Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్‌లో జరిగే అవకాశం!

హైదరాబాద్: నిన్న కేబినెట్‌ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం… తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్‌లో ఉండే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, ఇదే ఊపు మీద స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాన్ని నిర్వహించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించిందని, ఆ తర్వాత స్థానిక సంస్థల […]
Read more

గాజా శాంతి ప్రణాళికపై అమెరికా ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించిన భద్రతా మండలి!

న్యూయార్క్‌: గాజా పాలన, పునర్నిర్మాణం, భద్రతను పర్యవేక్షించడానికి అంతర్జాతీయ స్థిరీకరణ దళమైన “బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌”ని ఏర్పాటు చేసే తీర్మానాన్ని UN భద్రతా మండలి ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 13 ఓట్లు వచ్చాయి, చైనా, రష్యా గైర్హాజరయ్యాయి. ఓటింగ్‌కు ముందు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ మాట్లాడుతూ… “నేడు, మంటలను ఆర్పి శాంతి మార్గాన్ని వెలిగించే శక్తి మనకు ఉంది” అని అన్నారు. “ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మాన ముసాయిదా… అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ […]
Read more

ఆ నలుగురికి ఢిల్లీ పేలుడుతో సంబంధం లేదని తేల్చిన ఎన్‌ఐఏ!

న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో కారుబాంబు పేలుడుకు సంబంధించి దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ పేలుడుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న ముగ్గురు వైద్యులు సహా నలుగురిని ‘ఎన్‌ఐఏ’ విడుదల చేసింది. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో వారికి ఎటువంటి సంబంధం లేదని దర్యాప్తు అధికారులు నిగ్గు తేల్చారు. విడుదలైన వ్యక్తులు – డాక్టర్ రెహాన్, డాక్టర్ ముహమ్మద్, డాక్టర్ ముస్తకీమ్, ఎరువుల వ్యాపారి దినేష్ సింగ్లా – వీరందరినీ ఇటీవల హర్యానాలోని నుహ్‌లో అరెస్టు చేసారు. […]
Read more

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమి…గంభీర్, అగార్కర్‌ను విమర్శించిన మాజీలు!

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. 15 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు ఇది తొలి టెస్ట్ ఓటమి. కాగా, అనూహ్య ఓటమి తర్వాత భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ సెలెక్టర్లు, జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. ఈడెన్ గార్డెన్స్‌లో మొదటి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిన తర్వాత 3వ రోజున భారత్‌ను ప్రోటీస్ ఓడించింది. 124 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ […]
Read more

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం…42 మంది భారతీయుల దుర్మరణం!

రియాద్‌: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 42 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. భారతీయ యాత్రికులతో ఉమ్రా పర్యటనలో ఉన్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌ వాసులు కావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటన భారత కాలమాన ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 1:30 సమయంలో జరిగింది. ఉమ్రా యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ముఫరహత్​ ప్రాంతంలో […]
Read more

‘ఏఐఏడీఎంకే’ ఢిల్లీకి అమ్ముడుపోయింది…సీఎం స్టాలిన్‌!

చెన్నై: తమిళనాడు విపక్ష పార్టీ అయిన ఏఐఏడీఎంకేపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. ప్రతి రాజకీయ పార్టీ ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా…”సిగ్గు లేకుండా” ఆ పార్టీ SIRకు మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. AIADMK “తన పార్టీని ఢిల్లీకి అమ్మేసింది” అని, రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షంగా పనిచేయడంలో విఫలమైందని స్టాలిన్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం AIADMK “శత్రువు పార్టీగా కూడా మారదు” అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ED,IT వంటి […]
Read more

రేపు అమెరికా వెళ్లనున్న సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమ్మద్ బిన్ సల్మాన్‌!

వాషింగ్టన్: సౌదీ అరేబియా క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమ్మద్ బిన్ సల్మాన్‌ రేపటినుంచి అమెరికాలో పర్యటించనున్నారు. సౌదీ-ఇజ్రాయెల్ సంబంధాలు సాధారణ స్థితికి వచ్చేలా చూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ – అరబ్ దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలను అధికారికం చేసిన అబ్రహం అకార్డ్స్‌ను పొడిగించాలని అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నందున మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తీసుకురావాలనేది ఆయన ప్రణాళికలో కీలకం. రేపు వైట్ […]
Read more

‘ఇది ఓటు చోరీ కాదు, ఓటు దోపిడీ’…అఖిలేష్ యాదవ్!

బెంగళూరు: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓటు దొంగతనం ఆరోపణలకు మద్దతు ఇచ్చారు. ‘విజన్ ఇండియా: స్టార్టప్ సమ్మిట్’లో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ…ఇది కేవలం ‘ఓట్ల దొంగతనం’ కాదు, ‘దోపిడీ’ అని అన్నారు. “ఇది చోరీ కాదు. చోరీ ఒక చిన్న దొంగతనం. ఇది దోపిడీ. బహిరంగంగా జరిగింది” అని అఖిలేష్‌ యాదవ్ అన్నారు. దేశంలో ఉద్దేశపూర్వకంగా ఓటు దొంగతనం జరిగిందని […]
Read more

‘పారిపోతున్న బంగ్లాదేశీయులు’అంటూ బెంగాల్‌లో ‘మీడియా’ హడావుడి!

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ పేరిట మీడియా హడావుడి ఎక్కువయింది. ఇక్కడ ఒక సంఘటనను పరికిస్తే… కోల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్‌లో సచివాలయానికి ఎదురుగా గుడిసెల సమూహం ఉంది. గత వారాంతంలో అక్కడే గందరగోళం చెలరేగింది. చేతిలో కెమెరాలు పట్టుకుని జర్నలిస్టుల బృందం ఒక యువకుడిని వెంబడించింది. ఆ వ్యక్తి రఫీకుల్ సర్దార్, నగరంలో నివసించే దినసరి కూలీ. సర్దార్ కుటుంబం సౌత్ 24 పరగణాలలోని జాయ్‌నగర్-I బ్లాక్‌లోని దోసా గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామ్‌నగర్ గ్రామ వాసులు. […]
Read more

కేసీఆర్‌ క్రియాశీల రాజకీయాల్లో లేరు…సీఎం రేవంత్‌రెడ్డి విమర్శ!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలను తీవ్రతరం చేశారు, ఆ అనుభవజ్ఞుడైన నాయకుడు “రాజకీయాల్లో చురుగ్గా లేరు” అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించిన సందర్బంగా నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… “కేసీఆర్ రాజకీయాల్లో చురుగ్గా లేరు. నేను అలాంటి వ్యక్తిని విమర్శించాలనుకోవడం లేదు. కేటీఆర్ తన అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాలని, హరీష్ రావు తన అసూయను తగ్గించుకోవాలని కూడా సలహా […]
Read more
1 31 32 33 34 35 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.