాదిత స్థిరీకరణ దళం ఏ ఒక్క పక్షానికి మద్దతు ఇవ్వకూడదని ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థాని అన్నారు. వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సమావేశాల తర్వాత…ఖతార్‌కు చెందిన అల్ జజీరా ఛానెల్‌తో మాట్లాడుతూ, గాజాలో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలపై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి ఉల్లంఘనలు మధ్యవర్తులను “ఇబ్బందికరమైన […]
Read more

ఢిల్లీలో పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ లేకుంటే పెట్రోల్‌, డీజిల్‌ ‘నో’!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠినమైన కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు నుండి బీఎస్-VI ఇంజన్లు లేని వాహనాలను ఢిల్లీలోకి అనుమతించడం లేదు. అలాగే కాలుష్య ధృవీకరణ పత్రం లేని వాహనాలకు బంకుల్లో పెట్రోల్ పోయరు. కాగా, ఢిల్లీలోకి పాత కార్లకు ప్రవేశం లేదన్న నిర్ణయం… సమీపంలోని గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుండి ఢిల్లీలోకి ప్రవేశించే 12 లక్షల వాహనాలపై […]
Read more

ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లు తెలంగాణలోనే అత్యధికం!

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో… 5,149 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో దాదాపు 70 శాతం పాఠశాలలు తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనే ఉన్నాయని తెలిపింది. ఈమేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన ఒక నివేదికలో ఈ డేటాను వెల్లడించింది. నివేదిక ప్రకారం…విద్యార్థులు లేని 2,081 పాఠశాలలతో తెలంగాణ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 1,571 పాఠశాలలతో […]
Read more

గాజా యుద్ధ నేరాల దర్యాప్తును నిలిపివేయాలన్న ఇజ్రాయెల్ విజ్ఞప్తికి ‘నో’ అన్న క్రిమినల్‌ కోర్టు!

గాజా: పాలస్తీనాలో జరిగిన యుద్ధ నేరాలపై దర్యాప్తును ఆపేయాలన్న ఇజ్రాయెల్ పిటిషన్‌ను… అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తిరస్కరించింది. గత రెండేళ్లుగా గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్ నేరాలను దర్యాప్తు చేయడానికి ICC ప్రాసిక్యూటర్‌ను అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని రద్దు చేయడానికి ICCలోని న్యాయమూర్తులు నిరాకరించారు. దీంతో కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధ నేరాలపై దర్యాప్తును కొనసాగించడానికి ICCకి వీలు కల్పిస్తుంది. 2024 నవంబర్‌లో ICC… ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు… మాజీ రక్షణ […]
Read more
1 19 20 21 22 23 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.